NTV WebDesk
Author- NTV Telugu-
దారుణం: మాస్క్ పెట్టుకున్నారని… రెస్టారెంట్ నుంచి గెంటేశారట…!!
ప్రపంచం నుంచి కరోనా ఇంకా దూరం కాలేదు. అమెరికా వంటి దేశాల్లో కరోనా ఉధృతంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి రోజూ లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రెండు వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ వేగంగా అమలు చేస్తుంటే కొన్ని చోట్ల వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడం లేదు. వ్యాక్సిన్ ను వ్యతిరేకిస్తున్నారు. కరోనా నుంచి బయట పడలేదు కాబట్టి తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలని ప్రభుత్వం ప్రజలకు పదేపదే విజ్ఞప్తి చేస్తూ వస్తున్నది. […] -
పాక్ కొత్త మెలిక: సార్క్ సదస్సుకు తాలిబన్లను పిలవాలి
ఈరోజు నుంచి న్యూయార్క్ లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాలకు అన్ని దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకాబోతున్నారు. కాగా, ఈ సదస్సు జరిగే సమయంలోనే సార్క్ దేశాలకు చెందిన విదేశాంగ శాఖ మంత్రులు సమావేశం కావాలని ముందుగా నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆఫ్గనిస్తాన్ లో ప్రస్తుతం తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సార్క్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి తాలిబన్లను కూడా పిలవాలని పాక్ కొత్త మెలిక పెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ లో నెలకొన్న ప్రస్తుత […] -
హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ…ప్రత్యేక ఆహ్వానితుల జీవో కొట్టివేత
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. టీటీడీ పాలక మండలిలో 52 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం జీవోను జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టులో వేసిన పిటిషన్ పై ఈరోజు విచారణ జరిగింది. ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. టీటీడీలో జంబో బోర్డును నియమించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో […] -
ఎవర్ గ్రాండే ఎఫెక్ట్ : కుప్పకూలిన చైనా రియల్ ఎస్టేట్… గంటల వ్యవధిలోనే…
చైనాలో రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్ గ్రాండే పెద్ద 300 బిలియన్ డాలర్ల ఎప్పుతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఏ క్షణంలో అయినా ఈ కంపెనీ దివాళా తీసే అవకాశం ఉండటంతో చైనాలోని రియల్ ఎస్టేట్ కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు వాటిని ఉపసంహరించుకుంటున్నారు. దీంతో ఓ వెలుగు వెలిగిన దిగ్గజ రియల్ కంపెనీల షేర్లు ఒక్కసారిగా కుదేలయ్యారు. లక్షల కోట్ల రూపాయలు క్షణాల వ్యవధిలో హాం ఫట్ అయ్యింది. చైనాకు చెందిన […] -
ఇండియా కరోనా అప్డేట్: ఈరోజు కేసులు ఎన్నంటే…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో 26,964 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 383 మంది మృతి చెందారు. దేశంతో మొత్తం ఇప్పటి వరకు 3,27,83,741 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో కరోనాతో ఇప్పటి వరకు 4,45,768 మంది మృతి చెందారు. దేశంలో 3,01,989 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త కేసుల కంటే రికవరీ కేసులు పెరుగుతుండటంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా మహమ్మారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని, […] -
మోడీ అమెరికా టూర్ షెడ్యూల్ ఇదే…
ప్రధాని మోడీ ఈరోజు అమెరికా పర్యటనకు బయలుదేరబోతున్నారు. ప్రధాని మోడీతో పాటుగా అయన బృందంలో విదేశీ వ్యవహరాల మంత్రి ఎస్.జయశంకర్, విదేశీ వ్యవహరాల కార్యదర్శి హెచ్.వి. శ్రింగ్లా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో పాటు, భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. సెప్టెంబర్ 23 వ తేదీన అస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాన మంత్రి యోషిహిదె సుగ లతో విడివిడిగా ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించనున్నారు. యాపిల్ సీఈవో టీమ్ కుక్ తో పాటుగా అనేక అమెరికా […] -
8 లక్షల యాప్ లపై నిషేధం… ఇదే కారణం
గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ల నుంచి దాదాపుగా 8 లక్షలకు పైగా యాప్ లను నిషేదించారు. పిక్సలేట్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా గూగుల్, యాపిల్ స్టోర్ల నుంచి యాప్ లను నిషేధం విధించారు. హెచ్ 1 2021 డిలిస్టెడ్ పేరుతో పిక్సలేట్ ఓ నివేదికను తయారు చేసింది. ఈ నివేదిక ఆధారంగా మొత్తం 8,13,000 యాప్ లపై నిషేధం విధించింది. ఇందులో 86 శాతం చిన్నపిల్లలను లక్ష్యంగా చేసుకొని సైబర్ దాడులకు పాల్పడుతున్నాయని నివేదికలో పేర్కొన్నది. కెమెరా, […] -
ఏడు రోజులకు బిర్యానీకి రూ.27 లక్షల బిల్లు… షాకైన అధికారులు…!!
అసలే పాక్ క్రికెట్ బోర్డు నష్టాల్లో మునిగిపోయింది. ఇటీవలే న్యూజిలాండ్ జట్టు పర్యటనకు వచ్చి చివరి నిమిషంలో పర్యటను క్యాన్సిల్ చేసుకొని వెనక్కి వెళ్ళిపోయింది. దీంతో పాక్ క్రికెట్ కు మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. న్యూజిలాండ్ తో మ్యాచ్ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. బందోబస్తు కోసం 500 మంది పోలీసులను ఏర్పాటు చేసింది. అంతేకాదు, బోర్డర్ లో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిని కూడా రంగంలోకి దించింది. వీరందరిని న్యూజిలాండ్ జట్టు బస చేస్తున్న హోటల్స్ వద్ద బందోబస్తుకు ఏర్పాటు […] -
ఆఫ్ఘన్ లో ఏం జరుగుతోంది… ఆ ఇద్దరు కీలక నేతలు ఏమయ్యారు?
ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్లు ఆక్రమించుకున్నాక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చాలా సమయం తీసుకున్నారు. తాలిబన్ అగ్రనేతలు అఖుండ్ జాదా, బరదర్ లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా మార్పులు జరిగాయి. తాలిబన్ల కంటే ప్రభుత్వంలో హుక్కాని గ్రూప్ లకు పెద్ద పీట వేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు ముందు హుక్కాని గ్రూప్ కు, తాలిబన్లకు మధ్య అధ్యక్ష భవనంలో పెద్ద రగడ జరిగిందని, ఈ రగడలో హైబతుల్లా అఖుండ్ జాదా మృతి చెందారని, బరదర్ ను బందీగా చేసుకున్నారని కథనాలు వస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు ముందు […] -
పుత్తడి ధరలకు మళ్ళీ రెక్కలు…
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మళ్ళీ పెరగడం మొదలుపెట్టాయి. అంతర్జాతీయంగా ధరలు పెరగడటం దేశీయంగా ధరలు పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరిగి రూ. 43,500కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.230 పెరిగి రూ.47,460కి చేరింది. ఇక బంగారం ధరలు పెరిగితే, వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. కిలో […]
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!