Rajesh Veeramalla
Author- NTV Telugu-
Pulses Price Hike: పెరుగుతున్న పప్పుల ధరలు. బ్రేక్ వేయనున్న కేంద్రం..!
రుగుతున్న పప్పుల ధరలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు గోధుమల వంటి బఫర్ స్టాక్ నుండి పప్పులను విక్రయించనుంది. దీంతో మార్కెట్లోకి కందిపప్పు రానుండటంతో ధరలు కొంతమేర తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. -
Silver Price Hike: 48 గంటల్లో రూ.2300 పెరిగిన వెండి ధర.. కారణాలవే..!
గత 48 గంటల్లో బంగారం ధర రూ.58,400 నుంచి రూ.58,300కి తగ్గినప్పటికీ.. వెండి ధర మాత్రం విపరీతంగా పెరిగింది. దీనికి కారణం అమెరికా యొక్క PMI గణాంకాలు మరియు రష్యాలో పెరుగుతున్న అస్థిరత అని అంటున్నారు. అయితే ఈ రెండు దేశాలు వెండి ధరను పెంచేంత పెద్దవి కావు. మరోవైపు మెక్సికో మరియు పెరూ వంటి దేశాల నుండి వచ్చిన నివేదికలు వెండి ధరలు మళ్లీ ఆకాశాన్నంటేలా ఉన్నాయి. -
Vedanta-Foxconn: వేదాంత- ఫాక్స్కాన్ మధ్య చీలిక వచ్చిందనే వార్తలకు చెక్.. సెమీకండక్టర్ ప్లాంట్ కోసం కొత్త దరఖాస్తు
వేదాంత మరియు ఫాక్స్కాన్ మధ్య సంబంధాలలో చీలిక వచ్చిందని ఒక రోజు క్రితం ఊహాగానాలు వచ్చాయి. ఈ సంస్థల మధ్య సంబంధం ఎప్పుడైనా ముగిసిపోవచ్చన్నారు. అందుకు ఫాక్స్కాన్ కొత్త భాగస్వామి కోసం వెతకడం ప్రారంభించింది అని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు బయటకు వచ్చిన వార్త ఈ ఊహాగానాలన్నింటికీ తెరపడింది. వేదాంత-ఫాక్స్కాన్ వెంచర్ 40-నానోమీటర్ నోట్ టెక్నాలజీ కింద ప్రభుత్వానికి కొత్త సెమీకండక్టర్ అప్లికేషన్ను దాఖలు చేసింది. -
HDFC: హెచ్డిఎఫ్సి కస్టమర్లకు పెద్ద వార్త.. జూలై 1 నుంచి ఇవి వర్తిస్తాయి..!
హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్లకు పెద్ద వార్త చెప్పింది. మీ ఖాతా కూడా హెచ్డిఎఫ్సిలో ఉన్నట్లయితే మీరు ఈ వార్తలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాస్తవానికి HDFC బ్యాంక్ మరియు HDFC లిమిటెడ్ విలీన తేదీ తెరపైకి వచ్చింది. వచ్చే నెల 1 జూలై 2023 నుండి అమలులోకి వస్తుంది. -
Viral News: కుక్క తప్పిపోయిందని పోలీసులను తిప్పలు పెడుతున్న మున్సిపల్ కమిషనర్. దాదాపు 500 ఇళ్లలో సోదాలు..!
ముద్దుగా ప్రేమగా పెంచుకునే కుక్క కనిపించకుండాపోయిందని ఓ మున్సిపల్ కమిషనర్ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతుంది. ఆదివారం సాయంత్రం నుండి కనపడకపోవడంతో.. పోలీసులు జల్లెడ పడుతున్నారు. విశ్రాతి లేకుండా 500 ఇళ్లలో సోదాలు జరిపారు. అయినప్పటికీ ఆ కుక్క ఆచూకీ దొరకలేదు. -
Bengal Violence: బెంగాల్లో పంచాయతీ ఎన్నికలకు ముందు హింస.. గవర్నర్కు నల్లజెండాలు చూపించిన TMC కార్యకర్తలు..
