లోక్సభ ఎన్నికల దృష్ట్యా, డీప్ఫేక్లు, తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడం పెద్ద సవాలుగా మారింది. తాజాగా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడంతో తప్పుడు సమాచారాన్ని అడ్డుకునేందుకు సోషల్ మీడియా సంస్థలు ఇందుకు సిద్ధమయ్యాయి. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో.. యూట్యూబ్ గత ఏడాది అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ప్లాట్ఫారమ్ నుండి 2.25 మిలియన్ వీడియోలను తొలగించినట్లు తెలిపింది.
ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. అందుకే ఈ పండుగకు యుగం+ఆది 'యుగాది' లేదా 'ఉగాది' అని పేరు వచ్చింది. తెలుగు పంచాంగం ప్రకారం వచ్చే చైత్ర శుద్ధ పాడ్యమి నాడు కృత యుగం ప్రారంభమైంది కాబట్టి ఆనాటి నుంచి చైత్రశుద్ధ పాడ్యమి రోజును మనం ఉగాదిగా జరుపుకుంటాం.
సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ హఠాన్మరణంపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్రంలో పోలీసు విభాగానికి ఆయన అందించిన విశిష్టమైన సేవలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
దేశంలో మొదటి, రెండో దశ సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అయితే దేశంలోని రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ల అభ్యర్థిత్వంపై కొన్ని ముఖ్యమైన స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ ఇప్పటి వరకు 418 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ఇప్పటి వరకు 92 మంది సిట్టింగ్ ఎంపీల టిక్కెట్లను పార్టీ రద్దు చేసింది.
దేశంలో లోక్సభ ఎన్నికలు ఏడు దశల్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏప్రిల్ 19న జరగనున్న తొలి దశ సార్వత్రిక ఎన్నికలలో 21 రాష్ట్రాల్లోని 102 లోక్సభ స్థానాలకు 1625 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నికల బరిలోకి దిగారు. వీరిలో 252 మంది అభ్యర్థులు నేరచరితులు అంటే వారిపై క్రిమినల్ కేసు నమోదైంది.
ప్రముఖుల పేర్లతో ఖాతాలు సృష్టిస్తూ.. మోసాలకు పాల్పడుతున్న ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో నిర్మల్, నారాయణపేట పాలనాధికారుల పేరుతో మోసాలకు పాల్పడ్డ సైబర్ నేరగాళ్లు.. తాజాగా.. ఎస్పీడీసీఎల్ సీఎండీ ముష్రాఫ్ అలీ పేరుతో నకిలీ వాట్సాప్ క్రియేట్ చేశారు కేటుగాళ్లు.
నేటి నుండి భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానము నందు శ్రీరామనవమి వసంతపక్ష తిరు కళ్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. నేటి నుండి ఈ నెల 23వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉదయం అంతరాలయంలోని ధ్రువమూర్తుల వద్ద ఉత్సవాలకు అనుజ్ఞ తీసుకొని ధ్వజారోహణం చేయనున్నారు.
జూన్ 8 లేదా 9న మూడో సారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. దేశం కోసం ఓటెయ్యండి.. అభివృద్ధి కోసం ఓటెయ్యండి అంటూ ప్రజలకు ఆయన సూచించారు. భారత దేశ గౌరవాన్ని పెంచడం కోసం ఓటెయ్యాలన్నారు. మోడీ ప్రధాని అయ్యేవరకు దేశం ఎలా ఉండేది.? ఆలోచించాలన్నారు.