Amaravati Restart Event Live Updates: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో మహోన్నత ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభోత్సవ కార్యక్రమం మొదలు కానుంది.
Jagtial: మూడు రోజులుగా అటవీ ప్రాంతంలో తిరుగుతూ దీనస్థితిలో ఉన్న ఓ వృద్ధురాలిని ఈ రోజు (మే 1న) జగిత్యాల సఖి కేంద్రానికి తరలించారు. గొల్లపల్లి మండలం శ్రీరాముల పల్లె గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలోని పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులకు ములుగుతున్న ఓ వృద్ధురాలి రోదనలు వినిపించాయి.
తెలంగాణ సీనియర్ ఐఎఎస్ అధికారి జయేష్ రంజన్. గడిచిన పదేళ్ళుగా... ఐటి, ఇండస్ట్రీస్ స్పెషల్ సీఎస్గా కొనసాగుతూ వచ్చారాయన. కానీ... ఇటీవల జరిగిన బదిలీల్లో స్పీడ్ సీఈఓగా ఆయన్ని నియమించింది ప్రభుత్వం. కానీ... ఇప్పటి వరకు ఆ సంస్థ కార్యకలాపాలు కొనసాగించేందుకు ప్రత్యేక ఆఫీసు అంటూ ఏది లేదు. దాని కోసం వెదుకులాట కొనసాగుతోందట.
తుంగతుర్తి కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒకటి ఎమ్మెల్యే మందుల సామేల్ వెంట ఉంటే.. మరొక వర్గం జిల్లా సీనియర్ నేతల వెంట నడుస్తోందన్నది ఓపెన్ టాక్. కొంత కాలంగా రెండు వర్గాల క్యాడర్ మధ్య మాటలు పేలుతున్నాయి.
అంతన్నాడింతన్నాడు.. అంతే లేకుండా పోయాడు. ఈసారి నేను ఓడిపోతే... మీసం తీసేసుకుంటానంటూ.. మెలేసి మరీ ఒట్టేశాడు. ఇప్పుడు మీసం సంగతి దేవుడెరుగు.. అసలు మనిషే కనిపించకుండా మాయమైపోయాడంటూ.... రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి గురించి మాట్లాడుకుంటున్నారట నియోజకవర్గంలో.
లోక్సభ సభ్యుడు.... తన నియోజక వర్గంలో ఎక్కడైనా సరే.. ఎమ్మెల్యేలకు ముందస్తు సమాచారం ఇచ్చి తిరగొచ్చు. సొంత పార్టీ ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా చెప్పాలి. ఉద్దేశ్యపూర్వకంగా గొడవ పెట్టుకోవాలనుకుంటే తప్ప.. సాధారణంగా లొల్లి ఎందుకులే అనుకుంటూ అందర్నీ కలుపుకుని పోతుంటారు ఎంపీలు. కానీ.... నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవికి ఇప్పుడో చిక్కొచ్చి పడిందట.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కొండెక్కిన ప్రతి భక్తుడు తృప్తిగా శ్రీవారి అన్న ప్రసాదాన్ని స్వీకరిచేలా ఏర్పాట్లు చేసింది టీటీడీ. నిత్యాన్నదానంతోపాటు దర్శనాంతరం ఆలయంలో ప్రసాదాలు పంపిణీ చేస్తుంది దేవస్థానం.
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులు వేగవంతానికి చర్యలు చేపట్టి 2027 మార్చి నాటికి ఉదండాపూర్ వరకు నీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రాజెక్టుల కోసం భూ సేకరణకు సత్వర చర్యలకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నాం.. పాలమూరు జిల్లా గత బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైంది అని ఆరోపించారు.
ACB: తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. అవినీతి, అక్రమాస్తుల కేసుల నమోదుతో దూసుకెళ్తుంది. కేవలం 2025 ఏప్రిల్ నెలలో మొత్తం 21 కేసుల నమోదు అయ్యాయి.