Ramesh Nalam
Author- NTV Telugu-
CM Jagan: రైతుల ధాన్యం సేకరణను అధికారులందరూ సవాల్గా తీసుకోవాలి
CM Jagan: అమరావతిలోని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సోమవారం నాడు వ్యవసాయ శాఖపై అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రులు కాకాణి గోవర్ధన్రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర తీసివేస్తున్నామని.. రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందించేలా అధికారులు ధాన్యం సేకరణ కొనసాగించాలని సీఎం జగన్ సూచించారు. అటు ఎంఎస్పీ కన్నా తక్కువ ధరకు రైతులు అమ్ముకోవాల్సి వచ్చిందనే మాట ఎక్కడా […] -
Minister Roja: జగన్ తగ్గేది లేదు.. చంద్రబాబు, పవన్ నెగ్గేది లేదు..!!
Minister Roja: కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామిని ఏపీ టూరిజంశాఖ మంత్రి రోజా దర్శించుకున్నారు. ఈ సందర్శంగా స్వామి, అమ్మవార్లకు రోజా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మీడియా మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఒక రౌడీ మాదిరిగా కారు మీద కూర్చుని ఇప్పటం వెళ్లాడని […] -
JC Prabhakar Reddy: రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్రెడ్డి.. మహిళా కలెక్టర్కు వార్నింగ్
JC Prabhakar Reddy: టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి రెచ్చిపోయారు. అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీతో దురుసుగా ప్రవర్తించారు. కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తే అధికారులు స్పందించడం లేదని.. ఇలా అయితే స్పందన కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నారంటూ కలెక్టర్పై జేసీ ప్రభాకర్రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు కలెక్టర్ ముందు పేపర్లు విసిరేసి బీకేర్ ఫుల్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. కలెక్టర్గా పనికిరావంటూ దుర్భాషలాడారు. జిల్లా కలెక్టర్ తనను బయటకు […] -
Vidadala Rajini: త్వరలోనే ఎయిమ్స్లో కూడా ఆరోగ్యశ్రీ ప్రవేశపెడతాం
Vidadala Rajini: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ను సోమవారం మధ్యాహ్నం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజినీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎయిమ్స్కు ఇవ్వాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రొవైడ్ చేశామని తెలిపారు. రోడ్లు, ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్ సిస్టం కోసం సుమారుగా రూ.50 కోట్లను ఖర్చు చేశామని మంత్రి విడదల రజినీ వెల్లడించారు. పొల్యూషన్ బోర్డ్, ఫారెస్ట్ డిపార్టుమెంట్ క్లియరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిందని పేర్కొన్నారు. […] -
Virat Kohli: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా కోహ్లీ.. కెరీర్లోనే తొలిసారి
Virat Kohli: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రస్తుతం తనదైన శైలిలో అద్భుత ఫామ్తో ముందుకు దూసుకుపోతున్నాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో ఆడిన ఐదు మ్యాచ్లలో ఇప్పటికే మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. కెరీర్లో ఎన్నో రికార్డులకు రారాజుగా మారిన అతడు తొలిసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. గత ఏడాది జనవరిలో ఐసీసీ ఈ అవార్డును ప్రవేశపెట్టగా తొలిసారి కోహ్లీ ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. మొత్తం ముగ్గురు […] -
TTD Assets: ఆ ప్రముఖ కంపెనీల కన్నా.. తిరుమల శ్రీవారి ఆస్తులే ఎక్కువ..!!
