చంద్రయాన్ -3 పై సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన కార్టూన్ ట్వీట్ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘చంద్రుడి నుంచి వస్తున్న తొలి చిత్రం’ అంటూ ఓ పోస్టు చేశారు ప్రకాష్ రాజ్. ఆ కార్టూన్ లో లుంగీ కట్టుకొని, పొడవాటి చేతులు ఉన్న షర్ట్ ధరించి, టీ పోస్తున్నట్లు ఉన్న ఫొటోను ఆదివారం షేర్ చేశారు.
ఒక పసికందుతో సహా ఇద్దరు నేపాలీ పిల్లలను కిడ్నాప్ చేసిన భారతీయుడిని (22) పోలీసులు అరెస్ట్ చేశారు. గోనె సంచులలో భారత్కు అక్రమ రవాణా చేసిన ఆరోపణలపై దక్షిణ నేపాల్లోని బారా జిల్లాలో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో సమాజ్వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్యపై ఓ యువకుడు షూ విసిరాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఎస్పీ కార్యకర్తలు నిందితుడిని పట్టుకుని తీవ్రంగా కొట్టారు.
ఫిఫా ఉమెన్స్ ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో స్పెయిన్ స్పెయిన్ జట్టు సంచలనం సృష్టించింది. తొలిసారి ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ లో విశ్వ విజేతగా నిలిచింది. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై 0-1 తేడాతో గెలిచి మొట్టమొదటి ప్రపంచకప్ టైటిల్ను సొంతం చేసుకుంది.
విజయవాడలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్మారకోపన్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. భారతదేశ స్వాతంత్ర్య సమరంలో తెలుగువారి పాత్ర గణనీయమైనదని పేర్కొన్నారు.
తిరుపతి జిల్లా భాకరాపేటలో విషాదం నెలకొంది. ఓ ప్రేమజంట ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రామ సముద్రం మండలం చిట్టెంవారిపల్లెకు చెందిన బోడె కళ్యాణి.. చౌడేపల్లి మండలం లద్దకానికి చెందిన యుగంధర్ గా గుర్తించారు.