బ్రిటన్కు కొత్త రాణి రాబోతున్నదా అంటే అవుననే అంటున్నది ఎలిజిబిత్ 2. గత 70 ఏళ్లుగా ఆమె గ్రేట్ బ్రిటన్కు మహరాణిగా ఉంటున్నారు. ఆమె తరువాత మహరాణి ఎవరూ అన్న దానిపై ఎలిజిబిత్ 2 క్లారిటీ ఇచ్చారు. తన తరువాత మహరాణి హోదాను తన కోడలు కెమిల్లాకు ఇవ్వాలని ఆకాంక్షించారు. ఎలిజిబిత్ 2 కుమారుడైన చార్లెస్ భార్యగా ఆమెకు ఆ హోదా దక్కనుంది. అయితే, ఛార్లెస్ కు కెమిల్లా రెండో భార్య. మొదటి భార్య డయానా కారు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. చార్లెస్ మొదట ప్రిన్సెస్ డయానాను వివాహం చేసుకున్నారు. అయితే, 1996లో డయానా.. చార్లెస్ విడాకులు తీసుకున్నారు.
Read: హ్యుందాయ్పై తీవ్రప్రభావం చూపిన ఆ పోస్ట్… నెటిజన్లు తీవ్ర ఆగ్రహం…
విడాకులు తీసుకున్న ఏడాదికి డయానా కారుప్రమాదంలో మృతి చెందింది. ఆ తరువాత 2005లో చార్లెస్ కెమిల్లాను వివాహం చేసుకున్నారు. ఎలిజిబిత్ 2 బ్రిటన్ మహరాణిగా బాధ్యతలు చేపట్టి 70 ఏళ్లు పూర్తయ్యిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎలిజిబిత్ 2 తన మనసులోని మాటను బయటపెట్టారు. తన కోడలు కెమిల్లాను తదుపరి రాణిగా చూడాలన్నది తన ఆకాంక్ష అని, ఇప్పటి వరకు తనకు ఇచ్చిన మద్దతును తారువాత తన కుమారుడు చార్లెస్, కెమిల్లాలకు కూడా అందివ్వాలని అన్నారు. మరి ఎలిజిబిత్ 2 కోరిక నెరవేరుతుందా చూడాలి.