New Income Tax Bill: రేపే పార్లమెంట్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు?.. ఈ చట్టం ఎప్పటి నుంచి అమలవుతుంది?
- 64 ఏళ్ల నాటి ఆదాయపు పన్ను చట్టం మార్పు
- దాని స్థానంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లు
- గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
64 ఏళ్ల నాటి ఆదాయపు పన్ను చట్టం మారబోతోంది. ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను బిల్లును తీసుకువస్తోంది. దీనిని రేపు అంటే గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు. ఇంతలో దాని ముసాయిదా బయటకు వచ్చింది. ఇది 600 పేజీలకు పైగా ఉంది. ఈ కొత్త చట్టాన్ని ఆదాయపు పన్ను చట్టం 2025 అని పిలుస్తారు. దీనిని ఏప్రిల్ 2026 నుంచి అమలు చేయవచ్చు. పన్ను చెల్లింపుదారులు, నిపుణుల అభిప్రాయాల ఆధారంగా ఈ బిల్లును సవరించవచ్చని వర్గాలు చెబుతున్నాయి. ఈ బిల్లును గత వారం కేబినెట్ ఆమోదించింది.
READ MORE: Vishwak Sen: మిడిల్ ఫింగర్ వివాదంలో విశ్వక్.. నేను ప్రతిసారి తగ్గను?
Also Read
- Petrol-Diesel Price: హార్ముజ్లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- Flipkart Minutes App: Flipkart Minutes ప్రత్యేక యాప్ లాంచ్.. ఇక 10 నిమిషాల్లోనే డెలివరీ, Blinkit- Zeptoకు గట్టి పోటీ!
- PM Surya Ghar Yojana: సామాన్య ప్రజలకు సూపర్ బెనిఫిట్.. 56 లక్షల కుటుంబాలకు జీరో కరెంట్ బిల్ .. ఇదే ఆ స్కీమ్ ! ఒక లుక్ వేయండి..
- Trade War: అమెరికాపై యుద్ధం ప్రకటించిన పొరుగుదేశం! అగ్రరాజ్యం వస్తువులపై 50% టారిఫ్..
ఆదాయపు పన్నుకు సంబంధించిన నిబంధనలను సులువుగా చేయడం, అనవసరమైన నిబంధనలను తొలగించడం, సామాన్యులకు సైతం సులభంగా అర్థమయ్యే విధానంపై ఈ బిల్లు దృష్టి పెడుతుంది. పాత చట్టంలోని వేలాది నిబంధనలు తాజా బిల్లులో తొలగించారు. 1961లో అమలులోకి వచ్చిన పాత చట్టంలో అనేక విభాగాలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఆదాయపు పన్ను చట్టం నుంచి వాటిని తొలగించడం వల్ల ఆ విభాగాలు నిరుపయోగంగా మారాయి. ఈ కొత్త చట్టంలో వాటిని పూర్తిగా తొలగించారు.
READ MORE: 1984 anti-Sikh riots: 1984 సిక్కుల ఊచకోత కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ మాజీ ఎంపీ..
ఇదిలా ఉండగా… కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల తన బడ్జెట్ ప్రసంగంలో ఆదాయపు పన్ను కొత్త శ్లాబ్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో 12 లక్షల వరకు వార్షిక ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండబోదని ఆర్థిక మంత్రి ప్రకటించారు. జీతభత్యాలకు ఈ పరిమితిని రూ.12 లక్షల 75 వేలకు పెంచుతున్నట్లు చెప్పారు. మధ్యతరగతికి మరింతగా ఆదాయపు పన్ను మినహాయింపు ఇస్తే డిమాండ్ పెరుగుతుందని, ఇది ఆర్థిక వ్యవస్థను మళ్లీ వేగంగా కదిలించేలా చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!