Manipur BJP: ప్రధాని మోడీ మణిపూర్ పర్యటనకు ముందు బీజేపీకి ఎదురుదెబ్బ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur BJP: మణిపూర్లో శాంతి పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోంది. సెప్టెంబర్ 13న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మణిపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఇంతలో రాష్ట్ర బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మణిపూర్లోని ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సహా ముగ్గురు బీజేపీ నాయకులు కాంగ్రెస్లో చేరారు. ఈ సమాచారాన్ని కాంగ్రెస్.. మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. దేశ రాజధానిలోని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు వై. సుర్చంద్ర సింగ్, ఎల్. రాధాకిషోర్ సింగ్, పార్టీ నాయకుడు ఉత్తమ్కుమార్ నింగ్తౌజామ్ సోమవారం కాంగ్రెస్లో చేరారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
READ MORE : Rohit Sharma: అర్ధరాత్రి ఆసుపత్రికి రోహిత్ శర్మ.. వీడియో వైరల్! ఆందోళనలో ఫాన్స్
Also Read
- Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
- Discount On Mobile: తొలి సేల్లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో 'లగ్జరీ' ఫోన్.. రేపు అందుబాటులోకి..
- Worst Bowling: యువకుడు, ఎత్తుగా ఉన్నాడు, బౌలింగ్ బాగా వేస్తాడు అనుకున్నారు.. కట్ చేస్తే చుక్కలు చూపించారు..
- IND vs ENG 3rd ODI: ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఊచకోత.. లార్డ్స్లో 51 ఏళ్ల రికార్డు బద్దలు..
మణిపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సప్తగిరి శంకర్ ఉలక, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కె. మేఘచంద్ర సింగ్ సమక్షంలో ఈ నాయకులను పార్టీలోకి చేర్చుకున్నారు. “మణిపూర్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో బీజేపీ విఫలమైంది. ఆగ్రహం వ్యక్తం చేసిన ఈ నాయకులు బీజేపీని విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మాత్రమే శాంతి, స్థిరత్వాన్ని తీసుకురాగలదు. మంచి పాలన అందించగలదనే నమ్మకం ప్రజల్లో పెరుగుతోంది. దానికి నిదర్శనమే ఈ చేరికలు.” అని కాంగ్రెస్ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు.. మణిపూర్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ సహా బీజేపీ ఎమ్మెల్యేలు ఆదివారం రాజ్ భవన్లో భల్లాను కలిశారు. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో అనేక మంది ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
READ MORE : Nepal Protests: దేశం విడిచి పారిపోనున్న ప్రధాని.. భారత సరిహద్దుల్లో హై అలర్ట్..
తాజావార్తలు
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
-
H-FAST Raids: కల్తీగాళ్ల గుండెల్లో రైళ్లు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో H-FAST భారీ దాడులు..
-
Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
-
Vallabhaneni Anil: టాలీవుడ్లో యూనియన్ వివాదానికి ఫుల్స్టాప్.. జానీ మాస్టర్పై నాన్ కోఆపరేషన్ ఎత్తివేత!
-
Discount On Mobile: తొలి సేల్లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో ‘లగ్జరీ’ ఫోన్.. రేపు అందుబాటులోకి..
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!