ఈరోజు (శనివారం) ఉప ముఖ్య కార్య నిర్వాహణాధికారి పూల నర్మద పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం మండలం కొత్తపేట గ్రామంలోని ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గౌరవ కలెక్టర్ మహబూబాబాద్, గౌరవ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) మహబూబాబాద్, జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ములుగు నియోజకవర్గంలో కొత్తగా మల్లంపల్లి మండలం ఏర్పాటు కానుంది. మల్లంపల్లి మండలం ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. ఎన్నికల్లో ఇచ్చిన మాటను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క నిలబెట్టుకున్నారు. మంత్రిగా ఏడాదిలోపే మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటుకు కృషి చేశారు.
త్వరలో తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. జనవరి 14న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఎన్నికలు మొదలు కానున్నాయి.
మంత్రి కొండా సురేఖకు మరో దెబ్బ తగిలింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్ను నాంపల్లి కోర్టు కాగ్నిజెన్స్లోకి తీసుకుంది. ఈ క్రమంలో.. వెంటనే కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో పదో తరగతి పరీక్షల్లో విద్యాశాఖ మార్పులు చేసింది.. ఇకపై 100 మార్కుల పేపర్ ఉండనుంది. ఇంటర్నల్ మార్కులను ఎత్తేసింది విద్యాశాఖ. ఇప్పటి వరకూ 80 మార్కులకే పేపర్ ఉండేది.. 20 మార్కులతో ఇంటర్నల్ ఎగ్జామ్ ఉండేది. కాగా.. ఆ పద్ధతిని విద్యాశాఖ ఎత్తేయాలని నిర్ణయం తీసుకుంది విద్యాశాఖ.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులపై దాడులు చేయడానికి రైతులను ఉసిగొలుపుతున్నారని అన్నారు. కేటీఆర్కు పార్టీని ఎవరు ఏం చేస్తారో అని.. గతంలో చేసిన తప్పులకు ఎప్పుడు జైలుకు పోవాల్సి వస్తుందో అని రెండు భయాలు ఉన్నాయని అన్నారు. ప్రజల్లో సానుభూతి కోసమే జైలుకు పోతానంటున్నారని కడియం శ్రీహరి చెప్పారు.
నేటి జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్ల వల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు సర్వసాధారణమైపోయాయి. వాటి వల్ల గుండెలో మంట, నెర్వస్ నెస్, రెస్ట్ లెస్ వంటి సమస్యలు పెరుగుతున్నాయి. దీనిని నివారించడానికి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. రోజూ రాత్రిపూట ఒక గ్లాసు సెలరీ జ్యూస్ను తాగితే.. అనేక సమస్యల నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
సిరిసిల్ల కలెక్టర్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఖండించింది. సివిల్ సర్వీసెస్లో ముఖ్యమైన పదవిలో ఉన్న అధికారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం తగదని వ్యాఖ్యానించింది. ఓ జిల్లా కలెక్టర్ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని కించపరిచేలా మాట్లాడటాన్ని తప్పుబట్టింది.
ఢిల్లీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ నేతలకు సిగ్గు ఉండాలని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ఎంపీల అటెండెన్స్ కూడా రాజ్యసభలో కనిపించడం లేదని తెలిపారు.
హైపర్ మార్ట్ వాల్యూజోన్.. మరోసారి చరిత్ర సృష్టించేందుకు నాచారంలో సిద్ధమైంది. హైపర్ మార్ట్ బ్రాండ్ అంబాసిడర్గా హైపర్ మార్ట్స్తో అనుబంధం ఉన్న ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణ ఈరోజు (నవంబర్ 28)న ప్రారంభించారు.