సెప్టెంబర్ నెలలో హైదరాబాద్లో 6,185 రెసిడెన్షియల్ ప్రాపర్టీలు నమోదు అయ్యాయి. 2022లో ఇదే కాలంతో పోలిస్తే 30 శాతం వార్షిక (YoY) పెరుగుదల నమోదైందని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక సూచిస్తుంది.
రేపు హెచ్సీఏ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు తలపిస్తున్నాయి. పోటా పోటీగా ప్రెస్ మీట్ లు, ఒకరిపై ఒకరు ఆరోపణల పర్వం చేసుకుంటున్నారు. దీంతో హెచ్సీఏ ఎన్నికలకూ రాజకీయ రంగు పులుముకుంది. బీఆర్ఎస్-బీజేపీ మద్దతుదారుల మధ్య పోటీ కొనసాగుతుంది.
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొండా సురేఖకు పెను ప్రమాదం తప్పింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా భూపాలపల్లిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆమె ప్రమాదానికి బారిన పడ్డారు.
తెలంగాణ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయవాది జగన్ మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికలకు సర్వం సిద్దం అవుతున్న వేళ, కొన్ని విషయాల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిక్కచ్చిగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది అని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. అసలు అధ్యక్షుడు ఖర్గేను మూలన పడేసిన గాంధీ కుటుంబం.. కుటుంబ పాలన గురించి మాట్లాడటం విడ్డూరం అని ఆయన కామెంట్స్ చేశారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే లిక్కర్ రాణి బతుకమ్మ మీద గౌరమ్మకు బదులు విస్కీ బాటిల్ పెట్టి బతుకమ్మ ఆడుతాదని కవిత ఉద్దేశించి వ్యంగంగా మాట్లాడారు.
విజయవాడలోని ఏపీ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పార్టీ అధ్యక్షురాలు దగ్గబాటి ఫురంధేశ్వర తీరుకు నిరసనగా ఓ మహిళా నాయకురాలు ఆత్మహత్యయత్నం చేసింది.
టీడీనీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడి సతిమణీ నారా భువనేశ్వరిని పార్టీ కార్యక్రమాల్లో యాక్టివేట్ చేయాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. నిజం గెలవాలి పేరుతో వచ్చే వారం నుంచి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఆమె పర్యటించనున్నారు.
ఏపీ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. జగనన్న చేదోడు పథకం లబ్ధిదారుల అకౌంట్లోకి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల 25వేల లబ్దిదారులకు ప్రయోజనం చేకూరనుంది.
చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి.. జైల్లో బంధించిన తీరును గవర్నర్ నజీర్ కు వివరించామని అచ్చెన్నాయుడు చెప్పారు. ముందు అరెస్ట్ చేసి.. ఆ తర్వాత ఆధారాలు సేకరిస్తామని సీఐడీ చేస్తున్న సిగ్గులేని వాదనలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం.. చంద్రబాబుపై పెట్టిన స్కిల్, ఐఆర్ఆర్, ఫైబర్ నెట్ కేసుల్లో ఎలాంటి తప్పిదాలు జరగలేదని వివరించాం..