Ramesh Nalam
Author- NTV Telugu-
Bigg Boss 6: ఇనయా రాక్స్.. శివ షాక్స్.. ఆడియన్స్ క్లాప్స్..!!
Bigg Boss 6: బిగ్బాస్-6 తెలుగు సీజన్ చివరి వారంలోకి ప్రవేశించింది. గత వారం ఇనయా ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఈ వారం మిడ్వీక్ ఎలిమినేషన్ ఉంటుందని ఆల్రెడీ నాగార్జున చెప్పేశారు. దీంతో మరొక కంటెస్టెంట్ బుధవారం ఎలిమినేట్ కానున్నారు. ఆదివారం గ్రాండ్ ఫినాలే ఉంటుంది. అయితే ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన ఇనయాను బీబీ కేఫ్లో యాంకర్ శివ ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలను సంధించాడు. గతంలో యాంకర్ శివ ప్రశ్నలకు […] -
Fifa World Cup: ఫిఫా ప్రపంచకప్ విజేతకు ఇచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
Fifa World Cup: ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ మరికొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ ప్రపంచకప్లో మొత్తం 32 జట్లు పోటీ పడ్డాయి. క్రొయేషియా, ఫ్రాన్స్, మొరాకో, అర్జెంటీనా సెమీఫైనల్ చేరాయి. వీటిలో రెండు జట్లు ఈనెల 18న జరిగే ఫైనల్లో తలపడతాయి. అయితే ఫిఫా ప్రపంచకప్ విజేతకు ఎంత ప్రైజ్ మనీ వస్తుందనే విషయంలో పలువురు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ప్రపంచంలో అన్ని మెగా టోర్నీల కంటే ఫిఫా ప్రపంచకప్లో వచ్చే ప్రైజ్ మనీ ఎక్కువగా ఉంటుంది. […] -
Top Headlines @9 PM: టాప్ న్యూస్
దాడులు చేసినా వెనక్కి తగ్గేది లేదు తెలంగాణ జాగృతి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. అయితే.. ఈ సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతికి ఇద్దరు స్ఫూర్తి ప్రదాతలు ఒకరు కేసీఆర్ మరొకరు ప్రొఫెసర్ జయశంకర్ అని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. తెలంగాణలో ఉన్న యువతి యువకులు దేశం గురించి ఆలోచించాలని, దేశంలో మేధావులు మాట్లాడడం మానేశారన్నారు. రచయితలు ఎందుకోసం రాయాలి ? ఎవరి కోసం […] -
Tirumala: ఆన్లైన్లో తిరుమల లడ్డూల విక్రయం.. కీలక ప్రకటన చేసిన టీటీడీ
Tirumala: తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది వెళ్తుంటారు. ప్రతిరోజూ శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. సెలవు దినాల్లో అయితే ఈ సంఖ్య లక్షల్లో ఉంటుంది. తిరుమలలో దర్శనం చేసుకోవడం ఎంత ముఖ్యమో.. ఆ స్వామి ప్రసాదం స్వీకరించడం కూడా అంతే ముఖ్యం. అందుకే శ్రీవారి లడ్డూ తినాలని అందరూ పరితపిస్తుంటారు. దీంతో తిరుమల లడ్డూలకు తీవ్ర డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో తిరుమల లడ్డూలు బుక్ చేసుకోవచ్చని సోషల్ మీడియాలో […] -
Team India: బంగ్లాదేశ్తో తొలి టెస్ట్.. రిషబ్ పంత్కు బీసీసీఐ షాక్
Team India: ఈనెల 14 నుంచి బంగ్లాదేశ్తో టీమిండియా రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. అయితే టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే భారత జట్టుకు షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా దూరమయ్యాడు. ఇప్పటికే షమీ, జడేజా లాంటి ప్రధాన ఆటగాళ్లు కూడా గాయాల కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు బీసీసీఐ జట్టులో పలు మార్పులు చేసింది. రోహిత్ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ను ఎంపిక చేసింది. అటు […] -
Health Tips: వయసుతో పాటు బరువు కూడా పెరుగుతున్నారా? అయితే ఇలా చేయండి
Health Tips: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది బరువుతో బాధపడుతున్నారు. పెరుగుతున్న వయసుతో పాటు కొంతమంది బరువు కూడా పెరిగిపోతున్నారు. దీంతో 30 లేదా 40 ఏళ్లు వచ్చేసరికి ఏ పని కూడా సక్రమంగా చేయలేకపోతున్నారు. అంతేకాకుండా అధిక బరువు ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణం అవుతుండటంతో చిన్నతనంలోనే అనేక జబ్బుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా బరువు పెరిగితే శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అందుకే బరువు పెరగకుండా ప్రతిరోజూ వ్యాయామాలు చేయడం అవసరం. మరోవైపు […] -
Gudivada Amarnath: వారాహిపై సెటైర్లు.. పవన్కు రంగులు మార్చడం తేలికే కదా..!!