జూలై 8న పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికల ముందు రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింస చెలరేగుతోంది. గత నెల నుండి రాష్ట్రంలోని అనేక జిల్లాల నుండి హింస వార్తలు నిరంతరం వస్తూనే ఉన్నాయి. ఈలోగా ఎన్నికల ఔత్సాహికులు జోరందుకున్నారు. ముర్షిదాబాద్లో తృణమూల్, సీపీఎం మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా గవర్నర్ కాన్వాయ్కు నల్లజెండాలు చూపించారు. ముర్షిదాబాద్ జిల్లా డోమ్కోల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో హింస చెలరేగింది. -
Indian Gold: దేశంలోని ఈ గనుల నుండి బంగారం వస్తుందట.. 500 కోట్లు పెట్టుబడి పెట్టనున్న ప్రభుత్వం..!
KGF అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ మూసివేయబడినప్పటి నుండి భారతదేశంలో బంగారం ఉత్పత్తి దాదాపు ఆగిపోయింది. అయితే మరోసారి దేశంలోని గనుల నుండి బంగారం బయటపడబోతోంది. ఇందుకోసం ప్రభుత్వ మైనింగ్ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండిసి) పూర్తి సన్నాహాలు చేసింది. గనుల నుండి బంగారాన్ని వెలికితీసేందుకు ప్రభుత్వ సంస్థ సుమారు రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. NMDC ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని చిగరగుంట-బిసనాథం గోల్డ్ బ్లాక్ను లీజుకు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. -
EPFO: అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి తేదీ పొడిగింపు..!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువు పొడింగించారు. జూన్ 26 నుండి జూలై 11 వరకు చివరి తేదీని పొడిగించింది. -
Himachal Rain: హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు. ఉప్పొంగుతున్న నదులు.. రోడ్లపై ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు..!
హిమాచల్ ప్రదేశ్లో తొలి రుతుపవన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 6 మంది మృతి చెందినట్లు వార్తలు వస్తుండగా.. అన్ని చోట్లా పరిస్థితి దారుణంగా ఉంది. వర్షపు నీటి కారణంగా చాలా నదులు ఉప్పొంగుతున్నాయి. అంతేకాకుండా కొన్ని రహదారులపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు రహదారులపై జామ్ ఏర్పడింది. మండి నుంచి కులు వెళ్లే రహదారిపై కొండచరియలు భయంకరంగా విరిగిపడ్డాయి. -
Delhi Metro: 15 గంటల్లో 286 స్టేషన్లు కవర్ చేసిన ఓ వ్యక్తి.. గిన్నిస్ వరల్డ్ రికార్డు..!
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లలో ఢిల్లీ మెట్రో ఒకటి. అక్కడ 287 మెట్రో స్టేషన్లలో ప్రతిరోజూ 17 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. ఢిల్లీ మెట్రో పసుపు, నీలం వంటి 10 లైన్లలో విస్తరించి ఉంది. దీని నెట్వర్క్ 348.12 కి.మీ ఉంటుంది. అయితే అటువంటి పరిస్థితిలో అన్ని స్టేషన్లను కవర్ చేయడానికి చాలా గంటలు పడుతుంది. ఏప్రిల్ 2021లో ఫ్రీలాన్స్ పరిశోధకుడు, ప్రయాణ ప్రియుడైన శశాంక్ మను ఢిల్లీ మెట్రోలో అలాంటి ఫీట్ చేసాడు.
తాజావార్తలు
-
OTR : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి తలనొప్పిగా మారారా?
-
Story Board : బ్యాంక్ అకౌంట్ ఉంటే బాదుడు తప్పదా..?
-
Ponguleti Srinivas Reddy: ధరణి అక్రమాలు, భూ సమస్యలపై సెట్ విచారణ
-
Selling Racket: తల్లి ఒడిలో ఉండాల్సిన పసికందుకు ధర..
-
Operation Muskaan : ‘ఆపరేషన్ ముస్కాన్’ సక్సెస్.. 6,307 మంది చిన్నారులకు కొత్త జీవితం.!
ట్రెండింగ్
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!