ప్రధాని డ్రామాల్లో ఆరితేరిన వ్యక్తి.. తలసాని ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై టీఆర్ఎస్ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ప్రధాని మోడీ డ్రామాల్లో ఆరితేరిన వ్యక్తి అని దుయ్యబట్టారు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్. పార్లమెంట్ కు రాని వ్యక్తి మోడీ. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయని డ్రామాలు స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ అన్యాయం చేస్తే నువ్వు ఏం న్యాయం చేసావో చెప్పు అని ఆయన ప్రశ్నించారు.
ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ ఓడిపోతుంది. హైదరాబాద్ లో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మోడీ తన స్వార్థానికి ఉపయోగించుకున్నారు. సమతామూర్తి కార్యక్రమాల్లో పాల్గొనే నైతిక హక్కు ప్రధానికి లేదు.బీజేపీ సిద్ధాంతమే విభజించు, పాలించు. మనుషులను కులాలు, మతాల పేరుతో విభజించారు. ప్రధానికి భాద్యత ఉండాలి. భాద్యత లేకుండా మాట్లాడుతున్నారు.
Also Read
యూపీ ఎన్నికల గురించే ధార్మిక కార్యక్రమంలో మాట్లాడారు.తెలంగాణ మీద మోదికి ఎంత కక్ష్య ఉందో ఆయన మాటలతోనే తెలుస్తోంది.కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయక ముందే మండలాలు లాక్కున్నాడు.తెలంగాణలో ఉన్న ఆస్తులు అమ్మేస్తున్నారు. సింగరేణి వంటి పెద్ద సంస్థలు అమ్మేస్తున్నారు.ఏడున్నర సంవత్సరాల్లో ఆయన ఆయన డ్రెస్ కోడ్ తప్ప దేశ ప్రజలకు ఏమి చేయలేదు.సింగరేణి జోలికి వస్తే తెలంగాణ ఉద్యమం తరహా ఉద్యమం మళ్ళీ మొదలవుతుంది.
ప్రధాని పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకరు ప్రతినిధిగా ఉంటే సరిపోతుంది.ఏడున్నర సంవత్సరాలుగా తెలంగాణకు అన్యాయం చేసారు.ప్రధాని పర్యటనను బాయ్ కాట్ చేస్తే తప్పేంటి.. రాష్ట్రం అడిగిన ఒక్క పని కేంద్రం చేయలేదు. దానికి సమాధానం చెప్పాలి.రాజ్యాంగం పై ప్రతిపక్షాలు కుక్కరుపులు అరుస్తున్నాయన్నారు తలసాని.
Read Also కేంద్రం తెలంగాణకు టూరిజం కోసం రూ.242 కోట్లు ఇచ్చింది: కిషన్ రెడ్డి
105 సార్లు రాజ్యాంగ సవరణలు చేశారు. మళ్ళీ సవరణలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. చావుల మీద పేలాలు ఏరుకునే పార్టీలు ఇవి. రాజ్యాంగం ప్రకారం విభజన జరిగింది. మరి విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలన్నారు మంత్రి తలసాని. బీజేపీలో ఉన్నది నెహ్రూ జూలాజికల్ పార్కులో ఉన్నవి ఒక్కటే. పొలిటికల్ డ్రామాలో భాగంగానే రాష్ట్ర విభజన పై మోడీ మాట్లాడారు. పార్లమెంటులో ఏ ఎంపి ప్రశ్నించక ముందే ప్రధాని ఏపీ విభజన అంశాన్ని లేవనెత్తారు. దేశ రాజకీయాల్లో భారీ మార్పులు రాబోతున్నాయన్నారు మంత్రి తలసాని.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!