C.P. Radhakrishnan: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సి.పి. రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. ఆయనకు 452 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి ఇండియా కూటమి అభ్యర్థి బి.కె. సుదర్శన్ రెడ్డి్ 300 మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించారు. దీంతో మహారాష్ట్ర మాజీ గవర్నర్ రాధాకృష్ణన్ 152 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్డీఏ బలం 427 కాగా.. క్రాస్ ఓటింగ్ జరగడంతో 452 ఓట్లు వచ్చాయి. ఈ విజయంతో దేశంలోని 17వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ నిలిచారు. ఈ ఎన్నికల్లో 98 శాతం మంది ఎంపీలు…
Vice Presidential Election: దేశంలోని 17వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఓటింగ్ ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్ హౌస్లో జరిగింది. మొత్తం 768 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారత పార్లమెంటులో లోక్సభ, రాజ్యసభతో సహా మొత్తం 788 మంది ఎంపీలు ఉన్నారు. ప్రస్తుతం రెండు సభలలో 7 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అయితే.. మొత్తం 781 మంది ఎంపీలు ఓటు వేయాల్సి ఉంటుంది. వారిలో 13 మంది ఓటింగ్లో పాల్గొనలేదు.
2025 ఆసియా కప్లో భాగంగా సెప్టెంబర్ 14న భారత్, పాకిస్థాన్ మధ్య ఒక మ్యాచ్ జరగనుంది. గత కొన్ని రోజులుగా ఈ మ్యాచ్ గురించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతలో పూణేకు చెందిన సామాజిక కార్యకర్త కేతన్ తిరోద్కర్ ఈ మ్యాచ్ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మ్యాచ్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం రిట్ ఆఫ్ మాండమస్ లేదా ఇతర తగిన ఉత్తర్వులను జారీ చేయాలని డిమాండ్ చేశారు.
Vice President Election: ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ పూర్తయింది. ఫలితాల కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఈరోజే ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. రాత్రి 8 గంటల నాటికి కొత్త ఉపరాష్ట్రపతి పేరు ప్రకటించే అవకాశం ఉంది. కాగా.. 96 శాతం మంది సభ్యులు మధ్యాహ్నం 3 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఈసీ తెలిపింది. పోలింగ్ ముగిసే సమయానికి ఎంత శాతం నమోదైందనే అంశంపై క్లారిటీ లేదు.
Gangster Salman Lala: మధ్యప్రదేశ్లోని మినీ ముంబైగా పేరుగాంచిన ఇండోర్ వ్యాపారం, విద్య, సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. కానీ నేడు ‘సల్మాన్ లాలా’ అనే గ్యాంగ్స్టర్ కారణంగా ముఖ్యాంశాలలో నిలిచింది. చాలా మంది యువత ఆ గ్యాంగ్స్టర్పై రీల్స్ తయారు చేస్తున్నారు. సోషల్ మీడియాలో చిత్రాలను పంచుకుంటున్నారు. ‘హీరో’ మాదిరిగా వైరల్ చేస్తున్నారు. కానీ ఆ గ్యాంగ్స్టర్ హీరో కాదు. క్రూరమైన వ్యక్తి. అలాంటి పెద్ద గ్యాంగ్స్టర్ చనిపోతే అంత్యక్రియలకు వేలాది మంది హాజరు కావడం […]
Vice Presidential Election: ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ కొనసాగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ మొదట ఓటు వేశారు. అనంతరం రాజ్యసభ, లోక్సభ ఎంపీలందరూ వరుసగా ఓట్లు వేశారు. ఇంతలో ఓ ఆసక్తికరమైన చిత్రం వెలుగులోకి వచ్చింది. రోడ్డు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఓటు వేయడానికి వచ్చారు. ప్రతిపక్ష కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆయనతో ఉన్నారు. ఇద్దరు నాయకులు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని క్యాంపస్కు వచ్చారు. ఇద్దరూ చాలా సేపు ఇలాగే నడుస్తూ నవ్వుతూ మాట్లాడుకున్నారు. వీరి దోస్తాన్పై ఇప్పుడు చర్చ…
Alcohol: ప్రస్తుతం ఆడ, మగ తేడాలేకుండా మద్యం తాగుతున్నారు. కొందరు ఉల్లసం కోసం తాగితే.. మరి కొందరూ ఉద్యమంలా తాగుతుంటారు. యువత ఎక్కువగా మద్యానికి బానిసలుగా మారుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మొదట ఏదో అలా ఉల్లాసం కోసం తాగి.. తరువాత దానికి బానిసలుగా మారుతున్నారు. ఇలా అలవాటైన కొందరూ రోజూ తాగుతూనే ఉంటారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో సహాయం అందించడానికి 400 మందికి పైగా శాస్త్రవేత్తలు 24 గంటలూ పనిచేశారని ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) ఛైర్మన్ వి నారాయణన్ మంగళవారం అన్నారు. సైనిక ఆపరేషన్ సమయంలో భూమి పరిశీలన, ఉపగ్రహాల కమ్యూనికేషన్ వంటి సహాయ సహకారాలు అందించారని తెలిపారు.
Nepal in Turmoil: ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. అలాంటి సోషల్ మీడియాను బ్యాన్ చేసింది నేపాల్ సర్కార్.. కానీ.. తరువాత జరిగే హింసాత్మక నిరసనల గురించి అంచనా వేయడంలో విఫలమైంది. నిరసనల ధాటికి హిమాలయ దేశం నేపాల్ అట్టుడుకుతోంది. సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినప్పటికీ.. ఉద్రిక్తతలు ఆగడం లేదు. ఈ తరుణంలో ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. దాంతో ఆ దేశ పగ్గాలు సైన్యం చేతుల్లోకి వెళ్లనున్నాయని తెలుస్తోంది. ఈ ఘటన తీవ్రతకు సంబంధించిన ఫొటోలు చూద్దాం...