ICC: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్లో భారీ మార్పు.. డే టెస్టుల్లో పింక్ బాల్ ట్రయల్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మహిళల క్రికెట్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న తొలి మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్లో కీలక మార్పులు చేసింది. వచ్చే ఏడాది శ్రీలంక వేదికగా జరగనున్న ఈ టోర్నీని మొదట జూన్-జూలై నెలల్లో నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, తాజాగా ఫిబ్రవరి నెలకు మార్చినట్లు ఐసీసీ ప్రకటించింది. అహ్మదాబాద్లో తాజాగా జరిగిన ఐసీసీ త్రైమాసిక సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. ఎనిమిది జట్లు పాల్గొనే ఈ టోర్నీ ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు టీ20 ఫార్మాట్లో జరగనుంది. అయితే షెడ్యూల్ మార్పుకు గల కారణాలను ఐసీసీ వెల్లడించలేదు. ఈ టోర్నీ కారణంగా న్యూజిలాండ్-ఆస్ట్రేలియా మహిళల సిరీస్తో కొంత మేర షెడ్యూల్ మారవచ్చు.
ఈ సమావేశంలో 2028 మహిళల టీ20 ప్రపంచకప్ అర్హత రూట్ మ్యాప్ ను కూడా ఐసీసీ ఖరారు చేసింది. పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న ఈ మెగా టోర్నీలో భారత్ తన మ్యాచ్లను తటస్థ వేదికలో ఆడనుంది. 12 జట్లతో నిర్వహించే ఈ టోర్నీకి 10 జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి. 2026 మహిళల టీ20 ప్రపంచకప్లో టాప్-8 స్థానాల్లో నిలిచిన జట్లు, ఆతిథ్య దేశం (అర్హత పొందకపోతే), అలాగే 2026 జూలై 6 నాటికి ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్లో అత్యుత్తమ స్థానాల్లో ఉన్న జట్లు నేరుగా ప్రవేశం పొందనున్నాయి. మిగిలిన రెండు స్థానాలను 10 జట్లతో జరిగే గ్లోబల్ క్వాలిఫయర్ ద్వారా నిర్ణయిస్తారు. దీనికి ప్రాంతీయ క్వాలిఫయింగ్ టోర్నీలు మద్దతుగా ఉంటాయి.
Also Read
- CM Revanth Reddy: 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం..!
- Monsoon Hair Care Tips: వర్షంలో జుట్టు తడిసిందా..? ఇలా చేస్తే చాలు జుట్టు రాలదు..
- Rishabh Agarwal: రూ.8.5 కోట్ల జాబ్కు నో చెప్పిన భారతీయ కుర్రాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?
- Musi Riverfront Project: రూ.7,345 కోట్ల పరిపాలనా అనుమతి.. 21 కి.మీ. మేర అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్.!
అహ్మదాబాద్ సమావేశంపై స్పందించిన ఐసీసీ ఛైర్మన్ Jay Shah, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధి, సమర్థవంతమైన పరిపాలన, సమాన అవకాశాల కల్పనపై ఐసీసీ కట్టుబడి ఉందని తెలిపారు. మహిళల క్రికెట్, అభివృద్ధి చెందుతున్న దేశాల క్రికెట్, ఫ్రాంచైజీ లీగ్ల నిర్వహణ వంటి అంశాలపై తీసుకున్న నిర్ణయాలు అభిమానులకు మరింత పోటీతో కూడిన, ఆసక్తికరమైన క్రికెట్ను అందించడంలో దోహదపడతాయని పేర్కొన్నారు.
మరోవైపు టెస్ట్ క్రికెట్లో వెలుతురు సమస్య కారణంగా ఆటకు అంతరాయం కలగకుండా ఉండేందుకు మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. డే టెస్టు మ్యాచ్ల్లో అవసరమైన సమయంలో ఎర్ర బంతి స్థానంలో పింక్ బాల్ వినియోగానికి ప్రయోగాత్మకంగా అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకు పింక్ బాల్ను కేవలం డే-నైట్ టెస్టుల్లో మాత్రమే ఉపయోగిస్తున్నారు. 2015 నవంబర్లో తొలి డే-నైట్ టెస్టు నిర్వహించారు. ప్రేక్షకులను ఆకర్షించడం, టెస్ట్ క్రికెట్కు కొత్త ఉత్సాహాన్ని తీసుకురావడం లక్ష్యంగా పింక్ బాల్ టెస్టులను ప్రవేశపెట్టారు. ఇకపై వెలుతురు తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఎర్ర బంతితో ఆట కొనసాగించడం కష్టమైతే, పింక్ బాల్ను ఉపయోగించి ఆటను కొనసాగించే అవకాశాన్ని పరిశీలించనున్నారు. దీంతో టెస్ట్ మ్యాచ్ల్లో వర్షం లేదా వెలుతురు కారణంగా కోల్పోయే ఆట సమయం తగ్గే అవకాశం ఉందని ఐసీసీ భావిస్తోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం..!
-
Tirumala: తిరుమలలో తలనీలాలు సమర్పించే ఆచారం ఎలా మొదలైంది.. దాని వెనుక ఉన్న పురాణం ఏంటి?
-
Monsoon Hair Care Tips: వర్షంలో జుట్టు తడిసిందా..? ఇలా చేస్తే చాలు జుట్టు రాలదు..
-
PM Modi: భారత్కు రూ.3,311 కోట్ల భారీ పెట్టుబడులు.. ఆస్ట్రేలియన్ సూపర్ ప్రకటనను స్వాగతించిన ప్రధాని మోడీ
-
Rishabh Agarwal: రూ.8.5 కోట్ల జాబ్కు నో చెప్పిన భారతీయ కుర్రాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!