చత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు అన్నె సంతోష్ @ సాగర్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా.. బీజాపూర్ లో సంతోష్ మృతదేహాన్ని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో.. స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం (మం) స్వగ్రామం దస్తగిరిపల్లికి చేరింది. అయితే.. స్వగ్రామానికి తీసుకువచ్చిన వృద్ధ తల్లిదండ్రులు అంతక్రియలు నిర్వహిస్తున్నారు. అంత్యక్రియల్లో గ్రామస్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఎర్రజెండాలతో స్వాగతం పలికుతూ అంతిమయాత్ర నిర్వహించారు. కన్నీటి పర్యంతంతో గ్రామస్తులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మరోవైపు.. సంతోష్ మృతితో…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు డబుల్ డెక్కర్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. అందులో భాగంగా మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై.. ఢిల్లీ ముందు 235 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు. ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. ముంబై బ్యాటింగ్ లో ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. రోహిత్ శర్మ (49), […]
ఆదివారం మెక్సికోలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సముద్రంలోని ఆయిల్ రిగ్ లో మంటలు చెలరేగడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 11 మంది సజీవ దహనమయ్యారు. మరో 9 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో.. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కి కంటోన్మెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలు వచ్చారు. అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి లక్ష్మా రెడ్డి, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అభ్యర్థులను చూసి ఓటు వేయండని.. పెద్దపల్లిలో యువకుడి వంశీని ముందుంచామన్నారు. ఈ సందర్భంగా.. నేతకాని సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు. తాము ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పనులకు కోడ్ వల్ల ఆటంకం కలిగింది.. 2018 ఎన్నికలు జరిగిన తరువాత రెండు నెలల తరువాత పాలన మొదలు పెట్టారన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన…
కాంగ్రెస్ మేనిఫెస్టోపై బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో దిక్కుమాలిన మేనిఫెస్టో అని దుయ్యబట్టారు. ఆరు గ్యారెంటీలతో తెలంగాణ ప్రజలను మోసం చేశారు.. ఐదు న్యాయాలతో దేశ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధం అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను బొంద పెట్టారని రాణి రుద్రమ మండిపడ్డారు. దేశ ప్రజలు మోడీకి ఓటు వేయాలని చూస్తున్నారు.. రాహుల్ గాంధీని ఆదర్శంగా తీసుకొని ఇవాళ్టి నుంచి కార్లు, హెలికాప్టర్లు…
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాల్లో జోరందుకుంటుంది. ఈ క్రమంలో.. టీడీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. విజయవాడ రూరల్ గన్నవరం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సమక్షంలో ఇండిపెండెంట్ సర్పంచ్ కొడాలి సుకన్య, ఆమె మద్దతుదారులు తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఆర్సీబీ-రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలుపొందింది. 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 184 పరుగుల టార్గెట్ను 19.1 ఓవర్లలో ఛేదించింది. కాగా.. ఈ మ్యాచ్లో రెండు సెంచరీలు నమోదయ్యాయి. ఆర్సీబీ బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ సెంచరీ చేయగా.. అతని సెంచరీ వృధా అయింది. రాజస్థాన్ బ్యాటింగ్లో బట్లర్ సెంచరీ చేశాడు. 58 బంతుల్లో 100 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 4 సిక్స్ లు, 9 ఫోర్లు ఉన్నాయి.
రష్యాలో వరదలు బీభత్సం సృష్టించాయి. ఆకస్మాత్తుగా ఉరల్ నది వరదలు సమీప గ్రామాలలోకి నీరు ప్రవేశించింది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఇళ్లలోనే చిక్కుకుపోయారు. కజకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని ఓరెన్బర్గ్ ప్రాంతంలో ఆనకట్ట తెగిపోవడంతో భారీగా వరదలు వచ్చాయి. వరదల భారీ నుంచి సుమారు 4,000 మందికి పైగా మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. దీనిపై.. ఓరెన్బర్గ్ గవర్నర్ కార్యాలయం శనివారం ఓ ప్రకటన చేసింది. '1,019 మంది పిల్లలతో సహా 4,208 మందిని రక్షించాం. 2,500 కంటే ఎక్కువ ఇళ్లు వరదల…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. రాజస్థాన్ ముందు 184 పరుగుల ఫైటింగ్ స్కోరును ఉంచింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. ఈ సీజన్ లో తొలి సెంచరీని నమోదు చేశాడు. 72 బంతుల్లో 113 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 6…