ప్రధాని డ్రామాల్లో ఆరితేరిన వ్యక్తి.. తలసాని ఫైర్
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై టీఆర్ఎస్ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ప్రధాని మోడీ డ్రామాల్లో ఆరితేరిన వ్యక్తి అని దుయ్యబట్టారు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్. పార్లమెంట్ కు రాని వ్యక్తి మోడీ. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయని డ్రామాలు స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ అన్యాయం చేస్తే నువ్వు ఏం న్యాయం చేసావో చెప్పు అని ఆయన ప్రశ్నించారు.
ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ ఓడిపోతుంది. హైదరాబాద్ లో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మోడీ తన స్వార్థానికి ఉపయోగించుకున్నారు. సమతామూర్తి కార్యక్రమాల్లో పాల్గొనే నైతిక హక్కు ప్రధానికి లేదు.బీజేపీ సిద్ధాంతమే విభజించు, పాలించు. మనుషులను కులాలు, మతాల పేరుతో విభజించారు. ప్రధానికి భాద్యత ఉండాలి. భాద్యత లేకుండా మాట్లాడుతున్నారు.
Also Read
యూపీ ఎన్నికల గురించే ధార్మిక కార్యక్రమంలో మాట్లాడారు.తెలంగాణ మీద మోదికి ఎంత కక్ష్య ఉందో ఆయన మాటలతోనే తెలుస్తోంది.కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయక ముందే మండలాలు లాక్కున్నాడు.తెలంగాణలో ఉన్న ఆస్తులు అమ్మేస్తున్నారు. సింగరేణి వంటి పెద్ద సంస్థలు అమ్మేస్తున్నారు.ఏడున్నర సంవత్సరాల్లో ఆయన ఆయన డ్రెస్ కోడ్ తప్ప దేశ ప్రజలకు ఏమి చేయలేదు.సింగరేణి జోలికి వస్తే తెలంగాణ ఉద్యమం తరహా ఉద్యమం మళ్ళీ మొదలవుతుంది.
ప్రధాని పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకరు ప్రతినిధిగా ఉంటే సరిపోతుంది.ఏడున్నర సంవత్సరాలుగా తెలంగాణకు అన్యాయం చేసారు.ప్రధాని పర్యటనను బాయ్ కాట్ చేస్తే తప్పేంటి.. రాష్ట్రం అడిగిన ఒక్క పని కేంద్రం చేయలేదు. దానికి సమాధానం చెప్పాలి.రాజ్యాంగం పై ప్రతిపక్షాలు కుక్కరుపులు అరుస్తున్నాయన్నారు తలసాని.
Read Also కేంద్రం తెలంగాణకు టూరిజం కోసం రూ.242 కోట్లు ఇచ్చింది: కిషన్ రెడ్డి
105 సార్లు రాజ్యాంగ సవరణలు చేశారు. మళ్ళీ సవరణలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. చావుల మీద పేలాలు ఏరుకునే పార్టీలు ఇవి. రాజ్యాంగం ప్రకారం విభజన జరిగింది. మరి విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలన్నారు మంత్రి తలసాని. బీజేపీలో ఉన్నది నెహ్రూ జూలాజికల్ పార్కులో ఉన్నవి ఒక్కటే. పొలిటికల్ డ్రామాలో భాగంగానే రాష్ట్ర విభజన పై మోడీ మాట్లాడారు. పార్లమెంటులో ఏ ఎంపి ప్రశ్నించక ముందే ప్రధాని ఏపీ విభజన అంశాన్ని లేవనెత్తారు. దేశ రాజకీయాల్లో భారీ మార్పులు రాబోతున్నాయన్నారు మంత్రి తలసాని.
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!