Chandra Shekhar Pamena
Author- NTV Telugu-
Novak Djokovic: ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి వైదొలిగిన జకోవిచ్..
Novak Djokovic: తన కెరీర్లో 25వ గ్రాండ్స్లామ్ను దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న సెర్బియా టెన్నిస్ స్టార్ జకోవిచ్ను గాయంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 సెమీస్లో అలెగ్జాండర్ జ్వెరెవ్పై మ్యాచ్లో బరిలోకి దిగి తొలి సెట్ తర్వాత రిటైర్డ్హర్ట్ ప్రకటించి బయటకు వెళ్లిపోయాడు. -
Mumbai Crime: మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారం.. ప్రైవేట్ భాగాల్లో రాళ్లు, బ్లేడ్!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వసాయ్ బీచ్లో మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత సదరు మహిళ అక్కడి నుంచి తప్పించుకుని రైల్వే స్టేషన్కు చేరుకుని.. ఆటో డ్రైవర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని అధికారులను చెప్పింది. ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా.. సర్జికల్ బ్లేడ్, రాళ్లతో సహా విదేశీ వస్తువులను ఆమె ప్రైవేట్ భాగాలలో బలవంతంగా చొప్పించినట్లు తేలింది. -
BDCC Bank: కర్ణాటకలోని సహకార బ్యాంకులో దోపిడీ.. రూ.2.3 కోట్లు చోరీ
BDCC Bank: కర్ణాటక రాష్ట్రంలోని విజయనగరలోని ఓ సహకార బ్యాంకులో సైబర్ నేరగాళ్లు రూ.2.34 కోట్లు దోచుకున్నారు. కాగా, 2025 జనవరి 10వ తేదీ నుంచి విజయనగరం, బళ్లారి జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బళ్లారి జిల్లా సహకార కేంద్ర (బీడీసీసీ) బ్యాంకుకు చెందిన కస్టమర్ల ఖాతాలకు ఆన్లైన్ లో బదిలీలు జమ కావడం లేదని పలు శాఖలు నివేదించడంతో.. జనవరి 13వ తేదీన ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. -
Bomb Threat: గుజరాత్లోని ఓ ప్రైవేట్ పాఠశాలకు బాంబు బెదిరింపులు..
Bomb Threat: గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో ఓ ప్రైవేట్ పాఠశాలకు ఈరోజు (జనవరి 24) తెల్లవారుజామున 4 గంటలకు క్యాంపస్ను పేల్చివేస్తామని బెదిరింపు ఈ-మెయిల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆ బెదిరింపు మెయిల్ అందుకున్న పాఠశాల అధికారులు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. -
Manish Sisodia: బీజేపీ నాకు ముఖ్యమంత్రి పదవీ ఆఫర్ చేసింది..
Manish Sisodia: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు మనీశ్ సిసోదియా సంచలన కామెంట్స్ చేశారు. తాను తిహాడ్ జైల్లో ఉన్న సమయంలో బీజేపీ తనకు సీఎం పదవిని ఆఫర్ చేసింది.. -
Indian Rupee: రూపాయి పతనంపై దయచేసి ఆర్బీఐ జోక్యం చేసుకోవద్దు..!
Indian Rupee: రోజు రోజుకు అమెరికా డాలరు బలం పుంజుకోవడంతో.. భారత రూపాయి విలువ క్రమంగా క్షీణిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు. రూపాయి విలువను కాపాడటానికి ఆర్బీఐ జోక్యం చేసుకోవడం వల్ల భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. -
Road Accident: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి!
గురువారం అర్ధరాత్రి లక్నోలోని దేవా రోడ్డులో కిరణ్, కుందన్ యాదవ్, బంటీ యాదద్, శోబిత్ యాదవ్లు ఆస్పత్రి నుంచి ఇంటికి వ్యాన్లో బయలు దేరారు. దేవా రోడ్డులో ప్రయాణిస్తున్న వ్యాన్ను ఇన్నోవా కారు అతి వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో.. ఎదురుగా ఉన్న భారీ ట్రక్కును వ్యాన్ ఢీకొట్టడంతో అందులోని నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా.. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
Karnataka: విడాకుల పిటిషన్ను విత్ డ్రా చేసుకోని భార్య.. నిప్పంటించుకుని మృతి చెందిన భర్త
విడాకుల పిటిషన్ను కోర్టులో ఉపసంహరించుకోవాలని మంజునాథ్ తన భార్యను ఒప్పించేందుకు ఆమె నివాసానికి వెళ్లారు. ఇక, అతని ప్రతిపాదనను భార్య తిరస్కరించడంతో పాటు అతడి వల్ల చాలా బాధలు భరించినట్లు ముఖం మీద చెప్పడంతో.. ఆమె ఉంటున్న ఇంటి కారిడార్ ముందు పెట్రోల్ డబ్బాతో వచ్చి నిప్పంటించుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. -
Birthright Citizenship Order: ట్రంప్కి షాక్.. జన్మతః పౌరసత్వ రద్దు ఆదేశాల నిలిపివేసిన ఫెడరల్ కోర్టు
Birthright Citizenship Order: జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేస్తూ యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను సియాటిల్లోని ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. -
Telangana Govt: దావోస్లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డు..
Telangana Govt: దావోస్ లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డులు నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో భారీ పెట్టుబడులను ఆకర్షించింది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో ఇప్పటికే రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణ దక్కించుకుంది.
తాజావార్తలు
-
Nara Lokesh : ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే..
-
Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
-
Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
-
Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
-
Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!