Audimulapu Suresh: టంగుటూరి ప్రకాశం పంతులు పోరాట పటిమ ఎంతో గొప్పది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్మారకోపన్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. భారతదేశ స్వాతంత్ర్య సమరంలో తెలుగువారి పాత్ర గణనీయమైనదని పేర్కొన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు పోరాట పటిమ ఎంతో గొప్పదని కొనియాడారు. అంతేకాకుండా.. ప్రకాశం పంతులు బారిష్టర్ చదివిన అడ్వకేట్ అని.. ప్రజాప్రతినిధిగా, ఆంధ్రరాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా టంగుటూరి సేవలు మరువలేనివి అని గుర్తు చేశారు.
Read Also: Kavya Kalyanram: అల్లు అర్జున్ ముసలివాడు అయిపోతాడు.. హీరోయిన్ గా చేయను..
Also Read
- SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
- Bullet Trains: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
- New T20 captain Shreyas Iyer: 'సింహాల్లా ఆడదాం'.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ తొలి సందేశం..
- Denmark: డెన్మార్క్లో అజాన్పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
మరోవైపు రాజకీయాలు కెరీర్ గా ఎంచుకోవాలంటే చాలా సాహసం కావాలని మంత్రి ఆదిమూలపు అన్నారు. ఈ రోజుల్లో రాజకీయాలలోకి వెళ్ళాలా అని ఒక కుర్రాడు తన తల్లిని అడిగితే చెంప ఛళ్ళుమనిపిస్తుందని తెలిపారు. మరోవైపు ప్రకాశం జిల్లాలో ఆంధ్రకేసరి యూనివర్సిటీ అని నామకరణం చేశామని.. గతంలో ఒక జీఓ ఇచ్చి అసలు యూనివర్సిటీనే లేకుండా చేసారని మంత్రి విమర్శించారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీ తెచ్చిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని ఆయన కొనియాడారు.
Read Also: Bigg Boss Telugu Season 7 : అదరిపోయే ఎంటర్టైన్మెంట్ కి ముహూర్తం ఫిక్స్ అయిందిగా..
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. రాజకీయం ఒక వ్యసనమే అని అన్నారు. టంగుటూరి ఏ ప్రతిఫలం ఆశించకుండా రాజకీయానికి వెచ్చించారని తెలిపారు. పొలిటీషన్ అవాలనుకుంటే you should study your own interest to become a politician అని బెర్నార్డ్ షా అన్నాడని గుర్తు చేశారు. పేదరికాన్ని ప్రేమించాం కనుక రాజకీయంలో ఉన్నాం అని వావిలాల చెప్పారన్నారు. టంగుటూరి ప్రకాశం పేదరికంలో పుట్టి తన సంపాదన మొత్తం వదులుకున్నాడని.. 75వేల రూపాయల ఫీజు 1975లో టంగుటూరి భరణం కేసులో తీసుకున్నాడని ఉండవల్లి తెలిపారు. దేవుడే ప్రకాశం పంతులుగా పుట్టాడు అని ఒక పెద్దాయన చెప్పారని.. పొలిటీషియన్ తన గురించి తాను ఆలోచించనంత కాలం ప్రజలు అతని గురించి ఆలోచిస్తారని ఉండవల్లి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
-
Bullet Trains: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
-
New T20 captain Shreyas Iyer: ‘సింహాల్లా ఆడదాం’.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ తొలి సందేశం..
-
Denmark: డెన్మార్క్లో అజాన్పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!