NTV WebDesk
Author- NTV Telugu-
అశోకగజపతిని టెన్షన్ పెడుతోన్న ఇన్నోవా కారు..!
ఆయన కేంద్ర మాజీ మంత్రి. అనువంశికంగా వచ్చిన హక్కులను పోరాడి సాధించుకున్నారు. హోదాతోపాటు ఇటీవల ఓ కారు కాంపౌండ్లోకి వచ్చింది. ఆ.. వాహనం ఎక్కాలంటేనే పెద్దాయన తెగ టెన్షన్ పడుతున్నారట. కోరి తెచ్చుకున్న ఆ కారు కష్టాలేంటో ఓ లుక్కేయండి. అశోక్ గజపతిరాజు. అధికారంలో ఉన్నప్పుడు హుందాగా.. ప్రతి పక్షంలో వున్నప్పుడు సైలెంట్గా వ్యవహరించడం ఆయనకు అలవాటు. సుదీర్ఘ రాజకీయ అనుభవంలో కాంట్రవర్సీకి ఆస్కారం వచ్చిన సందర్భాలు అరుదే. ఇదంతా 2020కి ముందుమాట కాగా ఇప్పుడు అశోక్ […] -
వరంగల్ టీఆర్ఎస్లో కొత్త కుంపటి..!
గ్రేటర్ వరంగల్ టీఆర్ఎస్లో కొత్త కుంపటి రాజుకుందా? ఇప్పటికే మేయర్, ఎమ్మెల్యేల మధ్య దూరం పెరగ్గా.. ఇప్పుడు కార్పొరేటర్లతోనూ మేయర్కు పడటం లేదా? నగరబాట నగుబాటగా మారుతోందని సొంత పార్టీ నేతలే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారా? గుండు సుధారాణి. ఈ మాజీ ఎంపీ.. ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ మేయర్. ఈ మధ్య నగరబాట కార్యక్రమాన్ని చేపట్టారు మేయర్. వెంటనే టీఆర్ఎస్కే చెందిన కార్పొరేటర్లు కయ్యిమన్నారు. మేయర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫైర్ అయ్యారు నాయకులు. వరంగల్ అభివృద్ధిలో ఇప్పటికే […] -
రాధాను హతమార్చేంత అవసరం ఎవరికి ఉంది?
ఓ పెద్ద నాయకుడికి ఆయన వారసుడు. మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం విపక్షపార్టీలో ఉన్నా పెద్దగా చప్పుడు లేదు. కానీ.. తండ్రి వర్ధంతి రోజున సంచలన వ్యాఖ్యలు చేసి.. ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు. ఇంతకీ అది వ్యూహమా? నిజంగా ఆయన చెప్పినట్టు జరిగిందా? తన హత్యకు రెక్కీ నిర్వహించారంటూ వంగవీటి రాధాకృష్ణ చేసిన ఆరోపణపై బెజవాడలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తన పని తాను చేసుకుపోయే రాధాను హతమార్చేంత అవసరం ఎవరికి ఉంటుందనేది ఓ ప్రశ్న. […] -
మిథాని ఫ్లై ఓవర్కు అబ్దుల్ కలాం పేరు
హైదరాబాద్లో మరో ఫ్లై ఓవర్ ప్రారంభం అయింది. మిథాని ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులు. రూ. 80 కోట్ల వ్యయంతో 1.36 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ ఇది. వన్ వే రోడ్డుగా 3 లైన్లతో 12 మీటర్ల వెడల్పు కలిగి వుంది. మిథాని జంక్షన్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు ఫ్లై ఓవర్ అందంగా తీర్చిదిద్దారు. 2018 ఏప్రిల్లో ఎస్ఆర్డీపీ కింద […] -
బీజేపీ సభ అంటే వైసీపీ, టీడీపీలకు భయం
బీజేపీ ప్రజాగ్రహ సభ అంటే వైసీపీ, టీడీపీ గుండెల్లో భయం పట్టుకుందన్నారు ఎంపీ సీఎం రమేష్. పేర్ని నాని, పయ్యావుల కామెంట్లు ఆ భయం నుంచి వచ్చినవే. వైసీపీలో ఏం జరుగుతుందో పేర్ని నాని ఆలోచించుకోవాలి. వైసీపీ గౌరవ అధ్యక్షురాలు సహా కార్యకర్తలు.. నేతలు ఏం మాట్లాడుతున్నారో పేర్ని నాని గమనించాలని హితవు పలికారు. వైసీపీలో అంతర్గత పోరు ఉంది. టీడీపీ ప్రతిపక్షంగా ఫెయిలైంది. వైసీపీ చేసిన తప్పులను ప్రజలకు పార్టీ అగ్ర నేతలు ప్రజాగ్రహ సభలో […] -
బీజేపీ తీరుపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం
ఏపీలో బీజేపీ తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ప్రజాగ్రహా సభలో విశాఖ స్టీల్ ప్లాంట్ గూర్చి చెప్పాలన్నారు. విద్యార్ది నాయకుడిగా పనిచేసిన నా గుండె రగిలిపోతుంది. ఎందరో సమర యోధులు స్టీల్ ప్లాంట్ కోసం అమరులైయ్యారు. మహానీయుల త్యాగాలు ప్రయివేటైజ్ చేయటానికా సభ. ప్రత్యక్ష ఉద్యమంలో నాడు విద్యార్ది నాయకుడిగా పాల్గొన్నాను. ఖచ్చితంగా రాష్ర్టానికి జరిగిన అన్యాయంపై మాట్లాడాలి. రాష్ర్ట నాయకులంతా మోదీతో , నిర్మలా సీతారామన్ తో మాట్లాడాలి. రాజకీయపార్టీలకు ఎజెండా ప్రాధాన్యతలు ఉంటాయి. […] -
ప్రత్యేక హోదా బిర్యానీ…ప్రత్యేక ప్యాకేజీ బఫే..
