Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Riyan Parag: జైలు శిక్షా లేక జరిమానా.. RR కెప్టెన్పై బీసీసీఐ కఠిన చర్యలు.?
Riyan Parag: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag) వివాదంలో చిక్కుకున్నాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్లో ఈ-సిగరెట్ వాడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఘటనపై బీసీసీఐ తీవ్రంగా స్పందించింది. అందిన సమాచారం ప్రకారం, ఈ ఘటనపై పరాగ్ నుండి వివరణ కోరింది. ఆ వివిరణ ఆధారంగా తగిన చర్యలు తీసుకోనుంది. భారత చట్టాల ప్రకారం ఈ-సిగరెట్ల వినియోగం […] -
Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!
Srilanka Cricket: శ్రీలంక క్రికెట్ (Srilanka Cricket)లో భారీ పరిణామాలు చోటుచేసుకున్నాయి. షమ్మీ సిల్వా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో పాటు, మొత్తం ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా సామూహికంగా తమ పదవులకు వీడ్కోలు పలికింది. ఈ నిర్ణయం వెనుక శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. క్రికెట్ బోర్డులో మార్పులు అవసరమని ప్రభుత్వం, ప్రజల నుంచి తీవ్ర డిమాండ్లు రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా, ఆర్థిక అవకతవకల ఆరోపణలు కూడా బోర్డుపై […] -
MI Vs SRH Playing XI: ఊపు మీదున్న SRHకు ముంబై కళ్లెమేస్తుందా.?
MI Vs SRH Playing XI: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్కు ఇకపై ఆడే ప్రతి మ్యాచ్ కీలకమే. నేడు ముంబైలో ఫామ్లో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనున్న ముంబై జట్టు పరిస్థితి ‘డూ ఆర్ డై’ గా మారింది. ఇప్పటికే 7 మ్యాచ్ల్లో 5 ఓటములతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ముంబై, టోర్నీలో కొనసాగాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి ఎదురైంది. ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా, […] -
Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి ‘భట్టి’ భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
Bhatti Vikramarka: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టమైన ఆదేశాల మేరకు, ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం రూ. 1000 కోట్ల నిధులను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఈ మేరకు నిధుల విడుదల చేయటం జరిగింది. ఈ మేరకు డిప్యూటీ సిఎం భట్టి […] -
MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
MLA Rajagopal Reddy: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కల్వకుంట్ల కవితపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలు, రాజకీయ చర్యలపై స్పందిస్తూ ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కవిత పార్టీ ఏర్పాటు విషయాన్ని రాజగోపాల్ రెడ్డి “బిగ్ జోక్”గా అభివర్ణించారు. అదే విధంగా TRS పేరుతో పార్టీ పెట్టడం మరో జోక్ అని వ్యాఖ్యానించారు. కవితకు ఉన్న గుర్తింపు కేవలం ఒక ఉద్యమకారుడు బిడ్డగా మాత్రమేనని, ఆమె స్వతంత్ర […] -
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
PBKS vs RR: న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన రాజస్థాన్ రాయల్స్ (RR), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ బ్యాటర్లు మరోసారి వారి బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో మార్కస్ స్టోయినిస్ మెరుపు దాడితో రాజస్థాన్ బౌలర్లు విలవిలలాడారు. పంజాబ్ ఇన్నింగ్స్ను ఓపెనర్లు ధాటిగా […] -
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
Petrol Bunks Rush: ప్రజలకు ఇబ్బంది లేకుండా పెట్రోల్, డీజిల్ అందేలా చూడటానికి, తెలంగాణ పౌర సరఫరాల శాఖ ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా చమురు సరఫరాను 126% పెంచింది. అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్ వల్ల స్థానిక పెట్రోల్ బంకుల్లో తలెత్తిన రద్దీని తగ్గించడానికి అధికారులు ఈ వేగవంతమైన నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్ బంకుల దగ్గర ఇలా ఊహించని రద్దీ పెరగడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. మొదటిది: పరిశ్రమలకు వాడే డీజిల్ ధరను ఇటీవల లీటరుకు రూ. […] -
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
CM Revanth Reddy: రంగారెడ్డి జిల్లా మీర్కాన్పేట్లో “ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్” భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి, డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పనుల్లో ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఏ అభివృద్ధి కార్యక్రమమైనా స్థానిక ప్రజాప్రతినిధులను తప్పకుండా ఆహ్వానించాలని అధికారులకు […] -
Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
Gudivada Amarnath: విశాఖలో ప్రతిపాదిత డేటా సెంటర్ ప్రాజెక్ట్పై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రాజెక్ట్కు పునాది YS. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే పడిందని ఆయన స్పష్టం చేశారు. డేటా సెంటర్ ఏర్పాటు కోసం అదానీ గ్రూప్ కు 130 ఎకరాల భూమిని తమ ప్రభుత్వమే కేటాయించిందని గుర్తుచేశారు. 2021 నుంచే విశాఖను డేటా సెంటర్ హబ్గా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో చర్యలు తీసుకున్నామని ఆయన గుర్తు చేశారు. […] -
Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
Telangana DGP: తెలంగాణ రాష్ట్రానికి కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)గా C. V. ఆనంద్ ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం హోం సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీవీ ఆనంద్, 1991 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన సీనియర్ అధికారి. ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి ఎల్లుండి పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ నియామకం చేపట్టింది ప్రభుత్వం. అనుభవం, పరిపాలనా సామర్థ్యం ఉన్న అధికారిగా సీవీ […]
తాజావార్తలు
-
Gold Spot Glimpse: 90s రోజులు గుర్తొచ్చేలా గోల్డ్ స్పాట్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ అవుట్..
-
CM Vijay: పోలీసులు పవర్ సెంటర్గా మారొద్దు.. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
-
Shaque: అనుమానాలతో పిచ్చెక్కించడానికి వస్తున్న పరిణీతి చోప్రా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!