సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్కు నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. పోలీసులు నోటీసులు అందించిన నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంట్లో కీలక సమావేశం జరుగుతోంది. తమ లీగల్ టీమ్తో అల్లు అర్జున్ సమావేశమయ్యారు.
ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ భేటీ కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ విధి విధానాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్కు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గతవారం సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టయిన అల్లు అర్జున్కు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
మంచు ఫ్యామిలీలో మరోసారి రచ్చ మొదలైంది. పహడీషరీఫ్ పోలీసులకు మంచు విష్ణుపై మరోసారి మనోజ్ ఫిర్యాదు చేశాడు. మంచు విష్ణుతో పాటు మరో ఆరుగురిపై మనోజ్ ఫిర్యాదు చేశాడు. విష్ణు అనుచరులు వినయ్ మహేశ్వరి, విజయ్ రెడ్డి, కిరణ్, రాజ్ కొండూరు, శివ, వన్నూరులపై కూడా ఫిర్యాదు చేశాడు.
మంచు కుటుంబంలో మళ్లీ మొదలైంది. పహడీషరీఫ్ పోలీసులకు మంచు విష్ణుపై మరోసారి మనోజ్ ఫిర్యాదు చేశాడు. వినయ్ అనే వ్యక్తిపై కూడా ఫిర్యాదులో మనోజ్ ఫిర్యాదు చేశారు. ఏడు అంశాలపై విష్ణుపై ఏడు పేజీల ఫిర్యాదును మనోజ్ పోలీసులకు పంపించాడు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న అమర్రాజా బ్యాటరీ కంపెనీలో భారీ మంటలు చెలరేగాయి. మూడో అంతస్తులో మంటలు ఎగసిపడుతున్నాయి.
బీఆర్ఎస్ నేతలు లేఖలతో కొత్త నాటకాలకు తెర తీస్తున్నారని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా రైతు సంక్షేమానికి ప్రత్యక్షంగా బడ్జెట్లో 35 శాతం ప్రకటించి ఖర్చు చేసినందుకా ఈ ప్రభుత్వాన్ని మీరు నిలదీయమనేదంటూ బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు.
లోన్ యాప్ మోసాలు ప్రస్తుతం తగ్గాయని తెలంగాణ సీఐడీ డీజీ షికా గోయల్ వెల్లడించారు. లోన్ యాప్లు తక్కువ సంఖ్యలో యాక్టివ్గా ఉన్నాయని తెలిపారు. డిజిటల్ అరెస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆమె సూచించారు. పోలీస్ అధికారులు అంటూ ఎవరు కాల్ చేసినా కాల్ కట్ చేయాలన్నారు.
Shikha Goyal: సైబర్ సెక్యూరిటీ బ్యూరో 2024 వార్షిక నివేదికను సీఐడీ డీజీ షికా గోయల్ విడుదల చేశారు. ఈ సంవత్సరంలో సైబర్ నేరగాళ్ల కోసం మూడు ఆపరేషన్స్ నిర్వహించినట్లు శిఖా గోయల్ తెలిపారు. ఈ ఏడాది 18 నుండి 20 శాతం సైబర్ నేరాలు పెరిగాయని వెల్లడించారు. ఈ సంవత్సరం రూ.176 కోట్లు రికవరీ చేసి బాధితులకు తిరిగి ఇచ్చామన్నారు. సైబర్ నేరగాళ్ల అరెస్టులు కూడా గణనీయంగా పెరిగాయని.. 1,057 సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశామని […]
కొత్త సంవత్సరం వేడుకలకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు బెజవాడ సిద్ధమైంది. మొన్నటివరకు బ్రాండ్స్ అందుబాటులో లేకపోవడంతో నానా రచ్చ చేసిన మందుబాబులు.. ఇప్పుడు కొత్త బ్రాండ్లు అందుబాటులోకి రావడం ఫుల్ కిక్కే కిక్కు అని అంటున్నారు.