Vedanta-Foxconn: వేదాంత- ఫాక్స్కాన్ మధ్య చీలిక వచ్చిందనే వార్తలకు చెక్.. సెమీకండక్టర్ ప్లాంట్ కోసం కొత్త దరఖాస్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vedanta-Foxconn: వేదాంత మరియు ఫాక్స్కాన్ మధ్య సంబంధాలలో చీలిక వచ్చిందని ఒక రోజు క్రితం ఊహాగానాలు వచ్చాయి. ఈ సంస్థల మధ్య సంబంధం ఎప్పుడైనా ముగిసిపోవచ్చన్నారు. అందుకు ఫాక్స్కాన్ కొత్త భాగస్వామి కోసం వెతకడం ప్రారంభించింది అని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు బయటకు వచ్చిన వార్త ఈ ఊహాగానాలన్నింటికీ తెరపడింది. వేదాంత-ఫాక్స్కాన్ వెంచర్ 40-నానోమీటర్ నోట్ టెక్నాలజీ కింద ప్రభుత్వానికి కొత్త సెమీకండక్టర్ అప్లికేషన్ను దాఖలు చేసింది. దీనిబట్టి చూస్తే ఆ రెండు సంస్థలు కలిసి పనిచేస్తున్నారని అర్థం. వేదాంత ఒక మీడియా నివేదికలో దరఖాస్తు యొక్క పునఃసమర్పణను ధృవీకరించింది. కంపెనీ ప్రకారం సవరించిన మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తు సమర్పించబడింది. భారత్లో ప్రపంచ స్థాయి ఫ్యాబ్ను తయారు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
Read Also: Malaria: అమెరికాను భయపెడుతున్న మలేరియా.. 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా కేసులు..
Also Read
గత సంవత్సరం ప్రారంభంలో వేదాంత 28 nm నోడ్ కోసం దరఖాస్తు చేసింది. అయితే ఇప్పుడు వేదాంత ఫాక్స్కాన్ సెమీకండక్టర్ జెవి 40 ఎన్ఎమ్ నోడ్లను కూడా కొనసాగించేందుకు ఆసక్తి చూపుతోంది. ఇది 40 nm కంటే ఎక్కువ పరిపక్వ నోడ్లను ప్రోత్సహించే ప్రభుత్వ వ్యూహానికి అనుగుణంగా ఉంది. వేదాంత ఫాక్స్కాన్ సెమీకండక్టర్ CEO డేవిడ్ రీడ్ ఇంతకుముందు బిజినెస్ టుడేతో మాట్లాడుతూ.. మా వద్ద 3 nm లేవని.. ఇది ఏ మానవ DNA పరిమాణానికి సమానం అని కొందరు అంటున్నారని తెలిపారు. తాను 1.5 nmలో ఒక కథనాన్ని చూశానని.. అది చక్కెర అణువు యొక్క పరిమాణానికి సమానమని అన్నారు. అంతేకాకుండా తాము 55 nm, 90 nm, 65 nm యొక్క చిప్లను తయారు చేస్తామని తెలిపారు.
మరోవైపు సెమీకండక్టర్ తయారీపై వేదాంత సీరియస్ గా ఉంది. సెమీకండక్టర్ తయారీ ప్రణాళికలపై తీవ్రంగా కృషి చేస్తోంది. అంతేకాకుండా ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి గుజరాత్లో భూమిని ఖరారు చేయడమే కాకుండా.. కంపెనీ ప్రపంచ ప్రతిభను తీసుకురావాలని చూస్తోంది. JV తన బృందంలో ఇప్పటికే కొంతమంది పరిశ్రమ నిపుణులను నియమించుకుంది. వేదాంత ఫాక్స్కాన్ సెమీకండక్టర్ జాయింట్ వెంచర్కు సంబంధించి CEOగా డేవిడ్ రీడ్ను నియమించింది.
Read Also: Pune: ప్రపోజల్ని తిరస్కరించిందని గర్ల్ఫ్రెండ్పై కొడవలితో దాడి..
ఫాక్స్కాన్ తన సెమీకండక్టర్ వ్యాపారం కోసం కొత్త భాగస్వామిని కనుగొనడానికి పెద్ద భారతీయ వ్యాపార సంస్థలను కలుస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం జేవీలో వేదాంతకు 67 శాతం వాటా ఉంది.
అంతేకాకుండా సంబంధిత మంత్రిత్వ శాఖ ఫాక్స్కాన్నే నాయకత్వం వహించాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ పుకార్లను వేదాంత కొట్టిపారేసింది. జూన్ 1న భారతదేశం సెమీకండక్టర్ ప్లాంట్ల కోసం దరఖాస్తులు చేసింది. కొత్త దరఖాస్తుదారులను అంగీకరించడం, మూల్యాంకనం చేయడం ప్రారంభించింది. ఇప్పటికే ఉన్న దరఖాస్తుదారులను కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని.. అలాగే మెచ్యూర్డ్ నోడ్లను ఫార్వార్డ్ చేయాలని ప్రభుత్వం కోరింది.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!