విదేశీయులు, శరణార్థులకు భారత పాస్ పోర్టులు ఇప్పించిన ముఠా గుట్టురట్టు అయింది. 92 మందికి నకిలీ పాస్ పోర్టులు ఇప్పించి గల్ఫ్ దేశాలకు పంపించారు. ఇక, తెలంగాణ సీఐడీ అధికారులు ఈ ముఠాకు సహకరించిన కొందరిని అరెస్టు చేశారు. హైదరాబాద్, నిజామాబాద్, కోరుట్ల, జగిత్యాలలో 12 మంది నిందితులను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ నకిలీ పత్రాలతో పాస్ పోర్ట్ జారీ కేస్ లో సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేస్తుంది.
Read Also: Budget 2024: ఈ మధ్యంతర బడ్జెట్లో ఉద్యోగులకు ఈ ఐదు అంశాలు ఉండొచ్చు
ఇక, ఆరు జిల్లాల్లో పాస్ పోర్ట్ బ్రోకర్లను అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎక్కువగా పాస్ పోర్ట్ పొందినట్లు గుర్తించారు. కొందరు విదేశీయులకు సైతం నకిలీ పాస్ పోర్ట్ ఇప్పించినట్లు అధికారులు గుర్తించారు. నకిలీ పాస్ పోర్ట్ లతో కొంత మందికి వీసాలు సైతం జారీ అయ్యాయి. కెనడా, స్పెయిన్ దేశాల వీసాలు మంజూరు కావడంపై సీఐడీ అనుమానం వ్యక్తం చేస్తుంది. నకిలీ పాస్ పోర్ట్ లు ఇప్పించడంలో కొంత మంది పోలీస్ అధికారుల హస్తం ఉన్నట్టుగా గుర్తించారు. ఇక, పోలీస్ అధికారుల ప్రమేయంపై సీఐడీ ఆరా తీస్తుంది. పలువురు ఎస్బీ, పాస్ పోర్ట్ సిబ్బంది పాత్రపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే 92 మందికి నకిలీ పత్రాలతో పాస్ పోర్ట్ పొందినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు.