కాబూల్ టెర్రర్: తృటిలో తప్పించుకున్న 160 మంది భారతీయులు…
కాబూల్ ఎయిర్పోర్ట్ వరస బాంబు పెలుళ్లతో దద్దరిల్లిపోతున్నది. ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్ వద్ద 6 పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 72 మంది మృతి చెందారు. ఇందులో సాధారణ పౌరులు 60 మంది ఉండగా, 13 మంది అమెరికా సైనికులు ఉన్నారు. మృతి చెందిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ పేలుళ్లు జరగడానికి కొన్ని గంటల ముందు కాబూల్ ఎయిర్పోర్ట్ నుంచి 160 మంది భారతీయులను ఇండియాకు తీసుకొచ్చారు. 160 మందిలో 145 మంది ఆఫ్ఘాన్ సిక్కులు ఉండగా, 15 మంది హిందువులు ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో ఇంకా వేలాది మంది భారతీయులు ఉన్నట్టు సమాచారం. భారతీయులందరినీ సురక్షితంగా ఇండియాకు తీసుకొస్తామని భారతప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కాబూల్ ఎయిర్పోర్ట్ వద్ద వరస పేలుళ్ల తరువాత, అక్కడ పరిస్థితులు దారుణంగా మారిపోవడంతో భారతీయులను ఎలా తరలిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఎయిర్పోర్ట్ లోపల ఉన్నవారు గట్టి భద్రత మధ్య సురక్షితంగా ఉన్నారు. బయట ఉన్నవారి పరిస్థితి దారుణంగా మారింది. బయట ఉన్నవారిని లోనికి అనుమతించడం లేదు. మరోవైపు సామాన్యప్రజలతో కలిసి ఉగ్రవాదులు కూడా లోపలికి వస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి.
Read: షాకింగ్ సర్వే: 2064 తరువాత ప్రపంచ జనాభా భారీగా తగ్గుతుందా?
- Tags
- Blasts
- Hindus
- india
- Kabul
- Kabul Airport
తాజావార్తలు
-
YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ మద్దతు తగ్గుతోంది.. జగన్ ఆవేదన..
-
Nepal: ఉద్యోగుల జీతాల చెల్లింపుపై కొత్త విధానం.. ఇక నుంచి శాలరీ..!
-
Dhuarandhar 2 : ఒక్క అడుగు దూరంలో..ధురంధర్ 2
-
CSK Injury Update: సీఎస్కేకు బిగ్ షాక్.. ఐపీఎల్ 2026 నుంచి మ్యాచ్ విన్నర్ అవుట్.. గుడ్ న్యూస్ ఏంటంటే?
-
Lik : ప్రదీప్ రంగనాథన్ ‘లిక్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
రూ.11 వేలలోపే పవర్ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
-
AMOLED డిస్ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
Novak Djokovic: కోహ్లీ వల్లే నేను క్రికెట్ ను ఆస్వాదిస్తున్నా.. త్వరలోనే భారత్కు వస్తాను.!
-
200% వాల్యూమ్ బూస్ట్, 144Hz స్క్రీన్ + 7000mAh బ్యాటరీ.. బడ్జెట్లోనే POCO M8s 5G లాంచ్.!
-
Apple CEO: టిమ్ కుక్ రాజీనామా.. కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు.!