చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్ దాడి కేసులో మరో ఏడుగురిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, భద్రాచలంకు చెందిన ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన విషయం తెలిసిందే. మొత్తం 18 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు.
మస్తాన్ సాయి కేసులో పోలీసులు కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు మస్తాన్ సాయిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్లో ఉన్న మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సైబర్ నేరం, లైంగిక దోపిడీ, బ్లాక్ మెయిలింగ్ వంటి దురాగతాల కేసులో యూట్యూబర్ మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసింది. కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వడంతో నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేయనున్నారు.
నేడు సుప్రీంకోర్టులో మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. తాజాగా మోహన్ బాబు పిటిషన్పై హైకోర్టులో కూడా విచారణ జరిగింది. పహాడీషరీఫ్ పీఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని దాఖలు చేసిన పిటిషన్పై విచారణ కొనసాగింది. సీనియర్ న్యాయవాది వాదిస్తాడని సమయం కావాలని మోహన్బాబు తరఫు న్యాయవాది కోరారు. తదుపరి విచారణ వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.
రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అంటే యూత్ లో క్రేజ్ ఎక్కువ.. ఆ బండి మీద వెళ్తుంటే అదొక హుందా తనం వస్తుందని అని ఫీల్ అవుతారు.. అందుకే ఈ కంపెనీ బండ్లనుకొనాలని ఆశ పడతారు.. కాగా.. రాయల్ ఎన్ఫీల్డ్ ఇటీవల షాట్గన్ 650కి చెందిన ప్రత్యేక ఐకాన్ ఎడిషన్ను విడుదల చేసింది. దీనిని అమెరికాకు చెందిన కస్టమ్ మోటార్సైకిల్ తయారీదారు ఐకాన్ మోటోస్పోర్ట్స్ సహకారంతో తయారు చేయనుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ బైక్ను ప్రపంచవ్యాప్తంగా 100 యూనిట్లు మాత్రమే తయారు చేసి అమ్ముతుంది.
మొబైల్, ల్యాప్టాప్ లేదా టీవీ, ఇవి మన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. అవి లేకుండా మనం ఆఫీసులో పనిచేయలేం. పడుకోము, తినము. పెద్దవారిలోనే కాదు పిల్లల్లో కూడా స్క్రీన్ అడిక్షన్ బాగా పెరిగిపోయింది. తల్లిదండ్రులు తమ పని తాము చేసుకునేందుకు చిన్నపిల్లలకు మొబైల్ ఫోన్లు ఇస్తున్నారు. పిల్లలు క్రమంగా దానికి బానిసలవుతున్నారు. పిల్లవాడు మొబైల్ చూడకుండా తిండి తినడు. మొబైల్ ని ముందు పెట్టుకుని తినే పిల్లలను మీరు కూడా చాలా మంది చూసి ఉంటారు. వీటి వల్ల జరిగే అనర్థాలు చాలా…
దేశ రాజధాని దిల్లీ తరహాలోనే దేశంలోని ప్రధాన నగరాల్లో వాయుకాలుష్యం పెరుగుతోంది. దుమ్మూ, ధూళి, వాహనాల పొగ.. గాలిలో కలవడం లేదు. పైపైనే ఒక పొరలా పేరుకుపోతోంది. దీంతో గాల్లో కాలుష్యం పెరిగి.. వాయు నాణ్యత తగ్గుతోంది. దీంతో గాల్లో నాణ్యత క్రమంగా క్షీణిస్తోంది. పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గాలి ఎక్కువగా కలుషితమవుతోంది. ఈ వాయు కాలుష్యం ధాటికి ఊపిరితిత్తులు విలవిలలాడుతున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్ నుంచి అమెరికాకు వెళ్తున్నారు. రేపు ఆయన వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమవుతారు. ప్రధాని మోడీ, ట్రంప్ చివరిసారిగా ముఖాముఖి సమావేశం జరిగి ఐదు సంవత్సరాలు అయ్యింది. కానీ అధ్యక్షుడు ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ నాయకత్వాన్ని ప్రశంసించారు. ఈ సమావేశం భారతదేశం-అమెరికా సంబంధాలకు కొత్త దిశానిర్దేశం చేయడమే కాకుండా..
భద్రతను దృష్టిలో ఉంచుకుని భారతదేశం 2020లో కొన్ని చైనీస్ యాప్లను నిషేధించింది. అయితే.. ప్రస్తతం మళ్లీ ఈ యాప్స్ తిరిగి భారత్లోకి వచ్చాయి. 36 యాప్లు లను తిరిగి జాబితా చేరాయి.
భారత ఆటోమొబైల్ రంగం జనవరి 2025లో మంచి ఫలితాలను చవిచూసింది. స్కోడా కొత్త కార్లను ఆటో ఎక్స్పోలో ప్రదర్శించింది. ఇది కారు ప్రియులలో విపరీతమైన ఉత్సాహాన్ని రేకెత్తించింది. కాగా..ఇటీవల విడుదలైన స్కోడా కైలాక్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. జనవరి 2025లో అత్యధికంగా 1,242 యూనిట్లు అమ్ముడయ్యాయి. ‘స్కోడా కైలాక్’ SUV బుకింగ్స్ డిసెంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలు జనవరి 27 నుంచి ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 1,242 కస్టమర్లు దీన్ని […]
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు ఈ-విటారా కారును భారత్ మొబిలిటీ ఎక్స్పోలో ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ- విటారా ఎస్యూవీ లాంచ్కు సిద్ధమవుతోంది. మార్చి 2025లో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. జపాన్, యూరప్లతోపాటు 100కి పైగా దేశాలకు ఈ-విటారా కారును ఎగుమతి చేస్తామని మారుతి సుజుకి వెల్లడించింది. ఇటీవల ఈ-విటారా ముందస్తుగా బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కంపెనీ కలిగించింది.