బ్రేకింగ్… ఇండియాలో తొలి ఒమిక్రాన్ మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ భారత్లోనూ తన ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో భారత్లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. రాజస్థాన్ ఉదయ్పూర్కు చెందిన 73 ఏళ్ల వ్యక్తి ఒమిక్రాన్ కరోనా వేరియంట్ కారణంగా మరణించినట్లు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ సోకిన అతడు కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం నాడు మరణించినట్లు వారు పేర్కొన్నారు.
Read Also: వస్త్రాలపై జీఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా
Also Read
- Hyderabad: లవ్ ఫెయిల్యూర్తో సూసైడ్ ప్లాన్.. నిమిషాల్లో యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు
- Trump: రష్యా, ఉక్రెయిన్కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
- Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
- Karnataka: ఫ్రీ బస్సు కోసం కోటి ‘శక్తి’ స్మార్ట్ కార్డులు పంపిణీ.. రూ.250 కోట్లు ఖర్చు!
అయితే ఒమిక్రాన్ కారణంగా చనిపోయిన వృద్ధుడికి హైపర్టెన్షన్తో పాటు డయాబెటిస్ కూడా ఉందని అధికారులు నిర్ధారించారు. డిసెంబరు 15న 73 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని… ఈ క్రమంలోనే జ్వరం, దగ్గు, రినైటిస్ వంటి లక్షణాలతో బాధపడుతుండడం కారణంగా ఒమిక్రాన్ పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చిందన్నారు. అనంతరం డిసెంబర్ 21, 25 తేదీల్లో మరోసారి ఒమిక్రాన్ పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చిందని… అయితే ఒమిక్రాన్ నెగిటివ్ వచ్చిన తర్వాత పోస్ట్ కోవిడ్ న్యూమోనియా ఎఫెక్ట్ ద్వారా వృద్ధుడు మరణించాడని అధికారులు పేర్కొన్నారు. కాగా ఉదయ్పూర్లో ఇప్పటి వరకు 3 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. రాజస్థాన్రాష్ట్రంలో మొత్తం 69 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి.
మరోవైపు మహారాష్ట్రలో కూడా ఒమిక్రాన్ కారణంగా ఓ వ్యక్తి చనిపోయినట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. పుణెలోని పింప్రీ చించువాడ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 52 ఏళ్ల వ్యక్తి ఒమిక్రాన్తో చనిపోయినట్టు అధికారులు నిర్ధారించారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
-
OTR: వివాదాలకు కేరాఫ్గా బోనబోయిన శ్రీనివాస్..
-
Gut Health: జీర్ణక్రియ మెరుగుపడాలంటే..? రోజువారీ ఆహారంలో ఈ ఐదు చేర్చండి
-
OTR: యాక్టివ్ మోడ్లోకి షకీల్.. కవిత ఎఫెక్ట్, కేటిఆర్ వార్నింగ్ కారణమా ?
-
OTR: కొండా సురేఖ బీజేపీలో చేరుతుందా ?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!