NTV WebDesk
Author- NTV Telugu-
ఆటో డ్రైవర్ నిజాయితీ.. పోయిన బ్యాగ్ తిరిగి ఇచ్చి..
ఈరోజుల్లో అడుగడుగునా మోసాలు జరుగుతున్నాయి. ఆటోలలో ప్రయాణించే ప్రయాణికుల సెల్ ఫోన్లు, బ్యాగ్ లు మిస్ అవుతున్నాయి. ఆటో డ్రైవర్లలో కొందరు తమ నిజాయితీని చాటుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ ఆటోడ్రైవర్ నిజాయితీకి ప్రయాణికురాలు అభినందనలు తెలిపారు. నిజాయితీ గల ఆటో డ్రైవర్ సయ్యద్ జాకర్ తనకు లభించిన 10 తులాల బంగారాన్ని పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు. లంగర్ హౌస్ కి చెందిన మీర్జా సుల్తాన్ బేగ్ హషమ్నగర్ నుండి టోలీచౌకి వైపు హోండా […] -
ప్రధాని డ్రామాల్లో ఆరితేరిన వ్యక్తి.. తలసాని ఫైర్
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై టీఆర్ఎస్ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ప్రధాని మోడీ డ్రామాల్లో ఆరితేరిన వ్యక్తి అని దుయ్యబట్టారు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్. పార్లమెంట్ కు రాని వ్యక్తి మోడీ. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయని డ్రామాలు స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ అన్యాయం చేస్తే నువ్వు ఏం న్యాయం చేసావో చెప్పు అని ఆయన ప్రశ్నించారు. ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ ఓడిపోతుంది. హైదరాబాద్ లో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మోడీ తన స్వార్థానికి ఉపయోగించుకున్నారు. సమతామూర్తి కార్యక్రమాల్లో […] -
ఉక్రెయిన్ లో శాంతి కోసం రంగంలోకి ఆ రెండు దేశాలు… చర్చలు ఫలిస్తాయా?
ఉక్రెయిన్- రష్యా మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా దళాలను మోహరించగా, ఉక్రెయిన్కు అండగా నాటో దళాలు, అమెరికా దళాలు మోహరించాయి. ఉక్రెయిన్ ను అక్రమించుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని అమెరికా స్పష్టం చేసింది. ఉక్రెయిన్కు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా స్పష్టం చేసింది. అయితే, రష్యాకూడా ఇదే విధంగా చెబున్నది. ఉక్రెయిన్ను ఆక్రమించుకోవాలనే ఉద్దేశం తమకు లేదని, సోవియట్ యూనియన్ ఒప్పందాలకు విరుద్దంగా నాటో దేశాలు, అమెరికా ప్రవర్తిస్తే తగిన చర్యలు […] -
షుగర్ ఫ్యాక్టరీల మూతతో చెరుకు రైతుకు చేదు
ఏపీ ప్రభుత్వంపై ఒక స్థాయిలో విరుచుకుపడుతున్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. షుగర్ ఫ్యాక్టరీలు మూత.. చెరుకు రైతుల జీవితాల్లో చేదు మిగిల్చిందన్నారు. పూజ్య బాపూజీ కలలు కన్న సహకార వ్యవస్ధను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలకులు నిర్వీర్యం చేస్తున్నారు.సహకారవ్యవస్థతోనే దేశాభివృద్ది జరుగుతుంది అటువంటి వ్యవస్థను మంట కలుపుతున్నారు. Read Also వంగవీటి రాధా, కొడాలి నాని, వంశీపై బోండా ఉమ ఆసక్తికర వ్యాఖ్యలు వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న మన రాష్ట్రంలో చెరుకు రైతును ప్రభుత్వాలు నట్టేట […] -
గోబెల్స్ ని మించిపోయేలా మోడీ అబద్ధాలు
ప్రధాని మోడీ రాజ్యసభలో చేసిన ప్రసంగం మంటలు రాజేస్తోంది. మోడీ గోబెల్స్ లాగా..అబద్దాల మీద అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు సీపీఐ నేత నారాయణ. పార్లమెంట్ లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి మద్దతు ఇవ్వలేదా..!? ప్రధాని మోడీ వ్యాఖ్యలు వెంకయ్య నాయడిని అవమానించడమే అన్నారు. ఆ రోజు పార్లమెంట్ లో ఉంది సుష్మా స్వరాజ్.. వెంకయ్య నాయుడు తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వలేదా..? Read Also రాష్ట్ర విభజనపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు ఇప్పుడు ఎందుకు […] -
