-
ఏపీలో కొత్తగా 137 కరోనా కేసులు నమోదు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. ఇవాళ 31,855 శాంపిల్స్ పరీక్షించగా.. 137 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఒక్కరు కోవిడ్ బాధితులు మృతి చెందారు.. ఇదే సమయంలో 189 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,09,60,653 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. మొత్తం పాజిటివ్ […] -
జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో రసాభాస..నిరసనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో రసాభాస నెలకొంది. దీంతో నిరసనకు దిగారు బీజేపీ కార్పొరేటర్లు. టీఆర్ఎస్ కార్పొరేటర్ల ప్రసంగానికి బీజేపీ కార్పొరేటర్లు అడ్డు తగిలారు. సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ ల నిధులు ఇస్తున్నారంటూ మాట్లాడొద్దని.. టీఆర్ ఎస్ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు బీజేపీ కార్పొరేటర్లు. బీజేపీ కార్పొరేటర్లకు మైక్ ఇవ్వడం పై టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జై తెలంగాణ అంటూ టీఆర్ ఎస్, భారతమాతాకి జై అంటూ బీజేపీ పోటాపోటీ నినాదాలు చేశాయి. […] -
యాసంగి పంటపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ లో యాసంగి వరిధాన్యం కొనబోమని పదే పదే స్పష్టం చేస్తున్న నేపథ్యంలో… రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో వొక్క కిలో వడ్లు కూడా కొనలేదని, రాష్ట్రం లో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోవడం లేదని ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు పునరుద్ఘాటించారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర విధనాలనుంచి రాష్ట్ర రైతాంగాన్ని కాపాడేందుకు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి, ధాన్యం కొనబోమనే విషయాన్ని అర్థం చేయించాలని సీఎం కెసీఆర్ కలెక్టర్లను, వ్యవసాయ […] -
దేవుని పేరు చెప్పి.. బీజేపీ రాజకీయం చేస్తుంది : జగ్గారెడ్డి
కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు సంగారెడ్డిలో పాత బస్టాండ్ నుండి కలెక్టరేట్ సి.ఎస్.ఐ చర్చ్ వరకు పెరిగిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలని పాదయాత్ర నిర్వహించారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఈ సందర్భంగా జగ్గా రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 60 రూపాయలు ఉన్నా పెట్రోల్ రూ.110 లకు పెరిగిందని.. రూ. 600 ఉన్న గ్యాస్ ధర.. వెయ్యి రూపాయలు పెరిగాయన్నారు. దీనివల్ల పేద మధ్య,తరగతి కుటుంబాలకు ఆర్థిక […] -
దేవి శ్రీ ప్రసాద్ పై రాజా సింగ్ ఫిర్యాదు !
సమంత నటించిన పుష్ప ఐటెం సాంగ్ పై రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ పాటపై వార్నింగ్ ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్… తాజాగా హైదరాబాద్ పోలీసు కమిషనర్ కు లేఖ రాశారు. డివోషనల్ సాంగ్స్ ను ఐటమ్ సాంగ్ తరహా లో రాయడం పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దేవి శ్రీ ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని లేఖ లో పేర్కొన్నారు రాజసింగ్. దేవి శ్రీ ప్రసాద్ […] -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో 100 మొక్కలు నాటిన కాదంబరి కుటుంబ సభ్యులు
నటుడు, మనం సైతం సేవా సంస్థ వ్యవస్థాపకుడు కాదంబరి కిరణ్ కుటుంబ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. కాదంబరి పెద్ద కుమార్తె సత్య శ్రీకృతి, ఈశ్వర్ వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకుని చిత్రపురి కాలనీ స్వగృహం వద్ద 100 మొక్కలతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో చిత్రపురి కాలనీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్, వసంతరావు, చిత్రపురి కమిటీ సభ్యులు దీప్తి వాజ్ పాయ్, అనిత నిమ్మగడ్డ తదితరులు పాల్గొన్నారు. ఈ […] -
‘విక్రమ్ రాథోడ్’ గా విజయ్ ఆంటోనీ
తమిళ సినిమాల్లో గుర్తింపు ఉన్న హీరో విజయ్ ఆంటోనికి ‘బిచ్చగాడు’తో తెలుగునాట కూడా ఫాలోయింగ్ వచ్చింది. అందరినీ ఆలోచింపచేసే కథాంశాలతో సినిమాలు చేస్తూ వస్తున్న విజయ్ ఆంటోని తాజాగా ‘విక్రమ్ రాథోడ్’ గా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. పెప్సి శివ సమర్పణలో బాబు యోగేశ్వరన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రెమిసెస్ హీరోయిన్. సురేష్ గోపి, సోనూసూద్, యోగిబాబు ఇతర ముఖ్య పాత్రధారులు. ఈ సినిమాకు ఎస్.కౌశల్య రాణి నిర్మాత. దీనిని తెలుగులో రావూరి వెంకటస్వామి విడుదల […] -
జగన్మోహన్ రెడ్డి దంపతులు ఆవిష్కరించిన ‘డబుల్ ధమాకా’
సాక్షి దినపత్రికలో వంద వారాల పాటు ఏకధాటిగా సాగిన పాపులర్ ఇంటర్వ్యూల శీర్షిక ‘డబుల్ ధమాకా’ పుస్తకరూపంలో వెలువడింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య వై.ఎస్. భారతి శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ‘డబుల్ ధమాకా’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సినిమా, సాహిత్యం, రాజకీయం, నృత్యం, సంగీతం, క్రీడలు, టీవీ, సమాజం.. ఇలా వివిధ రంగాలలోని ఇద్దరేసి ప్రముఖులను కూర్చోబెట్టి జర్నలిస్టు ఇందిర పరిమి చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూల సమాహారమే ఈ […] -
బయట రచ్చ గెలిచినా..ఇంట్లో గెలవని శ్రీకాకుళం బడా నేత ?
ఆ జిల్లాలో ఆయన కాకలు తీరిన రాజకీయ నేత. కానీ.. సార్కు మైనస్ మేడమే అని చర్చ ఉంది. తూకానికి సరితూగే వాళ్లకు మేడమ్ టిక్ పెడితే.. సార్ ఓకే చెప్పాలట. కుమారుడి తీరు కూడా ఆయనకు సన్స్ట్రోక్గా మారిందట. గతంలోనూ ఇలాంటి అనుభవాలతో పొలిటికల్గా దెబ్బతిన్నా.. ఆయన వైఖరిలో ఎందుకు మార్పు రాలేదు? ఎవరా నాయకుడు ? ఇంట్లో భార్యాబిడ్డల మాట కాదనలేకపోతున్న ప్రజాప్రతినిధి..! అద్భుతమైన వాక్ చాతుర్యం.. ఎవరినైనా కలుపుకొని వెళ్లే మనస్తత్వం సిక్కోలు […] -
సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ
తెలంగాణ సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలలపై శ్వేత పత్రం విడుదల చేయాలని… నెల రోజుల్లోగా కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు బండి సంజయ్. ఉద్యోగ, ఉపాధ్యాయుల రీఅలాట్ మెంట్ (సర్దుబాటు) కోసం జారీ చేసిన 317 జీవో ప్రభుత్వ అనాలోచిత నిర్ణయానికి […]
తాజావార్తలు
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
Trump-Iran: ఆ విషయంలో ‘పొరపాటు’ జరిగింది.. ట్రంప్ బృందానికి ఇరాన్ రహస్య సందేశం?
-
Train Accident: లోకో పైలట్ అప్రమత్తత.. తప్పిన రైలు ప్రమాదం
-
Akkineni Akhil : నా వల్ల సినిమా దెబ్బ తింటుందేమోనని భయపడ్డాను!
-
Kerala: విషాదం.. పెదవి గాయానికి ఆస్పత్రికి వెళ్తే, చిన్నారి ప్రాణమే పోయింది..
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!