ఏపీలో బీజేపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి వైసీపీ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.జగన్ ఢిల్లీలో చెంచాగిరీ చేస్తున్నారు.. ఏపీలో దాదాగిరి చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు ఆడే మైండ్ గేమ్ ఏంటో బీజేపీకి అర్ధం చేసుకోని పరిస్థితుల్లో లేదు. సీఎం జగన్ నోటికొచ్చిన అబద్దాలు చెబుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంటుపై కేంద్రం సముచిత నిర్ణయం తీసుకుంటుంది. ప్రత్యేక హోదా బిర్యానీ లాంటిది.. ప్రత్యేక ప్యాకేజీ బఫే లాంటిదన్నారు ఆదినారాయణ […] -
జగన్ దిగొచ్చేవరకూ పోరాటం..అచ్చెన్న
ఏపీలో ఓటీఎస్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే.. టీడీపీ మాత్రం అది పేద ప్రజల రక్తం పీల్చే పథకం అంటోంది. ఓటీఎస్ పై టీడీపీ నేతలు, కార్యకర్తల పోరాటానికి అభినందనలు తెలిపారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. కొన్నిచోట్ల ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నిరసన కార్యక్రమానికి అధికార పార్టీ నేతలు, పోలీసుల అడ్డుంకులు చేధించుకుని […] -
సింహాన్ని దత్తత తీసుకున్న పీజేఆర్ కూతుళ్ళు
సింహాలు, పులులు, ఏనుగులను దత్తత తీసుకుని వాటి సంరక్షణకు పాటుపడడం చాలామంది చేస్తుంటారు. తాజాగా దివంగత కాంగ్రెస్ నేత పి.జనార్దనరెడ్డి కూతుళ్ళు ఇలాంటి మంచిపనికి పూనుకున్నారు. విజయారెడ్డి, పావనీరెడ్డి హైదరాబాద్ జూపార్క్లోని ఆసియా సింహాన్ని దత్తత తీసుకున్నారు. పీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వరంలో కార్పొరేటర్ అయిన విజయారెడ్డి, సోదరి పావనీరెడ్డి నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యురేటర్ రాజశేఖర్ను కలిసిన వీరిద్దరూ సింహం దత్తత, పోషణ, ఆహారం కోసం లక్ష రూపాయల చెక్కు అందించారు. డిసెంబరు 21 నుంచి వచ్చే […] -
గంగాజలంతో అద్భుతం.. చితిపై నుంచి ఆస్పత్రికి…
ఢిల్లీలోని టిక్రీ ఖుర్ద్లో జరిగిన ఒక సంఘటన అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. 62 ఏళ్ళ సతీష్ భరద్వాజ్ చనిపోయినట్టు నిర్ధారించారు 11 మంది వైద్యులు. ఏం అద్బుతం జరిగిందో తెలీదు. చితికి నిప్పంటించే ముందు అతని నోటిలో గంగాజలం పోశాక కళ్లు తెరిచి మాట్లాడాడు. దీంతో అతడిని చితిపై నుంచి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందంటున్నారు వైద్యులు. కేన్సర్తో బాధపడుతున్న ఓ వృద్ధుడు మరణించాడు. విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు అంత్యక్రియలకు […]
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!