నేపాల్ భూభాగంపై కన్నేసిన చైనా…
చైనా చుట్టుపక్కల దేశాలపై కన్నేసింది. 2025 నాటికి తైవాన్ను పూర్తిగా ఆక్రమించుకోవాలని చైనా చూస్తున్నది. దీనికోసం చాలా రోజులుగా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఇటు ఇండియాలోని లద్ధాఖ్, అరుణాచల్ ప్రదేశ్పై కూడా చైనా కన్నేసి ఆక్రమించుకోవాలని చూస్తున్నది. బోర్డర్ లో అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు ఆ దేశం సిద్దమౌతున్న సంగతి తెలిసిందే. అదీ చాలదన్నట్టు ఇప్పుడు మరో మిత్రదేశం నేపాల్పై కూడా చైనా కన్నేసింది. నేపాల్ చైనా మధ్య సుమారు 1400 కిమీ మేర సరిహద్దు […] -
గుడ్లవల్లేరు సచివాలయంపై ఏసీబీ దాడులు
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం గుడ్లవల్లేరు గ్రామ సచివాలయం-2 పై ఏసీబీ అధికారుల దాడులు కలకలం రేపాయి. పట్టాదారు పాస్ బుక్ జారీకి గ్రామ వీఆర్వో వసుంధర 5 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. మండలంలోని వేమిగుంట గ్రామంలో ఉన్న రెండున్నర ఎకరాల భూమికి పట్టాదారు పాసుపుస్తకం జారీకి దరఖాస్తు చేయగా 5 వేలు లంచం డిమాండ్ చేశారు వీఆర్వో వసుంధర. భూమి సూపర్వైజర్ సురేష్ ఫిర్యాదు […] -
యూనివర్శిటీలో సరికొత్త శిక్షణ: పేడతో పిడకలు చేయడం ఎలా?
సాధారణంగా విశ్వవిద్యాలయాల్లో విద్యను బోధిస్తుంటారు. వివిధ వృత్తులపై శిక్షణ ఇస్తుంటారు. అయితే, వారణాసిలోని హిందూ బనారస్ విశ్వవిద్యాలయంలో పిడకలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. సోషల్ సైన్స్ అండ్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ కౌశిల్ విద్యార్థులకు పిడకలు చేయడంపై శిక్షణ అందించారు. విశ్వవిద్యాలయంలోని సమీకృత గ్రామాభివృద్ది కేంద్రంలో విద్యార్థులకు శిక్షణ అందించారు. కేవలం వంట చేసుకోవడానికి మాత్రమే కాకుండా యజ్ఞయాగాదుల్లోనూ, ఇతర కార్యక్రమాల్లోనూ పిడకలను వినియోగిస్తారు. ఒకప్పుడు గ్రామాల్లో పిడకలను ప్రతి ఇంట్లో వినియోగించేవారు. కానీ, ఇప్పుడు కొన్ని […] -
అప్పుడేమో హాట్.. ఇప్పుడేమో చీప్ !
అయితే అతివృష్టి… లేదంటే అనావృష్టి… ఇదీ టమాటా రైతుల పరిస్థితి. ఒక్కోసారి ఊహించనంత రేటు పలుకుతుంది. లేదంటే పాతాళానికి పడిపోతుంది. ప్రస్తుతం ఇదే జరగడంతో రైతు మళ్లీ దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. టమాటా పేరు చెబితే గుర్తుకు వచ్చేది చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్. కరోనా తర్వాత ఈమధ్యే కాస్త రైతు కోలుకున్నాడు. లావాదేవీలు కూడా ఆశాజనకంగా సాగాయి. కానీ కొద్దికాలంలోనే రేటు మళ్లీ కిందికి పడిపోయింది. చిత్తూరు జిల్లాలో ఈసారి పంట దిగుబడి ఊహించని స్థాయిలో […] -
బ్రిటన్కు తదుపరి రాణి ఆమెనా…?
బ్రిటన్కు కొత్త రాణి రాబోతున్నదా అంటే అవుననే అంటున్నది ఎలిజిబిత్ 2. గత 70 ఏళ్లుగా ఆమె గ్రేట్ బ్రిటన్కు మహరాణిగా ఉంటున్నారు. ఆమె తరువాత మహరాణి ఎవరూ అన్న దానిపై ఎలిజిబిత్ 2 క్లారిటీ ఇచ్చారు. తన తరువాత మహరాణి హోదాను తన కోడలు కెమిల్లాకు ఇవ్వాలని ఆకాంక్షించారు. ఎలిజిబిత్ 2 కుమారుడైన చార్లెస్ భార్యగా ఆమెకు ఆ హోదా దక్కనుంది. అయితే, ఛార్లెస్ కు కెమిల్లా రెండో భార్య. మొదటి భార్య డయానా కారు […]
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!