Lok Sabha Polls: తొలిదశలో 1625 మంది అభ్యర్థులు.. అందులో 252 మంది నేరచరితులే..
Lok Sabha Polls 2024: దేశంలో లోక్సభ ఎన్నికలు ఏడు దశల్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏప్రిల్ 19న జరగనున్న తొలి దశ సార్వత్రిక ఎన్నికలలో 21 రాష్ట్రాల్లోని 102 లోక్సభ స్థానాలకు 1625 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నికల బరిలోకి దిగారు. వీరిలో 252 మంది అభ్యర్థులు నేరచరితులు అంటే వారిపై క్రిమినల్ కేసు నమోదైంది. 450 మంది అభ్యర్థులు కోటీశ్వరులు. వీరిలో మధ్యప్రదేశ్లోని చింద్వారా స్థానం నుంచి కాంగ్రెస్కు చెందిన నకుల్ నాథ్ అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు. 716 కోట్ల ఆస్తులను తన అఫిడవిట్లో చూపించారు.
Read Also: Kejriwal: ఉగాది రోజున బెయిల్ పిటిషన్ విచారణ.. సర్వత్రా ఉత్కంఠ
Also Read
- Kulfi Recipe at Home: ఇంట్లోనే క్రీమీ స్ట్రీట్-స్టైల్ కుల్ఫీ.. 10 రస్క్లతో సూపర్ టేస్ట్ రెసిపీ!
- Gold Rates Down: మగువలకు మురిసిపోయే శుభవార్త.. బంగారం కొనేందుకు ఇదే మంచి తరుణం..
- Kitchen Tips: మీ పెనం నల్లబడిందా..? ఏళ్ల మసి నిమిషాల్లో మాయం.. కొత్తదానిలా మెరిపించే సూపర్ చిట్కాలు..!
- E Challan: ట్రాఫిక్ ఈ చలాన్లపై.. కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు..
తొలి విడత ఎన్నికల్లో పోటీ చేసే మొత్తం అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం సోమవారం సాయంత్రం విడుదల చేసింది. వీరిలో 1625 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. వీరిలో 1491 మంది పురుషులు, 134 మంది మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తమిళనాడులో అత్యధికంగా 39 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ 39 స్థానాలకు 950 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పుదుచ్చేరిలో ఒక స్థానానికి గరిష్టంగా 26 మంది అభ్యర్థులు, నాగాలాండ్లో ఒక స్థానానికి కనీసం ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉత్తరప్రదేశ్లోని ఎనిమిది స్థానాల్లో జరగనున్న ఎన్నికల్లో 80 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అలాగే పశ్చిమ బెంగాల్లోని మూడు స్థానాలకు 37 మంది, రాజస్థాన్లోని 12 స్థానాలకు 114 మంది, మహారాష్ట్రలో ఐదు స్థానాలకు 97 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
Read Also: Ram Janmotsav: 500 ఏళ్ల తర్వాత రామజన్మోత్సవం వేడుకలు.. ముస్తాబు అవుతున్న అమోధ్య రామ మందిరం
ఎన్నికల్లో పోటీ చేసిన 1625 మంది అభ్యర్థుల్లో 1618 మంది అభ్యర్థుల అఫిడవిట్లను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ (ఏడీఆర్) పరిశీలించింది. ఏడుగురు అభ్యర్థుల అఫిడవిట్లు స్పష్టంగా లేకపోవడంతో వాటిని విశ్లేషించలేకపోయారు. ఏడీఆర్ నివేదిక ప్రకారం 1618 మంది అభ్యర్థుల్లో 252 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 161 మందిపై హత్య, కిడ్నాప్ వంటి తీవ్రమైన నేరాలున్నాయి. వీరిలో 18 మంది అభ్యర్థులపై మహిళలపై నేరాలు, ఒకరిపై అత్యాచారం కేసులు నమోదయ్యాయి. అభ్యర్థులు తమ తమ అఫిడవిట్లలో ఈ వివరాలన్నింటినీ ఇచ్చారు.ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థుల్లో 450 మంది కోటీశ్వరులేనని నివేదిక వెల్లడించింది. వీరిలో మధ్యప్రదేశ్లోని చింద్వారా స్థానం నుండి కాంగ్రెస్కు చెందిన నకుల్ నాథ్ అత్యంత సంపన్న అభ్యర్థి. రెండో స్థానంలో తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే అభ్యర్థి అశోక్కుమార్ రూ.662 కోట్లు, తమిళనాడు నుంచి బీజేపీ అభ్యర్థి దేవనాథన్ రూ.304 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు.
తాజావార్తలు
-
Katte Pongali Recipe: గుడిలో పెట్టే ప్రసాదం లాంటి కట్టె పొంగలి.. ఈ చిన్న చిట్కాతో ఇంట్లోనే అమృతంలా!
-
RCB vs GT: చితక్కొట్టిన సాయి సుదర్శన్.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్
-
Kulfi Recipe at Home: ఇంట్లోనే క్రీమీ స్ట్రీట్-స్టైల్ కుల్ఫీ.. 10 రస్క్లతో సూపర్ టేస్ట్ రెసిపీ!
-
SRH Captain: సన్రైజర్స్ హైదరాబాద్కు గుడ్న్యూస్.. ఫిట్నెస్ టెస్ట్ పాసయిన కమిన్స్.. రేపే జట్టులోకి ఎంట్రీ..
-
Kolukkumalai : భూమిపై మరో స్వర్గం.. కొలుక్కుమలై ‘మేఘాల మంచం’పై ఎప్పుడైనా నిద్రపోయారా.?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!