Bengal Violence: బెంగాల్లో పంచాయతీ ఎన్నికలకు ముందు హింస.. గవర్నర్కు నల్లజెండాలు చూపించిన TMC కార్యకర్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal Violence: జూలై 8న పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికల ముందు రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింస చెలరేగుతోంది. గత నెల నుండి రాష్ట్రంలోని అనేక జిల్లాల నుండి హింస వార్తలు నిరంతరం వస్తూనే ఉన్నాయి. ఈలోగా ఎన్నికల ఔత్సాహికులు జోరందుకున్నారు. ముర్షిదాబాద్లో తృణమూల్, సీపీఎం మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా గవర్నర్ కాన్వాయ్కు నల్లజెండాలు చూపించారు. ముర్షిదాబాద్ జిల్లా డోమ్కోల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో హింస చెలరేగింది. ఇక్కడ ప్రచారం సందర్భంగా తృణమూల్, సీపీఎం మద్దతుదారుల మధ్య వాగ్వాదం జరిగింది. దోమకోల్లో సీపీఎం అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇంతలో తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులు ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా ప్రతిపక్షాలు గొడవకు దిగారని ఆరోపించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా బాంబులు కూడా విసురుకున్నారు. టీఎంసీ మద్దతుదారులపై కూడా కాల్పులు జరిపారని చెప్పారు. ఈ క్రమంలో నలుగురు టీఎంసీ కార్యకర్తలు ఆస్పత్రిలో చేరారు.
Read Also: Aishwarya Arjun Love: ఒక్క సినిమాలో కూడా కలిసి నటించకపోయినా అర్జున్ కూతురు లవ్ లో ఎలా పడిందో తెలుసా?
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
అంతేకాకుండా సిలిగురిలో గవర్నర్ సీవీ ఆనంద్ బోస్కు తృణమూల్ కార్యకర్తలు, సీపీఎం మద్దతుదారులు నల్లజెండాలు చూపించారు. ఉత్తర బెంగాల్ పర్యటనలో ఉన్న గవర్నర్ అక్కడ వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో సమావేశమయ్యారు. నార్త్ బెంగాల్ యూనివర్శిటీకి వెళ్లిన ఆయన అక్కడ టీఎంసీ కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసి నల్లజెండాలు చూపించారు. వాస్తవానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బ్రత్యాబసు అనుమతి లేకుండానే గవర్నర్ కొంతమంది వైస్ ఛాన్సలర్లను నియమించారు. బెంగాల్లో ప్రభుత్వ ఆమోదం లేకుండానే వైస్ ఛాన్సలర్లను గవర్నర్ నియమించారని టీఎంసీ విమర్శిస్తోంది.
Read Also: Indian Gold: దేశంలోని ఈ గనుల నుండి బంగారం వస్తుందట.. 500 కోట్లు పెట్టుబడి పెట్టనున్న ప్రభుత్వం..!
మరోవైపు పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. 12 ఏళ్ల తర్వాత మమతా బెనర్జీ పంచాయతీ ఎన్నికల కోసం ప్రచారం చేస్తుందని.. రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది కాబట్టే మమతా ప్రచారం చేస్తోందన్నారు. అయితే ప్రచారం చేయకుంటే తమ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందని ఆమె గ్రహించారని రంజన్ చౌదరి తెలిపారు. అటు ప్రచారంలో భాగంగా జల్పాయిగురిలోని మల్బజార్ మమతా బెనర్జీ.. ఓ టీ స్టాల్లో టీ తయారు చేశారు. అక్కడున్న జర్నలిస్టులు, పార్టీ నాయకులు, ఇతర అధికారులకు టీ ఇచ్చారు. ఈ సందర్భంగా మమతా మాట్లాడుతూ.. ఇందులో కొత్తదనం ఏమీ లేదన్నారు. నేను ఎప్పుడూ టీ చేస్తాన అని.. తాను డార్జిలింగ్కు వెళ్లినప్పుడల్లా మోమోస్ను తయారు చేయడం కూడా ఇష్టపడతానని తెలిపారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!