Team India: ఓవైపు భారీ ఓటములు.. మరోవైపు అత్యంత చెత్త రికార్డులు.. ఈ టీమిండియాకు ఏమైంది!
- ఇంగ్లండ్ పర్యటనలో ఘోర పరాజయాలు
- భారత్ ఖాతాలో అత్యంత చెత్త రికార్డులు
- ప్రపంచకప్ ఛాంపియన్ టీమిండియాకు ఏమైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India Unwanted Records in England: ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలలో టీ20 ప్రపంచకప్ ఛాంపియన్ అయిన భారత జట్టు ఘోర పరాజయాలను చవిచూసింది. సౌతాంప్టన్ వేదికగా జరిగిన చివరి టీ20 మ్యాచ్లో అయినా శ్రేయస్ సేన గెలుస్తుందని భావించినా.. అది జరగలేదు. భారత్ 56 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో టీ20 అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల పరంగా భారత్ ఎదుర్కొన్న అతిపెద్ద పరాజయాల జాబితాలో ఈ ఓటమి నాలుగో స్థానంలో నిలిచింది.
2026లో నాటింగ్హోమ్లో ఇంగ్లండ్ చేతిలో భారత్ 125 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. భారత్కు టీ20ల్లో అత్యంత భారీ పరాజయం ఇదే. 2019లో వెల్లింగ్టన్లో న్యూజిలాండ్ చేతిలో 80 పరుగుల తేడాతో ఓడింది. 2026లో అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో టీమిండియా పరాజయం చవిచూసింది. తాజాగా సౌతాంప్టన్లో ఇంగ్లండ్ చేతిలో 56 పరుగుల తేడాతో ఓడింది. 2025లో న్యూ చండీగఢ్లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన 51 పరుగుల ఓటమి ఈ జాబితాలో తర్వాతి స్థానంలో ఉంది.
Also Read
- Missi Jersey Auction: ఒకే వేలంలో మెస్సీ, రొనాల్డో ఫైట్.. ఊహించని ధరకు అమ్ముడైన దిగ్గజాల జెర్సీలు..
- Joe Root Record: ఒక్క పరుగుతో చేజారిన హిస్టరీ.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును మిస్సయిన జో రూట్..
- IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
- US Open 2026: యూఎస్ ఓపెన్ 2026లో చరిత్రలోనే భారీ ప్రైజ్పూల్.. సింగిల్స్ విజేతకు రూ.52.65 కోట్లు
ఇంగ్లండ్ పర్యటనలో భారత్ మరో చెత్త రికార్డును కూడా నమోదు చేసింది. 2026 ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా ఏకంగా నాలుగు టీ20 మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. ఒకే టీ20 సిరీస్ లేదా టోర్నమెంట్లో భారత్ ఎదుర్కొన్న అత్యధిక పరాజయాలు ఇవే. గతంలో 2009లో ఇంగ్లండ్లో జరిగిన టీ20 ప్రపంచకప్లో భారత్ మూడు మ్యాచ్ల్లో ఓడింది. 2010లో వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లోనూ టీమిండియాకు మూడు పరాజయాలు ఎదురయ్యాయి. 2023 వెస్టిండీస్ పర్యటనలో కూడా భారత్ మూడు టీ20 మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. అయితే 2026 ఇంగ్లండ్ పర్యటనలో నాలుగు పరాజయాలతో ఆ చెత్త రికార్డును అధిగమించింది.
వరుస భారీ ఓటములతో ఇంగ్లండ్ పర్యటన టీమిండియాకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ముఖ్యంగా ఒకే సిరీస్లో నాలుగు పరాజయాలు ఎదురవడం భారత టీ20 చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ పరాజయాలు భారత టీ20 జట్టుకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. భారీ ఓటములతో పాటు వరుసగా చెత్త రికార్డులు నమోదవుతుండటం జట్టు ప్రదర్శనపై సోషల్ మీడియాలో మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది. ‘ఈ టీమిండియాకు ఏమైంది?’ అంటూ ఫాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జట్టులో భారీ ప్రక్షాళన చేయాలని, కోచ్ గౌతమ్ గంభీర్పై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్పై భారీ డిస్కౌంట్ ప్రకటన..
-
Varanasi Movie Update: ‘వారణాసి’కి రాజమౌళి డెడ్లైన్.. పక్కా ప్లాన్ ప్రకారమే!
-
Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Bethlehem Kudumba Unit : 2026 ఓనమ్ విన్నర్గా నివిన్ పౌలి.. ‘బెత్లేహెమ్ కుటుంబ యూనిట్’ బ్లాక్ బస్టర్
ట్రెండింగ్
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!