KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు అభివృద్ధి, సంక్షేమానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ ప్రస్తుతం సంక్షోభంలోకి నెట్టబడిందని అన్నారు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నో పాటలు రాశారని కేటీఆర్ గుర్తు చేశారు. ఉద్యమ ప్రస్థానంలో కేసీఆర్ అనేక పాత్రలు పోషించారని, తెలంగాణ సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేశారని పేర్కొన్నారు. “తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో” అనే నినాదంతో ముందుకు సాగి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. కేసీఆర్ జీవిత గాథపై సినిమా తీయాలని ఒక దర్శకుడు తనను కలిసిన సందర్భాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైన తర్వాత ఆలోచిద్దామని కేసీఆర్ చెప్పారని, తెలంగాణ ఆవిర్భావం అనేది అన్ని ప్రతికూల పరిస్థితులను ఛేదించి సాధించిన చారిత్రక విజయమని ఆ దర్శకుడు అభిప్రాయపడ్డారని తెలిపారు. కేసీఆర్ అనే మూడు అక్షరాల ముందు “ముఖ్యమంత్రి” అనే పదవి చాలా చిన్నదిగా కనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించినట్లు చెప్పారు.
Also Read
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
- Commercial Taxes Department: వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ.. కొత్త డివిజన్లు, సర్కిల్స్ ఏర్పాటు.!
- Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
- Janasena: పవన్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన ఆగ్రహం.. తెలంగాణ పోలీసుల వైఖరిని తప్పుబట్టిన పార్టీ
ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన కేటీఆర్.. “పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది. నిష్ఫల తెలంగాణగా మారిపోయింది” అని విమర్శించారు. తెలంగాణ సాధన కోసం పదవిని మాత్రమే కాదు.. అవసరమైతే ప్రాణత్యాగానికీ సిద్ధపడ్డ నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యతో బాధపడిన ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించి వేలాది కుటుంబాల కష్టాలను తీర్చిన నాయకుడు కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొందరు ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారని ఆరోపించారు.
రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ.. 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే విజయం సాధించిందని, 2023 ఎన్నికల్లో కూడా ఒంటరిగానే పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిందని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అడ్డదారిలో అధికారంలోకి వచ్చిందని ఆరోపిస్తూ, ప్రస్తుతం రాష్ట్రాన్ని వెనక్కి నెట్టే విధంగా పాలన సాగుతోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ.. గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక, పరిపాలనా వ్యవస్థలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. “వడ్డించిన విస్తరి లాంటి తెలంగాణను కుక్కలు చింపిన విస్తరిగా మార్చుతున్నారు” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంక్షేమం, అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రస్తుతం సంక్షోభంలో కూరుకుపోయిందని కేటీఆర్ అన్నారు. అయితే ఈ పరిస్థితులు శాశ్వతం కాదని, 2028 డిసెంబర్లో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు మరోసారి బీఆర్ఎస్కు అవకాశం ఇస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
-
Mystery Crime Thriller OTT : కంటైనర్లో ఒంటరి మహిళ.. ఓటీటీలోకి మైండ్ బెండ్ చేసే మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Congress: సంచలన నిర్ణయాలు దిశగా కాంగ్రెస్.. భారీ నాయకత్వ మార్పులు వైపు అడుగులు?
-
Housing Loan: అలెర్ట్..అలెర్ట్.. హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొంటున్నారా? ఆర్థిక నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Pawan Kalyan: ప్రెస్మీట్కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!