రైతు బంధుకు నిధుల కొరత లేదు: మంత్రి నిరంజన్రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకాన్ని రైతులకు అందించడానికి నిధుల కొరత లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతు బంధు ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన రైతు బంధు పథకం గురంచి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు పథకాన్ని అర్హులు అయిన ప్రతి ఒక్క రైతుకు అమలు చేస్తామన్నారు. అలాగే సోమవారం ఐదో రోజు రైతు బంధు డబ్బులు రైతుల అకౌంట్ లలో జమ అయ్యాయని తెలిపారు. నేడు రూ. 1047.41 కోట్లు విడుదల అయ్యాయని తెలిపారు. వీటితో నేడు 4,89,189 మంది రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు.ఈ సారి రూ. 5,294 కోట్లను 57,60,280 మందికి పంపిణీ చేశామని తెలిపారు.
Read Also:కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో జగన్ భేటీ
Also Read
అలాగే రైతు బంధు పథకం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ. 50 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని ప్రకటించారు. అందుకే నేటి నుంచి జనవరి 10 వరకు రైతు బంధు దినోత్సవాలను నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటి ముందు రైతు బంధు పథకానికి సంబంధించిన ముగ్గులు వేయాలని కోరారు. అలాగే విద్యార్థులకు వ్యాస రచన, ఉపన్యాస, పెయింటింగ్ వంటి పోటీలను నిర్వహించాలని ఆదేశించారు. దేశంలో ఎక్కడ రైతు బంధులాంటి పథకం లేదన్నారు. సీఎం కేసీఆర్ ఎప్పుడు ప్రజల సంక్షేమం కోసమే ఆలోచిస్తారని మంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!