Gudivada Amarnath: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. ఏపీకి వారాహి వస్తే అప్పుడు చూద్దామని వ్యాఖ్యానించారు. నిబంధనలకు అనుగుణంగా ఏపీ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఉందా లేదా అనేది ఇక్కడి అధికారులు చూస్తారన్నారు. ఒకవేళ నిబంధనల ప్రకారం లేకుంటే వాహనం మార్చాల్సిన అవసరం ఉండదని.. కేవలం రంగు మాత్రమే మార్చాల్సి ఉంటుందన్నారు. పవన్కు రంగులు మార్చడం తేలికే కదా అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. 2014 […] -
Central Government: ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం
Central Government: ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వైఖరిని రాజ్యసభ వేదికగా వెల్లడించింది. ఏపీకి ప్రత్యేక హోదా అంశం ప్రస్తుతం ఉనికిలోనే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం నాడు రాజ్యసభలో వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. వివిధ కారణాలు, ప్రత్యేక పరిస్థితుల రీత్యా గతంలో జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించిందని.. […] -
Ramakrishna Math: బుక్ లవర్స్కు శుభవార్త.. పుస్తకాలపై 40 శాతం డిస్కౌంట్
Ramakrishna Math: ఆన్లైన్లో పుస్తకాలు అందుబాటులోకి వచ్చినా మనకు నచ్చిన పుస్తకం కొనుగోలు చేసి చదువుతుంటే వచ్చే కిక్కే వేరు. అందుకే ఇప్పటికీ చాలా మంది రైళ్లు లేదా బస్సుల్లో పుస్తకాలు చదువుతూ కనిపిస్తుంటారు. ఈ నేపథ్యంలో పుస్తకాల ప్రియులకు హైదరాబాద్లోని రామకృష్ణ మఠం బంపర్ ఆఫర్ ఇచ్చింది. దివ్యజనని శ్రీ శారదాదేవి 170వ జయంతి సందర్భంగా డిసెంబర్ 15న హైదరాబాద్ రామకృష్ణ మఠంలో పుస్తకాల కొనుగోలుపై 40 శాతం డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించింది. స్వామి వివేకానంద […] -
Steel Plant: కడపలో స్టీల్ప్లాంట్ పెట్టుబడులకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్
Steel Plant: కడపలో స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోయాయి. తాజాగా కడప స్టీల్ప్లాంట్ కోసం రూ.23,985 కోట్ల పెట్టుబడులకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం నాడు సీఎం జగన్ అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశమైంది. ఈ మేరకు కడప జిల్లాలో రూ.8,800 కోట్లతో సున్నపురాళ్లపల్లెలో జేఎస్డబ్ల్యూ ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్ ప్రతిపాదనకు ఎస్ఐపీబీ అమోదముద్ర వేసింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ ఏర్పాటు చేయనున్న […]
తాజావార్తలు
-
Varun Chakravarthy: వైభవ్ వికెట్తో చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. టీ20లలో నయా హిస్టరీ
-
Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!
-
Car Insurance: మీ కారుకు ఇన్సూరెన్స్ ఉన్నా క్లెయిమ్ రావడం లేదా..? అయితే వీటిపై ఓ లుక్కేయండి..
-
Ambati Rambabu : అమరావతి అంతులేని కథ.. 100 జన్మలెత్తినా పూర్తి కాదు
-
US-Iran Talks: నిర్మానుష్యంగా పాకిస్తాన్ రాజధాని.. ఇస్లామాబాద్ లాక్డౌన్
ట్రెండింగ్
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?