Minister Uttam Kumar: పాలమూరు జిల్లాను గత బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైంది..
- ఎస్ఎల్బీసీ టన్నెల్ లో మరణించిన వారి కుటుంబాలకు అండగా ఉంటాం..
- ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తాం..
- పాలమూరు జిల్లాను గత బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైంది: మంత్రి ఉత్తమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Uttam Kumar: ఎస్ఎల్బీసీ టన్నెల్ సంఘటన దురదృష్టకరం అని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. బాధ్యతగా ఆ కుటుంబ సభ్యులను ఆదుకుంటాం.. దొరకని ఆరు మృతదేహాలు బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాం.. ప్రభుత్వపరంగా ఒక్కో కుటుంబానికి 25 లక్షల నష్ట పరిహారం చెల్లించాం.. జియో లాజికల్ సర్వే సూచన మేరకే రెస్కూ ఆపరేషన్ నిలిపివేశాం.. ఆరు మృతదేహాల ఘటన స్థలంలో క్రిటికల్ కండిషన్ ఉంది, రెస్క్యూ సిబ్బంది ప్రాణాలకు ముప్పు పొంచి ఉండటంతో పనులు ఆపేశాం.. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల పూర్తి కోసం హై లెవెల్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ వేశామన్నారు. 2026 మార్చి 31వ తేదీ వరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ హామీ ఇచ్చారు.
Read Also: ACB: తెలంగాణలో ఏసీబీ దూకుడు.. ఒక్క ఏప్రిల్లోనే 21 కేసులు..
Also Read
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
- CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
- CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
అయితే, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులు వేగవంతానికి చర్యలు చేపట్టి 2027 మార్చి నాటికి ఉదండాపూర్ వరకు నీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రాజెక్టుల కోసం భూ సేకరణకు సత్వర చర్యలకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నాం.. పాలమూరు జిల్లా గత బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైంది అని ఆరోపించారు. టీఆర్ఎస్ హయాంలో కృష్ణా నది జలాల కేటాయింపులో పాలమూరు, నల్లగొండకు తీరని అన్యాయం జరిగింది అన్నారు. 819 టీఎంసీల కృష్ణ జలాలను ఆంధ్రకు కేటాయిస్తుంటే.. కేసీఆర్ సర్కార్ చోద్యం చూసిందన్నారు. 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు వాటా దక్కింది.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం లక్ష కోట్ల ప్రజాధనం గోదావరి పాలు చేశారు.. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు మరో రెండు ఏళ్లలో పూర్తి చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
-
Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్ల్యాండ్పై డెన్మార్క్తో డీల్..
-
Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
-
Trump-Jinping: 24న వైట్హౌస్లో జిన్పింగ్కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
-
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!