BPCL LPG ATM: గ్యాస్ కష్టాలకు చెక్.. దేశంలోనే తొలి ‘LPG ATM’ స్టార్ట్.. ఎక్కడో చూసేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BPCL LPG ATM: యుద్ధ మేఘాల వల్ల దేశంలో ఎల్పీజీ సరఫరాపై అనిశ్చితి నెలకొన్న తరుణంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. హర్యానాలోని గురుగ్రామ్ (సోహనా, సెక్టార్-33)లో పైలట్ ప్రాజెక్టుగా దేశంలోనే మొట్టమొదటి ఎల్పీజీ ఏటీఎంను అందుబాటులోకి తీసుకువచ్చింది.
READ ALSO: AB de Villiers-RCB: ఆర్సీబీ దుమ్ము రేపడం ఖాయం.. వరుసగా రెండు, మూడు కప్పులు కొడుతుంది!
Also Read
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
- CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
- 6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
- Trump-Iran: ఇరాన్ చర్చలు కోరింది.. రేపు దోహాలో కీలక భేటీ అంటూ ట్రంప్ ప్రకటన
ఇది ఎలా పనిచేస్తుందంటే..
ఈ ఏటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్ పొందడం డబ్బులు డ్రా చేసినంత సులభం అని అధికారులు చెబుతున్నారు. ముందుగా యూజర్ తన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ను నమోదు చేయాలి. తర్వాత మొబైల్కు వచ్చే ఓటిపి (OTP)ని ఎంటర్ చేసి ధృవీకరించాలి. ఆ తర్వాత వారి పాత సిలిండర్పై ఉన్న బార్కోడ్ లేదా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలి. ఇప్పుడు యూపీఐ (UPI), క్రెడిట్/డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు చెల్లించాలి. తర్వాత పాత ఖాళీ సిలిండర్ను మిషన్ లోపల ఉంచగానే, కేవలం 2-3 నిమిషాల్లో నిండుగా ఉన్న కొత్త సిలిండర్ బయటకు వస్తుంది.
ఈ ఏటీఎం ద్వారా లభించే సిలిండర్లు మనం రెగ్యులర్గా వాడే ఇనుప సిలిండర్లు కావు. ఇవి ఫైబర్ ఆధారిత ‘కంపోజిట్ సిలిండర్లు’. సాధారణ సిలిండర్ బరువు (గ్యాస్తో కలిపి) 31 కిలోలు ఉంటే, ఈ కంపోజిట్ సిలిండర్ కేవలం 15 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. ఇవి చాలా తేలికగా ఉండటంతో ఎవరైనా సులభంగా మోసుకెళ్లవచ్చు, అలాగే ఇవి వాడకంలో కూడా అత్యంత సురక్షితమైనవిగా చెబుతున్నారు.
24/7 అందుబాటులో సేవలు
ఈ ఆటోమేటిక్ వెండింగ్ మెషిన్ వారంలో ఏడు రోజులు, 24 గంటల పాటు పనిచేస్తుంది. గ్యాస్ ఏజెన్సీలతో పని లేకుండా, సరఫరాలో అంతరాయం కలగకుండా ఈ వ్యవస్థను డిజైన్ చేశారు. మిషన్లో గ్యాస్ స్టాక్ తగ్గిపోగానే, ఆటోమేటిక్గా సమీప ఏజెన్సీలకు అలర్ట్ వెళ్లి స్టాక్ రీఫిల్ అవుతుంది. గ్యాస్ ఏజెన్సీలపై వినియోగదారుల ఆధారితాన్ని తగ్గించడం, యుద్ధం వంటి అత్యవసర సమయాల్లో కూడా గ్యాస్ సరఫరాను సాఫీగా సాగించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం అని అధికారులు చెబుతున్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే దేశవ్యాప్తంగా మరిన్ని నగరాల్లో ఎల్పీజీ ఏటీఎంలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం.
READ ALSO: PM Narendra Modi: ఉగాది శుభాకాంక్షలు ప్రధాని నరేంద్ర మోదీ
తాజావార్తలు
-
CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
CBSE స్టూడెంట్స్కు రిలీఫ్.. 10వ క్లాస్కు కొత్త రూల్ లేదు.!
-
CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
Cleaning Tips: ఇల్లాళ్లకు స్మార్ట్ కిచెన్ ఐడియాస్.. వంటగదిని క్లీన్గా ఉంచే 12 అదిరిపోయే చిట్కాలు!
ట్రెండింగ్
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!