JEE Mains Exams: రేపటి నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు.. విద్యార్థులకు కీలక సూచనలు..!
- రేపటి నుండి ఈ నెల 30 వరకు జేఈఈ మెయిన్స్
- ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు
- మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు రోజు రెండు సెషన్స్గా పరీక్షలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జేఈఈ మెయిన్-2025 సెషన్-1 పరీక్షలు రేపటి(బుధవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30 వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఈ నెల 22 నుంచి జరగనున్న జేఈఈ మెయిన్ పరీక్షలను రెండు దశల్లో నిర్వహిస్తున్నారు. మొదటి దశ పరీక్షలు ఈ నెల 22 నుంచి 24 వరకు, రెండో దశ పరీక్షలు 28 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇప్పటికే పూర్తి చేసింది. పరీక్ష రాసే విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మరోవైపు.. పరీక్ష రాసే విద్యార్థులకు NTA కీలక సూచనలు జారీ చేసింది.
Read Also: Tech Tips: మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా?.. వీటి ఉపయోగం ఏంటో తెలుసా?
Also Read
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
- UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
కీలక సూచనలు:
పరీక్ష రాసే విద్యార్థులు కచ్చితంగా అడ్మిట్ కార్డు వెంట తీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డు లేకపోతే ఎగ్జా్మ్ హాల్ లోకి ఎంట్రీ ఉండదు.
ఫొటోతో కూడిన గుర్తింపు కార్డులను తీసుకెళ్లాలి. (పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్టు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు).
అలాగే.. ఆన్లైన్ దరఖాస్తు చేసినప్పుడు అప్లోడ్ చేసినటువంటి పాస్ పోర్టుసైజు ఫొటోను తీసుకెళ్లాలి.. అటెండెన్స్ షీట్పై అతికిస్తారు.
విద్యార్థులు బాల్ పాయింట్ పెన్ మాత్రమే వినియోగించాలి.
దివ్యాంగులైన విద్యార్థులు తమ వెంట మెడికల్ సర్టిఫికెట్ను తీసుకెళ్లాలి.
జామెట్రీ బాక్స్, బ్యాగ్, పర్సు, ప్రింటెడ్ మెటీరియల్, మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్, డాక్యుపెన్ వంటివి తీసుకెళ్లకూడదు.
అంతేకాకుండా.. ఎక్కువ పాకెట్స్ ఉన్న బట్టలు ధరించరాదు. నగలు, మెటాలిక్ వస్తువులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
తాజావార్తలు
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
-
OTR: పసుపు నీళ్లు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ పాలిటిక్స్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?