తిరుమల శ్రీవారి ఆస్తులపై శనివారం నాడు టీటీడీ శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారికి రూ.2.5 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నట్లు టీటీడీ వెల్లడించింది. అయితే దేశంలోని ప్రముఖ కంపెనీల ఆస్తుల కంటే తిరుమల శ్రీవారి ఆస్తులే ఎక్కువ అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దేశంలోని అన్ని ప్రముఖ ఆలయాలతో పోలిస్తే తిరుమలకు ఉండే ప్రత్యేకత వేరు. తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని ప్రతియేటా లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు. భక్తులు ఎన్నో విలువైన […] -
Telugu Desam Party: బెజవాడ టీడీపీలో వేడెక్కుతున్న రాజకీయం
Telugu Desam Party: ఎన్టీఆర్ జిల్లా బెజవాడ టీడీపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆదివారం నాడు కేశినేని నాని, దేవినేని ఉమ వ్యతిరేక శిబిరాల సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న తన ఫార్మ్ హౌసులో టీడీపీ నేతల విందు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ సెగ్మెంట్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అటు మైలవరం టీడీపీలో గందరగోళం నెలకొంది. దేవినేని ఉమ, తన ఫొటో […] -
PeddiReddy: విద్యుత్ ప్రమాదాలకు చెక్.. అగ్రదేశాల్లో విధానాలపై అధ్యయనం
PeddiReddy: ఏపీలో ఇటీవల చోటు చేసుకున్న ప్రమాదాల నేపథ్యంలో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విద్యుత్ ప్రమాదాల నివారణపై అధికారులతో ఆదివారం మరోసారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సాధ్యమైనంత మేర విద్యుత్ ప్రమాదాలను నివారించే వ్యవస్థను రూపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఏపీలో విద్యుత్ ప్రమాదాల నివారణకు అన్ని స్థాయిల్లో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను రూపొందించాలని విద్యుత్ సంస్థలను ఆదేశించామన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న విద్యుత్ […] -
Team India: మిస్టర్ 360 సూర్యకుమార్ ఖాతాలో మరో రికార్డు
Team India: టీమిండియా యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఈ ఏడాది ఆరంభం నుంచి సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ముఖ్యంగా టీ20 క్రికెట్లో అతడు తన విశ్వరూపం చూపిస్తున్నాడు. దీంతో ఐసీసీ ర్యాంకుల్లోనూ సూర్యకుమార్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో పొట్టి ఫార్మాట్లో ఒక్క ఏడాదిలో వెయ్యి పైగా పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా సూర్యకుమార్ అలియస్ మిస్టర్ 360 రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది ఆడిన అన్ని టీ20 […] -
Andhra Pradesh: అమ్మాయిలతో చిందులు.. టెక్కలి ఎస్ఐపై వేటు
Andhra Pradesh: శ్రీకాకుళంలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు ఇటీవల జోరుగా జరిగాయి. ఈ సందర్భంగా టెక్కలిలోని వెంకటేశ్వర కాలనీలోని ఆయన ఇంటి ఆవరణలో రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశారు. కొంతమంది మహిళా డ్యాన్సర్లతో ఈ కార్యక్రమాన్ని ధూంధాంగా నిర్వహించారు. అయితే ఈ వేడుకల్లో పోలీస్ శాఖకు చెందిన పలువురు కూడా పాల్గొన్నారు. డ్యాన్సర్లతో పాటు వాళ్లు కూడా డ్యాన్యులు చేసి హోరెత్తించారు. టెక్కలి ఎస్సై హరికృష్ణ స్టేజీపై అదిరిపోయే స్టెప్పులు వేశారు. మహిళా […]
తాజావార్తలు
-
Captain Rajat Patidar: ఎట్టకేలకు కెప్టెన్సీ కొట్టేసిన రజత్ పాటిదార్.. సంతోషంలో ఆర్సీబీ ఫ్యాన్స్..
-
US: తక్షణమే పశ్చిమాసియాను ఖాళీ చేయండి.. పౌరులకు అమెరికా హెచ్చరిక
-
Success Story: నీరజ్ చోప్రాను మట్టి కరిపించిన రుమేష్ పతిరాగే ఎవరు..? అతడికి క్రికెట్తో సంబంధం ఏంటి..?
-
Hyderabad Metro : 25 నిమిషాల్లో ప్రాణం కాపాడిన హైదరాబాద్ మెట్రో..
-
Rahul Gandhi: నీట్ బాధిత కుటుంబాలకు రాహుల్ గాంధీ ఓదార్పు.. ఎక్స్లో ఫొటోలు పోస్ట్
ట్రెండింగ్
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!