2020-21 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారికి కేంద్ర ప్రభుత్వం చేదువార్తను అందించింది. డిసెంబర్ 31తో ముగుస్తున్న ఐటీఆర్ దాఖలు గడువును పెంచేందుకు కేంద్రం నిరాకరించింది. ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును ఎట్టి పరిస్థితుల్లో పొడిగించే అవకాశం లేదని కేంద్ర రెవెన్యూశాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు 5.62 కోట్ల మంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారని ఆయన పేర్కొన్నారు. Read Also: ఏడాదిలో చివరి రోజు… స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు […]
ఈ ఏడాదిని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగించాయి. ఈరోజు ఉదయమే లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ చివరకు లాభాలతోనే ముగించడం విశేషం. సెన్సెక్స్ 459.5 పాయింట్ల లాభంతో 58,253 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 150 పాయింట్లు లాభపడి 17,354 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్లో టైటాన్, ఆల్ట్రాటెక్ సిమెంట్స్, కొటక్ మహింద్రా బ్యాంక్, మారుతి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థల షేర్లు లాభపడ్డాయి. ఎన్టీపీసీ, టెక్ మహింద్రా, పవర్ గ్రిడ్, డాక్టర్ […]
సొంత పార్టీలోని కోవర్టులకు నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా షాకిచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ను నగరి ఎమ్మెల్యే రోజా కలిశారు. ఈ మేరకు వైసీపీలో కోవర్టులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వైసీపీలో ఉంటూ టీడీపీతో అంటకాగే వారిని ఉపేక్షించే పరిస్థితి లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. రాష్ట్ర డీజీపీ ఫోటోలతోనూ కోవర్టులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫొటోలను ఫ్లెక్సీల్లో […]
కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ అందించింది. తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న విజయ డెయిరీ సంస్థ పాల ధరలను పెంచింది. లీటరు పాలపై రూ.2 పెంచింది. అటు హోల్ మిల్క్ లీటరుకు రూ.4 పెంచుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ ప్రకటించింది. ఈరోజు నుంచే కొత్త ధరలు అమలులోకి వస్తాయని చెప్పింది. Read Also: హైదరాబాద్లో అందుబాటులోకి కోవిడ్ మాత్రలు మరోవైపు […]
టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కోల్కతాలోని ఉడ్ల్యాండ్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన తాజాగా కోలుకున్నారు. శుక్రవారం గంగూలీకి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా నెగిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన ఈరోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది బయటిదాకా వచ్చి గంగూలీకి వీడ్కోలు పలికారు. నాలుగు రోజుల క్రితం కొంచెం అలసటగా ఉండటంతో గంగూలీ […]
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్కు వింత అనుభవం ఎదురైంది. మెల్బోర్న్లోని ఓ హోటల్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బస చేస్తున్న సమయంలో… ఓ పని మీద బయటకు వెళ్లిన స్టీవ్ స్మిత్ ఓ లిఫ్టులో ఇరుక్కుపోయాడు. లిఫ్ట్ పనిచేయకపోవడంతో దాదాపు గంట సేపు స్మిత్ లిఫ్టులోనే ఉండిపోయాడు. ఈ విషయాన్ని స్వయంగా స్టీవ్ స్మిత్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. Read Also: ఓటమి ఎఫెక్ట్.. టెస్ట్ క్రికెట్కు స్టార్ ప్లేయర్ గుడ్బై అయితే స్మిత్ […]
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ భారత్లోనూ తన ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో భారత్లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. రాజస్థాన్ ఉదయ్పూర్కు చెందిన 73 ఏళ్ల వ్యక్తి ఒమిక్రాన్ కరోనా వేరియంట్ కారణంగా మరణించినట్లు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ సోకిన అతడు కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం నాడు మరణించినట్లు వారు పేర్కొన్నారు. Read Also: వస్త్రాలపై జీఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా అయితే ఒమిక్రాన్ కారణంగా చనిపోయిన వృద్ధుడికి హైపర్టెన్షన్తో పాటు డయాబెటిస్ […]
విశాఖ జిల్లా వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు సొంత పార్టీ కార్యకర్తల నుంచే అసమ్మతి సెగ ఎదురైంది. పాయకరావుపేట మండలం రాజవరం గ్రామంలో మంచినీటి పైపులైన్ ప్రారంభించడానికి వెళ్లిన ఎమ్మెల్యే గొల్ల బాబూరావును వైసీపీ కార్యకర్తలు అడ్డుకుని గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. జగన్ ముద్దు- ఎమ్మెల్యే వద్దు అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం ఎమ్మెల్యే కారుకు అడ్డంగా రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఎమ్మెల్యే మద్దతుదారులు, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. Read […]
కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ మళ్లీ సొంతగూటికి చేరనున్నారు. ఈ మేరకు గురువారం నాడు హైదరాబాద్ ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మాజీ మేయర్ రవీందర్ సింగ్ కలిశారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక సంస్థలలో నెలకొన్న సమస్యలు, సిక్కు సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ సమస్యలను పరిష్కరిస్తామని రవీందర్ సింగ్కు కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. Read […]
దేశంలోనే అతిపెద్ద రియాలిటీషోలలో బిగ్బాస్ ఒకటి. ఈ షోకు ఏ భాషలో అయినా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇటీవల తెలుగు బిగ్బాస్-5 సీజన్ ముగిసింది. వీజే సన్నీ విజేతగా… యూట్యూబర్ షణ్ముఖ్ రన్నరప్గా నిలిచారు. మరోవైపు ఈ సీజన్ ఫినాలే ఎపిసోడ్కు టీఆర్పీ రేటింగ్ బాగానే వచ్చింది. చాలా మంది సెలబ్రిటీలు ఫినాలే ఎపిసోడ్కు రావడంతో ప్రేక్షకులు టీవీకి అతుక్కుపోయారని టీఆర్పీని చూస్తే అర్ధమవుతోంది. బ్రహ్మాస్త్ర టీమ్, పుష్ప టీమ్, పరంపర వెబ్ సిరీస్ టీమ్, శ్యామ్ […]