నాగార్జున సాగర్ నీటిజలాల విడుదల అంశంపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వైపు ఎలక్షన్ జరుగుతుంటే సాగర్ నీటి విడుదల ఆలోచన ఓట్ల కోసమేనంటూ ఆమె మండిపడ్డారు. ఘోరాతి ఘోరమైన పని సాగర్ దగ్గర కొనసాగుతుంది..
లంగాణ సీనియర్ ఐపీఎస్ అధికారి, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ఓటు హక్కును కొండాపూర్ చిరాక్ పబ్లిక్ స్కూల్ లోని 375వ పోలింగ్ బూత్ లో కుటుంబ సభ్యులతో కలిసి వేశారు.
రాజేంద్రనగర్ లోని శాస్త్రిపురం వట్టేపల్లిలోని సెంట్ ఫాయజ్ పోలింగ్ బూత్ నంబర్ 400లో తన ఓటు హక్కును ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. శాస్త్రిపురంలో నా ఓటు హక్కు వినియోగించుకున్నాను..
వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ వివాదంపై సీఈఓ చర్యలు తీసుకోవాలి అని కోరారు. కావాలనే వ్యూహాత్మకంగా ఈ వివాదం సృష్టించారు..
బంజారాహిల్స్లోని పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటేయాలని పిలుపునిచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ బీఆర్ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పోలింగ్ కేంద్రంలోకి పార్టీ కండువాతో వెళ్లడంతో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎల్లపల్లి గ్రామంలో ఓటు హక్కు వేశారు.
కాచిగూడలో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రపంచంలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అద్భుతమైనదని ఆయన తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో ఎన్నికలు గొప్పగా, పండుగలా జరుపుకుంటామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు భద్రత కట్టుదిట్టం చేశామని ఆయన చెప్పుకొచ్చారు.
పాతబస్తీ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. మలక్ పేట్, చార్మినార్, యాకుత్ పురా, చంద్రయాన్ గుట్ట, బహదూర్ పురా, కార్వాన్, గోషామహల్ ఏడు నియోజకవర్గాలో ఎన్నికల పోలింగ్ జరుగనుంది. పాతబస్తీలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్టవంతమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు.
రేపు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నంద్యాల, కడప జిల్లాల పర్యటించనునున్నారు. నంద్యాల జిల్లాలో అవుకు రెండవ టన్నెల్ను జాతికి అంకితం చేయనున్నారు. కడప పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలలో ఆయన పాల్గొననున్నారు.