Delhi Water Crisis: హస్తినలో నీటి కటకట.. కాంగ్రెస్ నేతల నిరసన
- ఢిల్లీలో నీటి సమస్యలపై ఆందోళనలు
- ఆప్ సర్కార్ పై ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు
- ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్
- కాంగ్రెస్ నేతలు సర్కార్ కు వ్యతిరేకంగా ఆందోళన
- మట్టి కుండలు పగలగొట్టి నిరసన చేపట్టిన కాంగ్రెస్ నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో నీటి సమస్యలపై ఆందోళనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆప్ సర్కార్ పై ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఎక్కడికక్కడ నిరసనలు చేపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మొన్నటి వరకు మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ.. నీటి సమస్యపై ఆప్ పార్టీపై యుద్ధం ప్రకటించింది. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు సర్కార్ కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. నీటి సమస్యలు పరిష్కరించాలంటూ ప్లకార్డులు పట్టుకుని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. మట్టి కుండలు పగలగొట్టి నిరసన చేపట్టారు.
Mr Bachchan : రవితేజ ‘మిస్టర్ బచ్చన్ ‘ మూవీ స్పెషల్ అప్డేట్ వైరల్..
Also Read
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
- Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు
- Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
ఈ నిరసనల్లో ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఢిల్లీలో నీటి కొరత అంశంపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలో నీటి కొరతను తీర్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదని, దీంతో ప్రజలు నీటి ట్యాంకర్ల వెంట పరుగులు తీయాల్సి వచ్చిందని ఆయన ఆరోపించారు. మరోవైపు.. యమునా నదికి తక్కువ నీరు చేరుతున్నందున ఢిల్లీలో నీటి ఉత్పత్తి నిరంతరం తగ్గుతోందని నీటిపారుదల శాఖ మంత్రి అతిషి శుక్రవారం తెలిపారు.
Leopard: తమిళనాడులో ఆపరేషన్ చిరుత సక్సెస్..
ఢిల్లీకి దక్కాల్సిన నీటి వాటాను బీజేపీ పాలిత హర్యానా విడుదల చేయడం లేదని ఆప్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. జూన్ 6న నీటి ఉత్పత్తి రోజుకు 1,002 మిలియన్ గ్యాలన్లు (MGD) ఉందని.. అది మరుసటి రోజు 993 MGDలకు, జూన్ 8న 990 MGDలకు తగ్గిందని అతిషి చెప్పారు. జూన్ 9న 978 ఎంజీడీలు, మరుసటి రోజు 958 ఎంజీడీలు నమోదైంది. జూన్ 11, 12, 13 తేదీల్లో నీటి ఉత్పత్తి వరుసగా 919 ఎంజిడి, 951 ఎంజిడి, 939 ఎంజిడిలు నమోదయ్యాయని మంత్రి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
-
Investment Tips: హోమ్ లోన్ తీర్చాలా? ఇన్వెస్ట్ చేయాలా? చేతికి బోనస్ వస్తే ఏది బెస్ట్ ఆప్షన్! నిపుణులు చెబుతున్నది ఇదే..
-
Ishan Kishan Celebration: స్టేడియం ఖాళీ చేయండి, ఇంటికి వెళ్లిపోండి.. సీఎస్కే అభిమానులను అవమానించిన ఇషాన్ ఇషాన్!
-
Chand Mera Dil: అనన్యా పాండే మూవీకి సెన్సార్ షాక్..10 సెకన్ల కిస్ సీన్ డిలీట్
-
Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!