BPCL LPG ATM: గ్యాస్ కష్టాలకు చెక్.. దేశంలోనే తొలి ‘LPG ATM’ స్టార్ట్.. ఎక్కడో చూసేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BPCL LPG ATM: యుద్ధ మేఘాల వల్ల దేశంలో ఎల్పీజీ సరఫరాపై అనిశ్చితి నెలకొన్న తరుణంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. హర్యానాలోని గురుగ్రామ్ (సోహనా, సెక్టార్-33)లో పైలట్ ప్రాజెక్టుగా దేశంలోనే మొట్టమొదటి ఎల్పీజీ ఏటీఎంను అందుబాటులోకి తీసుకువచ్చింది.
READ ALSO: AB de Villiers-RCB: ఆర్సీబీ దుమ్ము రేపడం ఖాయం.. వరుసగా రెండు, మూడు కప్పులు కొడుతుంది!
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
ఇది ఎలా పనిచేస్తుందంటే..
ఈ ఏటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్ పొందడం డబ్బులు డ్రా చేసినంత సులభం అని అధికారులు చెబుతున్నారు. ముందుగా యూజర్ తన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ను నమోదు చేయాలి. తర్వాత మొబైల్కు వచ్చే ఓటిపి (OTP)ని ఎంటర్ చేసి ధృవీకరించాలి. ఆ తర్వాత వారి పాత సిలిండర్పై ఉన్న బార్కోడ్ లేదా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలి. ఇప్పుడు యూపీఐ (UPI), క్రెడిట్/డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు చెల్లించాలి. తర్వాత పాత ఖాళీ సిలిండర్ను మిషన్ లోపల ఉంచగానే, కేవలం 2-3 నిమిషాల్లో నిండుగా ఉన్న కొత్త సిలిండర్ బయటకు వస్తుంది.
ఈ ఏటీఎం ద్వారా లభించే సిలిండర్లు మనం రెగ్యులర్గా వాడే ఇనుప సిలిండర్లు కావు. ఇవి ఫైబర్ ఆధారిత ‘కంపోజిట్ సిలిండర్లు’. సాధారణ సిలిండర్ బరువు (గ్యాస్తో కలిపి) 31 కిలోలు ఉంటే, ఈ కంపోజిట్ సిలిండర్ కేవలం 15 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. ఇవి చాలా తేలికగా ఉండటంతో ఎవరైనా సులభంగా మోసుకెళ్లవచ్చు, అలాగే ఇవి వాడకంలో కూడా అత్యంత సురక్షితమైనవిగా చెబుతున్నారు.
24/7 అందుబాటులో సేవలు
ఈ ఆటోమేటిక్ వెండింగ్ మెషిన్ వారంలో ఏడు రోజులు, 24 గంటల పాటు పనిచేస్తుంది. గ్యాస్ ఏజెన్సీలతో పని లేకుండా, సరఫరాలో అంతరాయం కలగకుండా ఈ వ్యవస్థను డిజైన్ చేశారు. మిషన్లో గ్యాస్ స్టాక్ తగ్గిపోగానే, ఆటోమేటిక్గా సమీప ఏజెన్సీలకు అలర్ట్ వెళ్లి స్టాక్ రీఫిల్ అవుతుంది. గ్యాస్ ఏజెన్సీలపై వినియోగదారుల ఆధారితాన్ని తగ్గించడం, యుద్ధం వంటి అత్యవసర సమయాల్లో కూడా గ్యాస్ సరఫరాను సాఫీగా సాగించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం అని అధికారులు చెబుతున్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే దేశవ్యాప్తంగా మరిన్ని నగరాల్లో ఎల్పీజీ ఏటీఎంలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం.
READ ALSO: PM Narendra Modi: ఉగాది శుభాకాంక్షలు ప్రధాని నరేంద్ర మోదీ
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..