ప్రధాని డ్రామాల్లో ఆరితేరిన వ్యక్తి.. తలసాని ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై టీఆర్ఎస్ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ప్రధాని మోడీ డ్రామాల్లో ఆరితేరిన వ్యక్తి అని దుయ్యబట్టారు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్. పార్లమెంట్ కు రాని వ్యక్తి మోడీ. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయని డ్రామాలు స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ అన్యాయం చేస్తే నువ్వు ఏం న్యాయం చేసావో చెప్పు అని ఆయన ప్రశ్నించారు.
ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ ఓడిపోతుంది. హైదరాబాద్ లో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మోడీ తన స్వార్థానికి ఉపయోగించుకున్నారు. సమతామూర్తి కార్యక్రమాల్లో పాల్గొనే నైతిక హక్కు ప్రధానికి లేదు.బీజేపీ సిద్ధాంతమే విభజించు, పాలించు. మనుషులను కులాలు, మతాల పేరుతో విభజించారు. ప్రధానికి భాద్యత ఉండాలి. భాద్యత లేకుండా మాట్లాడుతున్నారు.
Also Read
- High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
- CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
- CM Revanth Reddy: చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచే రోజు ఇది.. జల వివాదాలకు శాశ్వత పరిష్కారం..!
- SSC Supplementary Results : టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ సారి కూడా అమ్మాయిలే టాప్.!
యూపీ ఎన్నికల గురించే ధార్మిక కార్యక్రమంలో మాట్లాడారు.తెలంగాణ మీద మోదికి ఎంత కక్ష్య ఉందో ఆయన మాటలతోనే తెలుస్తోంది.కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయక ముందే మండలాలు లాక్కున్నాడు.తెలంగాణలో ఉన్న ఆస్తులు అమ్మేస్తున్నారు. సింగరేణి వంటి పెద్ద సంస్థలు అమ్మేస్తున్నారు.ఏడున్నర సంవత్సరాల్లో ఆయన ఆయన డ్రెస్ కోడ్ తప్ప దేశ ప్రజలకు ఏమి చేయలేదు.సింగరేణి జోలికి వస్తే తెలంగాణ ఉద్యమం తరహా ఉద్యమం మళ్ళీ మొదలవుతుంది.
ప్రధాని పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకరు ప్రతినిధిగా ఉంటే సరిపోతుంది.ఏడున్నర సంవత్సరాలుగా తెలంగాణకు అన్యాయం చేసారు.ప్రధాని పర్యటనను బాయ్ కాట్ చేస్తే తప్పేంటి.. రాష్ట్రం అడిగిన ఒక్క పని కేంద్రం చేయలేదు. దానికి సమాధానం చెప్పాలి.రాజ్యాంగం పై ప్రతిపక్షాలు కుక్కరుపులు అరుస్తున్నాయన్నారు తలసాని.
Read Also కేంద్రం తెలంగాణకు టూరిజం కోసం రూ.242 కోట్లు ఇచ్చింది: కిషన్ రెడ్డి
105 సార్లు రాజ్యాంగ సవరణలు చేశారు. మళ్ళీ సవరణలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. చావుల మీద పేలాలు ఏరుకునే పార్టీలు ఇవి. రాజ్యాంగం ప్రకారం విభజన జరిగింది. మరి విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలన్నారు మంత్రి తలసాని. బీజేపీలో ఉన్నది నెహ్రూ జూలాజికల్ పార్కులో ఉన్నవి ఒక్కటే. పొలిటికల్ డ్రామాలో భాగంగానే రాష్ట్ర విభజన పై మోడీ మాట్లాడారు. పార్లమెంటులో ఏ ఎంపి ప్రశ్నించక ముందే ప్రధాని ఏపీ విభజన అంశాన్ని లేవనెత్తారు. దేశ రాజకీయాల్లో భారీ మార్పులు రాబోతున్నాయన్నారు మంత్రి తలసాని.
తాజావార్తలు
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
-
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
-
Pradeep Ranganathan: ఆ డైరెక్టర్’తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!