FIFA Womens World Cup: ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫిఫా ఉమెన్స్ ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో స్పెయిన్ స్పెయిన్ జట్టు సంచలనం సృష్టించింది. తొలిసారి ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ లో విశ్వ విజేతగా నిలిచింది. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై 0-1 తేడాతో గెలిచి మొట్టమొదటి ప్రపంచకప్ టైటిల్ను సొంతం చేసుకుంది. స్పెయిన్ తరఫున ఏకైక గోల్ చేసిన ఓల్గా కార్మోనా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. మరోవైపు హాట్ ఫెవరెట్ గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ తమ స్థాయి మేర రాణించలేకపోయింది. మరోవైపు టోర్నీలో స్పెయిన్ ఆరంభం నుంచే మంచి ప్రదర్శన చూపించింది. బంతిని ఎక్కువ సమయం స్పెయిన్ జట్టు ఆధీనంలో ఉంచుకుంది. స్పెయిన్ 14 సార్లు గోల్ ప్రయత్నాలు చేయగా.. ఇంగ్లాండ్ 7 సార్లు మాత్రమే ప్రత్యర్థి గోల్ పోస్టుపై దాడి చేసింది. 29వ నిమిషంలో ఓల్గా కార్మోనా గోల్ చేసి స్పెయిన్ ఖాతా తెరిచింది.
Kishan Reddy : బీజేపీ ప్రపంచంలో అతి పెద్ద రాజకీయ పార్టీ
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
మరోవైపు స్పెయిన్ డిఫెన్స్ టీమ్ మాత్రం ఇంగ్లాండ్కు గోల్ చేసే అవకాశాలను ఇవ్వలేదు. గోల్పోస్టు వద్ద ఇంగ్లాండ్ చేసిన మూడు ప్రయత్నాలను స్పెయిన్ గోల్కీపర్ కాటా కోల్ అడ్డుకుంది. అదనపు సమయంలోనూ ఇంగ్లాండ్ స్కోరును సమం చేయలేకపోయింది. దాంతో చివరి వరకూ ఏకైక గోల్తో ఆధిక్యాన్ని కాపాడుకున్న స్పెయిన్ విశ్వవిజేతగా నిలిచింది. దీంతో తొలిసారి వరల్డ్ కప్ చాంపియన్గా నిలవడంతో మైదానంలో స్పెయిన్ మహిళల సంబరాలు అంబరాన్నంటాయి. అటు తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్కు నిరాశ తప్పలేదు. జపాన్కు చెందిన హినాటా మియాజావా ప్రపంచకప్లో ఐదు గోల్స్తో టాప్ స్కోరర్గా నిలిచి గోల్డెన్ బూట్ అవార్డు అందుకుంది. స్పెయిన్ క్రీడాకారిణి ఐటానా బొన్మతీ గోల్డెన్ బాల్ అవార్డు అందుకోగా.. ఇంగ్లాండ్ గోల్కీపర్ మేరీకి ఇయర్ప్స్ గోల్డెన్ గ్లవ్ అవార్డు దక్కింది.
Woman Beats Husband: మద్యానికి బానిసైన భర్తను క్రికెట్ బ్యాట్తో కొట్టి చంపిన భార్య
ఈ ఏడాది ఫిఫా మహిళల వరల్డ్ కప్ టోర్నీకి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి. ఈ టోర్నీలో మొత్తం 32 జట్లు పాల్గొన్నాయి. స్వీడన్, ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు సెమీస్ లోనే వెనుదిరిగాయి. వర్గీకరణ మ్యాచ్ లో నెగ్గిన స్వీడన్ కు 3వ స్థానం లభించగా, ఆస్ట్రేలియాకు 4వ స్థానం దక్కింది. విజేతగా నిలిచిన స్పెయిన్ అమ్మాయిల జట్టుకు రూ.35 కోట్ల ప్రైజ్ మనీ లభించనుంది. రన్నరప్ గా సరిపెట్టుకున్న ఇంగ్లండ్ రూ.25 కోట్ల ప్రైజ్ మనీ అందుకోనుంది.
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!