NTV WebDesk
Author- NTV Telugu-
రాజ్యసభలో అన్నాడీఎంకే ఎంపీ రికార్డ్…
రాజ్యసభ సమావేశాలకు ఎంతమంది హాజరయ్యారు అనే దానిపై రాజ్యసభ సచివాలయం గణాంకాలను తయారు చేసింది. అధికారుల లెక్కల ప్రకారం గడిచిన ఏడు రాస్యసభ సమావేశాలకు 78 శాతం మంది ఎంపీలు రోజూ హాజరవుతున్నట్టుగా గుర్తించారు. అందులో 30శాతం మంది క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. 2019 నుంచి 2021 వరకు మొత్తం ఏడు రాజ్యసభ సమావేశాలు జరిగాయి. రాజ్యసభలో 225 మంది ఎంపీలు ఉన్నారు. వీరంతా రాజ్యసభకు హాజరైనపుడు తప్పనిసరిగా సంతకాలు చేయాల్సి ఉంటుంది. 248 వ సమావేశం […] -
ఏడు గంటల్లో 7 బిలియన్ డాలర్ల నష్టం…
సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 4 గంటల వరకు ఫేస్బుక్ డౌన్ అయింది. పలు సమస్యల కారణంగా ఫేస్ బుక్ ఓపెన్ కాలేదు. ఫేస్బుక్తో పాటుగా దాని అనుబంధ సంస్థలైన ఇన్స్టాగ్రామ్, వాట్సప్లు కూడా ఓపెన్ కాలేదు. దీంతో ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఎందుకు ఇలా జరిగిందో తెలియన తికమకపడ్డారు. చాలామంది ట్విట్టర్లో పోస్టులు, మీమ్స్ పెట్టారు. అయితే, ఈరోజు ఉదయం 4 గంటల సమయంలో తిరిగి రిస్టోర్ అయింది. […] -
యూపీలో కొనసాగుతున్న ప్రియాంక గాంధీ దీక్ష…
ఉత్తర ప్రదేశ్లోని లఖీంపూర్ లో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రతిపక్షాలు ఈ ఘటనపై విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఇక, బాధిత రైతులను పరామర్శించేందుకు లఖీంపూర్కు బయలుదేరిన ప్రియాంకగాంధీని పోలీసులు అడ్డుకొని గృహనిర్భంధం చేసిన సంగతి తెలిసిందే. 28 గంటలుగా ఆమె గృహనిర్భంధంలోనే ఉండిపోయారు. గృహనిర్భంధంలోనే ఉంటూ నిరసనలు చేస్తున్నారు. ఇక, పంజాబ్ డిప్యూటీ సీఎం సిఖిందర్ సింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా, పంజాబ్ ఎమ్మెల్యేలను కూడా యూపీ సరిహద్దుల్లో అడ్డుకున్నారు పోలీసులు. […] -
షాకింగ్ సర్వే: ప్రేమ వివాహాలకు హైదరాబాదీలు ఓకే…
ప్రేమలు వరకు ఓకే అదే ప్రేమ పెళ్లి వరకు వచ్చే సరికి అనేక అడ్డంకులు ఎదురౌతుంటాయి. ప్రేమ పెళ్లిళ్ల తరువాత ఎన్ని కష్టాలు ఎదురవుతాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో తల్లిదండ్రుల మద్దతు ఉంటే ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నవారి జీవితం హ్యాపీగా ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే, ప్రేమ పెళ్లిళ్లకు ఎంత మంది పేరెంట్స్ అనుకూలంగా ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకునేందుకు ట్రూలీమ్యాడ్లీ అనే డేటింగ్ యాప్ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో హైదరాబాద్ తల్లులు తమ […] -
అదే జరిగితే మళ్లీ కరోనా విజృంభించవచ్చు…
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పుడిప్పుడే అన్ని రంగాలు తెరుచుకుంటున్నాయి. పర్యాటక రంగం తెరుచుకోవడంతో టూరిస్టులు భారీ సంఖ్యలో పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. దీంతో పర్యాటక ప్రాంతాల్లో రద్దీ పెరుగుతున్నది. పర్యాటక ప్రాంతాల్లో రద్దీ పెరగడం వలన కరోనా కేసులు మళ్లీ పెరిగే అవకాశం ఉందని, జనవరి-ఏప్రిల్ మధ్యకాలంలో కేసులు తీవ్రస్థాయికి చేరవచ్చని అంచనా వేస్తున్నారు. సామాజిక, రాజకీయ, మతపరమైన కారణాలతో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడితే దాని వలన కేసులు పెరుగుతాయని […] -
కొత్త రూల్స్: ఇకపై వాహనాల హారన్ శబ్దం మారబోతుందా?
నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతున్నాయి. ట్రాఫిక్ సమయంలో వాహనాల నుంచి వచ్చే కాలుష్యంతో పాటుగా హారన్ నుంచి వచ్చే శబ్ధకాలుష్యంకూడా పెరిగిపోతున్నది. ఫలితంగా అనేక అనారోగ్యసమస్యలు తలెత్తుతున్నాయి. ఒక్కో వాహనం ఒక్కో రకమైన హారన్ శబ్దంతో కర్ణకఠోరంగా మారుతున్నది. వీటిని కంట్రోల్ చేసేందుకు కేంద్ర ఉపరితల రావాణ శాఖ ముందుకు వచ్చింది. కొత్త రూల్స్ ను తీసుకురాబోతున్నది. వాహనాల్లో హారన్ శబ్దాన్ని మార్చాలని నిర్ణయం తీసుకుంది. హారన్ శబ్దాలు కఠినంగా ఉండకుండా హాయిగా ఉండేలా చూడాలని ఇప్పిటికే […] -
ఉల్లి మళ్లీ పెరగనుందా?
దేశంలో మళ్లీ ఉల్లి ధరలు పెరగబోతున్నాయా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. మనదేశంలో అత్యధికంగా ఉల్లి పంట మహారాష్ట్రలో పండుతుంది. అయితే, తుఫాన్, భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో ఉల్లిపంట దెబ్బతిన్నది. దీంతో డిమాండ్కు తగినంత ఉల్లిపంట లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నది. ఉల్లి ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. అయితే, ఎంతమేర ఉల్లి ధరలు పెరుగుతాయి, ఎన్ని రోజులకు తిరిగి కొత్త పంట అందుబాటులోకి వస్తుంది అన్నది […] -
నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు…
యూపీలోని లఖీంపూర్ ఖేరీ ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ రోజు కలెక్టరేట్ల వద్ద నిరసనలు తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతున్నది. ఈరోజు ఉదయం నుంచి అన్ని రాష్ట్రాల్లోని కలెక్టరేట్ కార్యాలయాల వద్ధ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసనలు చేయాలని పిలుపునిచ్చింది. దీంతో కలెక్టరేట్ల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం నుంచి కలెక్టరేట్ కార్యాలయాలకు వెళ్లే దారిలో నిఘాను ఏర్పాటు చేస్తున్నారు. లఖీంపూర్ ఖేరీలో రైతులు ఆందోళనలు చేస్తున్న సమయంలో కేంద్రమంత్రి కుమారుడి కారు […] -
ఆ ఏడు గంటలు మూగబోయిన ప్రపంచం…
కాసేపు సోషల్ మీడియా పనిచేయకపోతే ఎంత మంది ఎన్ని ఇబ్బందులు పడతారో చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఏకంగా ఏడు గంటలపాటు సోషల్ మీడియా పనిచేయకుంటే ఎన్ని ఇబ్బందులు వస్తాయో చెప్పాల్సిన అవసరం ఉండదు. సోమవారం రాత్రి 9:30 గంటల నుంచి మంగళవారం ఉదయం 4 గంటల వరకు సుమారు 7 గంటల పాటు సోషల్ మీడియా ఆగిపోయింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్లు నిలిచిపోయాయి. పనిచేయలేదు. దీంతో ఏమైందో తెలియక కోట్లాది మంది భయపడ్డారు. అయితే, ఈరోజు […] -
అక్టోబర్ 5, మంగళవారం దినఫలాలు
మేషం:- సమావేశానికి ఏర్పట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల కోసం ధనం బాగుగా ఖర్చు చేస్తారు. వృషభం:- హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. విద్యార్థులు అత్యుత్సాహం ఇబ్బందులకు దారితీస్తుంది. ఉద్యోగస్తులు అధికారుల వేధింపులు, సహోద్యోగులతో చికాకులు తప్పవు. ఏ విషయంలోనూ […]
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?