ఆలయాల దగ్గర కోతులు ఉండటం ఇప్పుడు సర్వసాధారణం. ఈ కోతులు ఆలయాల చుట్టూ తిరుగుతూ భక్తులను ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. భక్తుల చేతుల్లోని కొబ్బరి చిప్పలు, ప్రసాదాలు, పలు వస్తువులను ఎత్తుకెళ్తుంటాయి. ఉత్తరప్రదేశ్లోని ఓ ఆలయంలో ఓ కోతి అదే చేసింది.
ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉంది. రైల్వే స్టేషన్లలో సౌకర్యాలను పెంచడం, రైళ్లలో జనరల్, స్లీపర్ కోచ్ల సౌకర్యాలను వంటి సౌకర్యాలను అందుబాటులోకి తెస్తోంది. ఈ క్రమంలో, రైల్వే మరో మార్పు చేయబోతోంది. రైల్వే ఇప్పుడు నాన్-ఏసీ కోచ్లకు కూడా ఏసీ కోచ్ల సౌకర్యాన్ని ప్రారంభించబోతోంది.
ముంబైలోని వెర్సోవా నుంచి ఓ వార్త వెలువడింది. సినీ నిర్మాత తన డ్రైవర్ పై కత్తితో దాడి చేశాడు. దీంతో నిర్మాతపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సమాచారాన్ని ముంబై పోలీసు అధికారి వెల్లడించారు. జీతం విషయంలో ఇద్దరి మధ్య వివాదం జరిగిందని.. అనంతరం నిర్మాత కత్తితో దాడి చేశాడని డ్రైవర్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
బీహార్లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి) నాయకుడు తేజస్వి యాదవ్ తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తేజస్వి యాదవ్ కాన్వాయ్లోకి ప్రవేశించిన ఓ ట్రక్కు ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. రాత్రి 1:30 గంటల ప్రాంతంలో తేజస్వి యాదవ్ మాధేపుర నుంచి పాట్నాకు తిరిగి వస్తున్నారు.
టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య స్నేహానికి కళ్లెం పడింది. ప్రస్తుతం ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇంతలో అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ అవసరం గురించి మస్క్ ఓ ప్రకటన చేశారు. వాస్తవానికి.. ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఒక పోల్ నిర్వహించారు. అందులో అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలా వద్దా అని అడిగారు. తాజాగా ఈ పోల్ ఫలితాలను మస్క్ వెల్లడించారు. 80% మంది ప్రజలు…
చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటనకు విరాట్ కోహ్లీ కూడా కారణమని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు అందింది. కబ్బన్ పార్క్ పోలీసు స్టేషన్లో రియల్ ఫైటర్స్ ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్ ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేయాలని కోరారు. ఇప్పటికే ఈ ఘటనపై ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక క్రికెట్ అసోషియేషన్పై మూడు కేసులు నమోదయ్యాయి. విరాట్ కోహ్లీ పేరుతో వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఈద్-ఉల్-అఝా(బక్రీద్) పర్వదినం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముస్లి సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ త్యాగం, అంకితభావం, అల్లాహ్పై అచంచల విశ్వాసానికి ప్రతీక అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. ఈద్-ఉల్-అఝా పండుగ మనం కలిసి జీవించడానికి, సామాజిక సామరస్యాన్ని కాపాడుకోవడానికి ప్రేరేపిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.
ఆళ్లగడ్డ మున్సిపాలిటీ లో చికెన్ కమీషన్ కోసం ఓ మున్సిపల్ అధికారి కక్కుర్తి పడ్డాడు. చికెన్ కిలోకి రూ.5 కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆళ్లగడ్డ ఏఎన్ఆర్ చికెన్ సెంటర్ యజమానితో మున్సిపల్ అధికారి బేరసారాలు చేపట్టాడు. ప్రొద్దుటూరులో ఓ బార్ అడ్డాగా మున్సిపల్ అధికారి బేరం అడాడు. చికెన్ సెంటర్ యజమాని మహబూబ్ బాషాతో మరో షాప్ లైసెన్స్ కోసం బేరమాడిన ఆడియో వైరల్ అయ్యింది. ట్రేడ్ లైసెన్సు కావాలంటే రూ. లక్ష చెల్లించాలని డిమాండ్ చేశాడు.
చల్లపల్లి రాజా తనయుడు, మచిలీపట్నం పార్లమెంట్ మాజీ సభ్యులు శ్రీమంతురాజా యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ బహద్దూర్ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 86 ఏళ్లు. కోయంబత్తూరులోని స్వగృహంలో ఈరోజు కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం శనివారం కృష్ణా జిల్లా చల్లపల్లికి తీసుకురానున్నట్లు కుటుంబీకులు వెల్లడించారు. చల్లపల్లిలోని ఎస్ఆర్వైఎస్పీ జూనియర్ కళాశాలకు అంకినీడు ప్రసాద్ కరస్పాండెంట్గా ఉన్నారు.
బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు మాజీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, సహనం.. ఈ రెండూ బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలని పేర్కొన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండగ జరుపుకుంటారని.. త్యాగనిరతికి బక్రీద్ పండుగ నిదర్శనమన్నారు. ధనిక, పేద అన్న తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో చేసుకునే బక్రీద్ అని.. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరారు..