జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి అద్భుత విజయం తర్వాత జార్ఖండ్లో హేమంత్ సోరెన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. కొత్త ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం నవంబర్ 26న జరగనుంది.
మద్యపానం చేయడం హానికరమని తెలిసినప్పటికీ అలవాటుని మానుకోలేని వారు చాలామంది ఉంటారు. అయితే విపరీతంగా మద్యం తాగే వాళ్ళు ఒక్కసారిగా మద్యం మానేస్తే కూడా ప్రమాదమేనని చెబుతున్నారు వైద్యులు. అంతే కాకుండా.. కొందరు వీకెండ్ మాత్రమే మందు తాగితే.. మరి కొందరు వారానికి ఏడు రోజులూ తాగుతుంటారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు చుట్టు ముడుతుంటాయి. ఇలాంటి వారు కొన్ని టిప్స్ పాటిండం ద్వారా ఆరోగ్యం త్వరగా పాడైపోకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజూ వ్యాయామం చేయాలి.. యూఎస్ […]
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి సంచలనం సృష్టించింది. మహాయుతి కూటమి 235 మహారాష్ట్ర అసెంబ్లీ స్థానాలను గెలుచుకోగా, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి 49 మాత్రమే సాధించింది. తాజాగా తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? అన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది. 288 సీట్లకు గాను 132 సీట్లతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంతో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారని కమలం పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కాగా.. మళ్లీ తానే సీఎం అవుతానని ఎక్నాథ్ షిండే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత ఎన్నికల ప్రక్రియ విధానాన్ని కొనియాడారు. కాలిఫోర్నియాలో ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. భారత్పై ప్రశంసలు కురిపించారు. ఎలాన్ మస్క్ ‘భారతదేశంలో ఒక్క రోజులోనే 640 మిలియన్ల ఓట్లను ఎలా లెక్కించారు?’ అనే హెడ్లైన్తో ప్రచురించి ఓ వార్తా కథనాన్ని తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.
యూపీ రాష్ట్రం సంభాల్లోని షాహీ జామా మసీదును హరిహర్ దేవాలయంగా పేర్కొనడంతో ఈరోజు మళ్లీ సర్వే నిర్వహిస్తున్నారు. ఏఎస్ఐ సర్వే బృందం తెల్లవారుజామున జామా మసీదుకు చేరుకుంది. మసీదు రీ సర్వే విషయం తెలిసిన వెంటనే ముస్లిం వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున మసీదు వెనుక గుమిగూడారు. జనం తోపులాట సృష్టించి రాళ్లు రువ్వడం ప్రారంభించారు. రాళ్లదాడిలో ఎస్పీ పీఆర్వో గాయపడ్డారు. ఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు.
భారత జట్టు స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పెర్త్ టెస్టులో సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఇది అతనికి మొదటి సెంచరీ. ఈ సెంచరీతో కొన్ని రికార్డులు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. భారత జట్టు రెండో ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ సిక్సర్తో ఈ సెంచరీ పూర్తి చేశాడు. టెస్టు క్రికెట్లో యశస్వికి ఇది నాలుగో సెంచరీ.
ప్రేమోన్మాది వేధింపులకు యువ టీచర్ బలైంది. భీమిలి మండలం మజ్జివలస గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగితాల రాశి (22) అనే యువతి డిగ్రీ వరకూ చదివి ప్రస్తుతం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యా వాలంటీరుగా పనిచేస్తోంది.
మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఘనవిజయం రాష్ట్ర రాజకీయ సమీకరణాలను తలకిందులు చేసింది. బీజేపీ, దాని మిత్రపక్షాల సునామీలో ఇతర పార్టీలు కొట్టుకుపోయాయి. బీజేపీ, ఎన్సీపీ, షిండే సేన కూటమి 288 స్థానాలకు గాను 235 స్థానాలను కైవసం చేసుకుంది. మహావికాస్ అఘాడీ కేవలం 50 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మహావికాస్ అఘాడీ పార్టీల పరిస్థితి స్వతంత్ర అభ్యర్థుల కంటే తక్కువగానే మిగిలిపోయింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడ్డాయి. రాష్ట్రంలోని చంద్గఢ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శివాజీ పాటిల్ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. అయితే.. రాత్రి శివాజీ పాటిల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పాటిల్ గాయపడ్డారు. ఊరేగింపులో పాల్గొన్న కొందరు మహిళలు కూడా గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. మహాగావ్లో శివాజీ పాటిల్ విజయం సాధించిన తర్వాత కొందరు మహిళలు ఆయనకు హారతి ఇస్తుండగా ఈ ఘటన జరిగింది.
వందేభారత్, అమృత్ భారత్ రైళ్ల తర్వాత భారతీయ రైల్వే మరో ప్రత్యేక రైలును నడపబోతోంది. దీని ప్రత్యేకత ఏమిటంటే దీనికి కరెంట్ గానీ, డీజిల్ కానీ అవసరం లేదు. వాటికి బదులుగా రైలు ‘నీటి’తో నడుస్తుంది. మొదటి రైలు మార్గాన్ని కూడా పైలట్ ప్రాజెక్ట్గా నిర్ణయించారు. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం.. దేశంలో 2025 మార్చిలో హైడ్రోజన్ రైళ్లు ప్రజలకు సేవలందించనున్నాయి. భారతీయ రైల్వే దేశంలో హైడ్రోజన్ రైళ్లను నడపబోతోంది. ఒక చక్రానికి 360 కిలోల హైడ్రోజన్ […]