NEET Protest Talks Today: నేడు సీజేపీ-ప్రభుత్వం మధ్య మూడో విడత చర్చలు.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఉత్కంఠ
- నేడు సీజేపీ-ప్రభుత్వం మధ్య మూడో విడత చర్చలు
- కీలకంగా మారిన మూడో విడత చర్చలు
- అందరి దృష్టి నేటి సమావేశంపైనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET Protest Talks Today: నీట్-యూజీ (NEET-UG) పరీక్షలో అక్రమాల ఆరోపణల నేపథ్యంలో కొనసాగుతున్న ఆందోళనలకు పరిష్కారం దిశగా కీలక పరిణామం చోటుచేసుకోనుంది. జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వం మధ్య శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు మూడో విడత చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశమే ప్రధాన చర్చగా మారే అవకాశం ఉంది.
కీలకంగా మారిన మూడో విడత చర్చలు
ఇప్పటికే ఇరుపక్షాల మధ్య రెండు దఫాల చర్చలు జరిగినప్పటికీ పూర్తి స్థాయిలో ఏకాభిప్రాయం కుదరలేదు. శుక్రవారం జరిగిన రెండో విడత సమావేశం అనంతరం కేంద్ర మంత్రి జె.పీ. నడ్డా మాట్లాడుతూ, పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు సీజేపీ మూడు ప్రధాన డిమాండ్లు, ఐదు కీలక సూచనలను ప్రభుత్వానికి అందించిందని తెలిపారు. వాటిని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని పేర్కొన్నారు.
Also Read
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
- Sugar Price Hike: ఇథనాల్ వల్లే చక్కెర ధరలు పెరిగాయా.? కేంద్రం క్లారిటీ..
- Floods: మధ్యప్రదేశ్ను ముంచెత్తిన వరదలు.. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు
- Bihar: అందరికి డయాబెటిస్ ఉంది, చక్కెర ధర పెరిగిన పర్వాలేదు: బీహార్ మంత్రి..
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సీజేపీ స్పష్టమైన వైఖరి
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్పై ఎలాంటి రాజీ ఉండదని సీజేపీ స్పష్టం చేసింది. మూడో విడత చర్చల్లో ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తన అధికారిక వైఖరిని వెల్లడించాలని పార్టీ నాయకులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం లేదని చెబుతున్నాయి. రాజీనామా కంటే విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడంపైనే ప్రభుత్వం దృష్టి సారించిందని సమాచారం.
బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం?
రెండో విడత సమావేశం అనంతరం సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా మాట్లాడుతూ, నిరసనల సమయంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి ఆర్థిక సహాయం అందించాలన్న డిమాండ్కు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని తెలిపారు. అలాగే నిరసనకారులపై నమోదైన కేసులను ఉపసంహరించుకునే అంశంపైనా సానుకూల స్పందన లభించిందని పేర్కొన్నారు. అయితే ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు
NEET-UG పరీక్షలో జరిగిన అక్రమాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్తో పాటు పలు ప్రతిపక్ష పార్టీలు కూడా విద్యార్థుల డిమాండ్లకు మద్దతు ప్రకటించాయి. విద్యా వ్యవస్థలో పారదర్శకత, పరీక్షల నిర్వహణలో సంస్కరణలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
అందరి దృష్టి నేటి సమావేశంపైనే
లడఖ్కు చెందిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ 26 రోజుల నిరాహార దీక్షను విరమించిన అనంతరం ప్రభుత్వం-సీజేపీ మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు శనివారం జరగనున్న మూడో విడత సమావేశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ చర్చల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ప్రభుత్వం స్పష్టత ఇస్తుందా? విద్యార్థుల డిమాండ్లపై కీలక నిర్ణయాలు తీసుకుంటుందా? అనే అంశాలు ఇప్పుడు రాజకీయ, విద్యా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ సమావేశం ఫలితం NEET వివాదం తదుపరి పరిణామాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Bandi Sanjay : యోగితో బండి సంజయ్ భేటీ.. తెలంగాణపై కీలక చర్చ.!
-
India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
-
Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
-
Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
-
Best Time to Oil Hair: తలకు నూనె విషయంలో అమ్మమ్మల మాటే నిజమా..? రాత్రంతా ఉంచాల్సిన అవసరం ఉందా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!