NTV WebDesk
Author- NTV Telugu-
రియల్టర్ హత్యకేసుని చేధించిన పోలీసులు
సంగారెడ్డి జిల్లా వెలిమెలకు చెందిన రియల్టర్ హత్య కేసుని చేధించారు పోలీసులు. తెల్లాపూర్ లో రియల్టర్ దారుణహత్యకు గురవడం కలకలం రేపింది. కనిపించకుండా పోయిన రియల్టర్ కడవత్ రాజు చివరకు హత్యకు గురయ్యాడు. హత్యకేసులో మృతుని సోదరుడు రాంసింగ్ నాయక్తో పాటు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు పటాన్ చెరు డీఎస్ పి భీంరెడ్డి.. వెలిమెల కడవత్ రాజు నాయక్ ను హత్య చేసి ఒక చోట తల, మరో చోట […] -
ఎమ్మెల్సీ కడియంను కలిసిన ఎమ్మెల్యే అరూరి రమేష్
తెలంగాణ రాష్ట్ర సమితి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా వర్ధనపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆదివారం ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ.. పార్టీ పటిష్టతే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. అందరిని కలుపుకొని వెళ్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ అభివృద్ధికి తనవంతు సాయం అందిస్తానన్నారు. పార్టీలో ఎలాంటి సమస్యలు రాకుండా సమన్వయం చేసుకుంటూ […] -
రాష్ట్రంలో ఐఏఎస్,ఐపీఎస్ వ్యవస్థలను కేసీఆర్ ధ్వంసం చేశారు: ఉత్తమ్కుమార్రెడ్డి
కేంద్రం ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థల తీరును కేసీఆర్ తప్పు పట్టారని, కానీ ఐఏఎస్ ఐపీఎస్ల వ్యవస్థను కేసీఆర్ ధ్వంసం చేసిన చరిత్ర కేసీఆర్కే దక్కుతుందని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పై తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవడం తప్పేనని ఉత్తమ్ అన్నారు. 14 మంది ఐఏఎస్లను తప్పించి.. వేరే రాష్ట్రానికి చెందిన వాళ్లను సీఎస్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. […] -
సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగిన బండి సంజయ్
తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటూనే వున్నారు. తాజాగా బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణ వచ్చినా నిరుద్యోగుల కష్టాలు తీరలేదన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యల నివారణలో సీఎం వైఫల్యం చెందారన్నారు. ఉద్యమనాయకుడు కేసీఆర్ కు, సీఎం కేసీఆర్ కు చాలా వ్యత్యాసం ఉందని అన్నారు. ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను సీఎం […] -
రైల్వేశాఖ కీలక నిర్ణయం: ఉపయోగంలేని బోగీలతో…
రైల్వేశాఖలో ఉపయోగంలో లేని పాత బోగీల సంఖ్య పేరుకుపోతున్నాయి. పాత రైల్వే బోగీలను వినియోగించేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఉపయోగం లేని బోగీలను రెస్టారెంట్లుగా మార్చాలని రైల్వేశాఖ నిర్ణయం దీసుకుంది. పాత బోగీలకు రంగులు వేసి రెస్టారెంట్లుగా మార్చే ప్రక్రయను చేపట్టింది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో పాత రైల్వే బోగీలను మొదటగా రెస్టారెంట్గా మార్చింది. ఈ బోగీ రెస్టారెంట్ ఆకట్టుకోవడంతో రైల్వేశాఖ మరికొన్ని రైల్వే బోగీలను రెస్టారెంట్లుగా మార్చాలను నిర్ణయించింది. ప్రస్తుతం ఈ బోగీకి సంబంధించిన […] -
ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు: బండి శ్రీనివాసరావు
ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని ఏపీ ఏన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. 3వ తేదిన జరిగే ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. కొత్త పీఆర్సీ అమలులోకి వస్తే ఉద్యోగుల పరిస్థితి రివర్స్ అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రుల బృందం కావాలనే రెచ్చగొడుతుందన్నారు. మిశ్రా కమిటీ సిఫార్సు బయటపెట్టమని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఉనికిలో లేని ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించి మమ్ముల్ని అవమానపరిచారననారు. Read […] -
వినోద్ జైన్కు శిక్ష పడాలనే ఉద్దేశంతోనే సూసైడ్ నోట్ రాసింది: వాసిరెడ్డి పద్మ
ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్నారి ఆత్మహత్య చేసుకుంది, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. లైంగిక వేధింపులకు గురి చేసిన వినోద్ జైన్ గురించి ఎందుకు చెప్పలేకపోయిందో ఆ చిన్నారి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన గురించి ఎవరికైనా చెబితే ఇంట్లో వాళ్లని ఏమైనా చేస్తామని భయపెట్టాడా..? వినోద్ జైన్ మందబలం చూసి భయపడిందా..? వినోద్ జైన్ కు శిక్ష పడాలనే ఉద్దేశంతోనే వివరంగా సూసైడ్ నోట్ రాసిందని వాసిరెడ్డి పద్మ అన్నారు. […] -
ఏపీలో కొత్తగా 10,310 కరోనా కేసులు
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుంది. నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 10,310 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా శనివారంతో పోలిస్తే.. ఈ రోజు రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు 1,263 కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా […] -
ఉద్యోగాలు ఇవ్వకపోగా అరెస్టులు చేసి జైల్లో పెడతారా..?: రేవంత్ రెడ్డి
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చేందుకు వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలపై దాడలు చేస్తారా అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాలు ఇవ్వకపోగా అరెస్టులు చేసి జైల్లో పెడతారా..? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలాగే నిర్భందం కొనసాగిస్తే ప్రతిఘటన తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నాయకులపై దాడులు, అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని రేవంత్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడానికి […] -
రైళ్లకోసం పట్టాలపై మంటలు… ఎందుకంటే…
ప్రస్తుతం అమెరికాలో మంచు భీభత్సం సృష్టిస్తోంది. మంచు తుపాన్ కారణంగా లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. వేలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. రైలు పట్టాలపై మంచు పేరుకుపోవడంతో అనేక రైళ్లు రద్దయ్యాయి. అయితే, చికాగో రైల్వే అధికారులు దీనికోసం ప్రత్యామ్నాయ మార్గాలను కనిపెట్టారు. మంచుకారణంగా రైలు పట్టాలు కుంచించుకుపోయి రైళ్ల రాకపోకలు ఇబ్బందులు కలుగుతుండటంతో రైళ్ల పట్టాలపై మంటలను ఏర్పాటు చేశారు. దీంతో పట్టాలు వెచ్చగా మారి రైళ్ల రాకపోకలకు అనువుగా మారుతున్నాయి. అయితే, ఇవి […]
తాజావార్తలు
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
-
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!