మీరు మంచి 7 సీట్ల కారు కొనాలని చూస్తున్నారా? మీకోసమే ఈ వార్త. టాటా మోటార్స్ తన టాటా సఫారీ క్లాసిక్లో అద్భుతమైన అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్ను అందిస్తుంది. ఈ కారు ధర కూడా మధ్యతరగతి బడ్జెట్కు సరిపోతుంది! ఈ కారును ఇటీవల జరిగిన ఆటో ఎక్స్పో 2025లో ప్రవేశపెట్టారు. ఈ సంవత్సరం ఈ కారు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారు ఎందుకు బెస్ట్? దీని ఫీచర్లు, ఇంజిన్ సామర్థ్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మారుతి సుజుకి ఇండియా కొత్త మోడల్ సెలెరియోను విడుదల చేసింది. ఇందులో భద్రత కోసం 6 ఎయిర్బ్యాగ్లు కూడా అమర్చింది. అంతేకాదు లేటెస్ట్ అప్డేట్తో కంపెనీ ఈ కారు ధరను కూడా పెంచింది. ప్రస్తుతం ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.64 లక్షలుగా ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ .7.37 లక్షలుగా కంపెనీ ప్రకటించింది.
టీవీ చూస్తూ అన్నం తినడం అలవాటుగా మారిపోయింది. తినేటప్పుడు టీవీ చూడొద్దని పెద్దలు చెబుతుంటారు. కానీ వాళ్ల మాటలు ఎవ్వరూ పట్టించుకోరు. పిల్లలకు తల్లిదండ్రులే ఫోన్, టీవీలు చూస్తూ తినిపిస్తుంటారు. ఇది వాళ్లకు అస్సలు మంచిది కాదు. టీవీ లేదా ఫోన్ చూస్తూ భోజనం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తినే పటప్పుడు ఫోన్, టీవీ చూస్తే.. స్థూలకాయానికి గురయ్యే ప్రమాదం ఉందట.
రాబోయే కొన్ని రోజుల్లో కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే మీకు శుభవార్త మీ కోసమే. ఫిబ్రవరి 2025 లో అనేక ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు తమ ప్రసిద్ధ మోడళ్లపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఈ తగ్గింపు గరిష్టంగా రూ. 4 లక్షల వరకు ఉంటుంది. డిస్కౌంట్లో లభించే ఈ మోడళ్లలో ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉన్నాయి. ఈ ఆఫర్లో నగదు తగ్గింపుతో పాటు, ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా వర్తిస్తుంది. డిస్కౌంట్ గురించి మరిన్ని వివరాల […]
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముప్పాళ్ల మండలంలోని బొల్లవరం పరిధిలోని మాదల మేజర్ కాలవ కట్టపై ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ముప్పాళ్ల మండలంలోని చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన మహిళా కూలీలు మిరపకోతలకు వెళ్లి తిరిగి గ్రామానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది.
మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా వారికి మాత్రం రక్షణ లేకుండాపోతుంది. యేడాదికేడాది హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. జిల్లాలోని మారుమూల గ్రామాల్లో సైతం మహిళలు, బాలికలకు వేధింపులు తప్పడం లేదు. పురుషాధిక్య సమాజంలో ఆమె ఒక సమిధగా మారుతున్నది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మైనర్ బాలికలపై అత్యాచార ఘటనలు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది..
రోహిత్ శర్మ చాలా కాలం విఫలమవుతున్నాడు. కానీ ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ తుఫాను ఇన్నింగ్స్ ఆడి 76 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. 16 నెలల తర్వాత రోహిత్ వన్డేల్లో సెంచరీ సాధించాడు. 7 సిక్స్ లు, 9 ఫోర్లతో చెలరేగాడు. వన్డేల్లో రోహిత్ శర్మకి ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. 2023 లో ఆఫ్ఘనిస్తాన్ పై 63 బంతుల్లో సెంచరీ చేశాడు.
అనకాపల్లి జిల్లాలో ఇద్దరు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు.. రాంబిల్లి మండలంలో ఉన్న సముద్రంలో స్నానానికి దిగి ఇంజనీరింగ్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు కెరటాల దాటికి కొట్టుకుపోయారు.. కొత్తపేట గ్రామానికి చెందిన పవన్ తేజ, సూర్య తేజ లుగా గుర్తించారు.. సూర్య తేజ మృతదేహం లభ్యం కాగా పవన్ తేజ ఆచూకీ కోసం గాలిస్తున్నారు..
జనసేన తిరుపతి ఇంఛార్జి కిరణ్ రాయల్పై ఓ మహిళ కోటి ఇరవై డబ్బులు ఇవ్వాలంటూ ఆరోపణలు చేయడం, వీడియోలు బయటకు రావడం సంచలన రేపాయి.2013 లో తీసుకున్న డబ్బులు ఎప్పుడో తిరిగి ఇచ్చేశానని కాని ఇచ్చేసిన డబ్బులను, మార్ఫింగ్ వీడియోలతో వైసీపీ నేతలు ఆ మహిళతో కలసి కుట్ర పన్ని ఇలా చేస్తున్నారంటూ తిరుపతి పోలీసులు కిరణ్ రాయల్ ఫిర్యాదు చేశారు..
అనకాపల్లి జిల్లాలో ఓ మధ్య తరగతి కుటుంబానికి విద్యుత్ శాఖ అధికారులు భారీ షాక్ ఇచ్చారు.. ఒక బల్బు, టీవీ ఉన్న ఇంటికి రూ. 1,60,000 కరెంటు బిల్లు వేశారు. భారీగా వచ్చిన కరెంట్ బిల్లును చూసి కుటుంబీకుల గుండె గుబేల్ మంది.