Rajesh Veeramalla
Author- NTV Telugu-
American Girl: PUBG గేమ్లో పరిచయం.. యువకుడి కోసం అమెరికా నుంచి ఢిల్లీకి
పబ్జీ గేమ్లో పరిచయం.. దేశాలు దాటేలా చేసింది. గతంలో పాకిస్తాన్కు చెందిన సీమా హైదర్ ఇదే పబ్జీలో ఇండియాకు చెందిన సచిన్తో పరిచయమేర్పడింది. ఈ క్రమంలో.. తన భర్తను వదిలేసి పిల్లలతో ఇండియాకు వచ్చింది. ఈ ఘటన అప్పుడు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా.. పబ్జీ గేమ్లో యూపీ ఇటావాకు చెందిన ఓ యువకుడితో అమెరికా అమ్మాయికి పరిచయం ఏర్పడింది. అంతటితో ఆగకుండా.. ఆ బాలిక యువకుడిని కలవడానికి ఇటావా వచ్చింది. -
Maharashtra: అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం.. మహావికాస్ అఘాడి ప్రకటన
లోక్సభ ఎన్నికల అనంతరం మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయి. శివసేన, యుబిటి చీఫ్ ఉద్ధవ్ థాకరే, ఎన్సిపి (ఎస్పి) చీఫ్ శరద్ పవార్ మరియు కాంగ్రెస్ నాయకుడు పృథ్వీరాజ్ చవాన్ ఎన్డిఎ కూటమిని లక్ష్యంగా చేసుకున్న లోక్సభలో విజయం సాధించిన తర్వాత మహావికాస్ అఘాడి శనివారం సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. అంతేకాకుండా రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని మహావికాస్ అఘాడీ ప్రకటించింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ. ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. -
PM Kisan: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. వచ్చే వారమే పీఎం కిసాన్ నిధులు
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతులకు పెట్టుబడి సాయం.. పీఎం-కిసాన్ పథకం 17వ విడత నిధులు వచ్చేవారం విడుదల కానున్నాయి. జూన్ 18న రూ.2వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. కాగా.. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ప్రధాని మోడీ పీఎం కిసాన్ నిధులను రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ శనివారం వెల్లడించారు. -
Swathi Maliwal Case: బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు..
రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై దాడి కేసులో అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్కు ఊరట లభించేలా కనిపించడం లేదు. ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీని జూన్ 22 వరకు పొడిగించింది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బిభవ్ కుమార్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. లోక్సభ ఎన్నికలకు ముందు మే 13న న్యూఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసంలో బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని స్వాతి మలివాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే.. -
Drunk Soldier: తాగిన మత్తులో మహిళ బెర్త్పై సోల్జర్ మూత్ర విసర్జన..
తాగిన మత్తులో ఓ సైనికుడు రైలులో ప్రయాణిస్తుండగా.. తన బెర్త్ పై మూత్ర విసర్జన చేశాడని, నిద్రిస్తున్న సమయంలో అది తనపై పడిందని ఓ మహిళ ఆరోపించింది. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి ఛత్తీస్గఢ్లోని దుర్గ్కు వెళ్తున్న గోండ్వానా ఎక్స్ప్రెస్లో ఈ ఘటన జరిగింది. రైలు గ్వాలియర్ చేరుకుంటుందనగా ఈ ఘటన జరిగిందని బాధిత మహిళ తెలిపింది. -
Suresh Gopi: ఇందిరాగాంధీని ‘భారతమాత’గా అభివర్ణించిన కేంద్రమంత్రి..
మాజీ ప్రధాని ఇందిరాగాంధీని 'భారతమాత'గా అభివర్ణించారు కేంద్రమంత్రి సురేష్ గోపి.. అంతేకాకుండా.. దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి కె.కరుణాకరన్ను 'ధైర్యవంతమైన నిర్వాహకుడు' అని కొనియాడారు. కరుణాకరన్, ఇకె నాయనార్ తన "రాజకీయ గురువులు" అని అన్నారు. పున్కున్నంలో ఉన్న కరుణాకరన్ స్మారకం "మురళీ మందిరం"ని సందర్శించిన అనంతరం మంత్రి సురేష్ గోపి విలేకరులతో మాట్లాడారు. -
PM Modi: ముగిసిన ప్రధాని ఇటలీ పర్యటన.. ఢిల్లీకి చేరుకున్న మోడీ
ఇటలీలో జీ7 శిఖరాగ్ర సమావేశానికి హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఇటలీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. ఇటలీ పర్యటనలో జీ7 దేశాల ఔట్ రీచ్ సదస్సుకు హాజరైన మోడీ.. వివిధ దేశాధినేతలతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. -
Delhi Water Crisis: హస్తినలో నీటి కటకట.. కాంగ్రెస్ నేతల నిరసన
ఢిల్లీలో నీటి సమస్యలపై ఆందోళనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆప్ సర్కార్ పై ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఎక్కడికక్కడ నిరసనలు చేపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మొన్నటి వరకు మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ.. నీటి సమస్యపై ఆప్ పార్టీపై యుద్ధం ప్రకటించింది. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు సర్కార్ కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. నీటి సమస్యలు పరిష్కరించాలంటూ ప్లకార్డులు పట్టుకుని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. మట్టి కుండలు పగలగొట్టి నిరసన చేపట్టారు. -
Leopard: తమిళనాడులో ఆపరేషన్ చిరుత సక్సెస్..
తమిళనాడులో ఆపరేషన్ చిరుత విజయవంతమైంది. 9 గంటల పాటు శ్రమించి ఫారెస్ట్ సిబ్బంది చిరుతను పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తిరుపత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని సామ్ నగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి చిరుతపులి ప్రవేశించింది. ఈ క్రమంలో.. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే.. ఆ చిరుత ఇంట్లో నుంచి సమీపంలోని ప్రైవేట్ పాఠశాల ఆవరణలోకి దూకింది. అక్కడ పాఠశాల వాచ్మెన్ రాజ గోపాల్ తలపై చిరుత దాడి చేసి ఆ పక్కనే ఉన్న కార్ సర్వీస్ సెంటర్లోకి… -
Agra: మద్యం మత్తులో వృద్ధురాలిపై యువకుడు అత్యాచారం..
నామ్నేర్ కూడలి వద్ద రోడ్డు పక్కన నిద్రిస్తున్న 80 ఏళ్ల వృద్ధురాలి దగ్గరికి వచ్చిన ముగ్గురు యువకులు.. మద్యం మత్తులో ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డారు. వృద్ధురాలు వద్దని ఎంతా మొరాయిస్తున్న ఆ కామంధుడు వినలేదు. అయితే.. సమీపంలోని ఓ దుకాణంలో నిద్రిస్తున్న యువకుడు కేకలు విని లేచాడు. ఈ ఘటనకు పాల్పడుతున్న నిందితుల వీడియో తీశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన నామ్నేర్ కూడలిలోని కంట్రీ లిక్కర్ ఎదురుగా గురువారం రాత్రి చోటుచేసుకుంది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!