జేఈఈ మెయిన్-2025 సెషన్-1 పరీక్షలు రేపటి(బుధవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30 వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఈ నెల 22 నుంచి జరగనున్న జేఈఈ మెయిన్ పరీక్షలను రెండు దశల్లో నిర్వహిస్తున్నారు.
ఆర్చర్ చికితకు హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు చేయూత అందించేందుకు ముందుకొచ్చారు. అక్షర విద్యాసంస్థల నుంచి 10 లక్షల స్పోర్ట్స్ స్కాలర్షిప్ అందించారు. ఆర్చరీ వరల్డ్కప్, ఆసియాకప్కు ఎంపికైన పెద్దపల్లి యువ ఆర్చర్ టి.చికితరావుకు జగన్ మోహన్ రావు చేయూత అందించారు.
కృష్ణా జలాల వాటాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు చెబుతున్నది పచ్చి అబద్ధం అని తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తేల్చేసారని హరీష్ రావు ఆరోపించారు.
తెలంగాణలో ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో స్కైరూట్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్కు చెందిన అంతరిక్ష సాంకేతిక రంగంలోని కంపెనీ స్కైరూట్ ఏరో స్పేస్తో దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేశారు.
హైదరాబాద్లో మోస్ట్వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్ అయ్యాడు. హత్యాయత్నం కేసులో మొయినాబాద్ పోలీసులకు చిక్కాడు క్రిమినల్ సయ్యద్ బుర్హానుద్దీన్.. అతని వద్ద నుంచి బెంజ్ కారు, క్రికెట్ బ్యాట్, ఐరన్ రాడ్, 25 హాకీ స్టిక్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై పలు పోలీస్ స్టేషన్లలో 14 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా..? అని దుయ్యబట్టారు. మీరు ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తున్న గ్రామ సభల సాక్షిగా మీ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత తేటతెల్లమైందని హరీష్ రావు ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ రెండో రోజున వరుసగా వివిధ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు సాంబానోవా కంపెనీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ సూలేతో చర్చలు జరిపారు. ప్రధానంగా తెలంగాణలో సెమీ కండక్టర్ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు.
బుద్ధ భవన్ ప్రక్కన హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. బుద్ధ భవన్ పక్కనే వున్న భవనంలో హైడ్రా పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. హైడ్రా పోలీసు స్టేషన్కు ఉద్దేశించిన భవనాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు.
ఉదయం ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించిన ఘటనపై ఎంపీ ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. 25 ఏళ్ల జీవితంలో ఎవరిపై చేయి చేసుకోలేదని ఈటల అన్నారు. కానీ ఈ రోజు న్యాయం కోసం చేయి చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.