Jagtial: అడవిలో ఒంటరిగా వృద్ధురాలు.. విషాద కథలో బిగ్ ట్విస్ట్!
- మూడు రోజులుగా అటవీ ప్రాంతంలో వృద్ధురాలు..!
- జగిత్యాలలో వృద్ధురాలి కాళ్లు చేతులు కట్టేసిన కూతురు, మనవడు..
- గుట్ట బోరు ప్రాంతంలో గత మూడు రోజులుగా భూధవ్వ..
- డిడబ్ల్యూవోకు సమాచారం అందజేసిన స్థానిక రైతులు..
- వృద్ధురాలికి ఆశ్రయం కల్పించిన సఖి కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagtial: మూడు రోజులుగా అటవీ ప్రాంతంలో తిరుగుతూ దీనస్థితిలో ఉన్న ఓ వృద్ధురాలిని ఈ రోజు (మే 1న) జగిత్యాల సఖి కేంద్రానికి తరలించారు. గొల్లపల్లి మండలం శ్రీరాముల పల్లె గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలోని పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులకు ములుగుతున్న ఓ వృద్ధురాలి రోదనలు వినిపించాయి.
Read Also: Gurpatwant Singh Pannun: పాక్పై యుద్ధంలో సిక్కులు పాల్గొనవద్దు.. ఖలిస్తాన్ ఉగ్రవాది పిలుపు..
Also Read
వివరాల్లోకి వెళితే.. ఆ వృద్ధురాలికి ఉన్న పొలం మొత్తం రాయించుకొని, ఒంటి మీద బంగారం తీసుకొని కన్న కూతురు ఇంట్లో నుంచి నాలుగు రోజుల క్రితం తరిమేసింది. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు.. ఏం చేయాలో తెలియక రాత్రి పూట ఊత కర్ర సాయంతో బిక్కుబిక్కుమంటూ రోడ్డెక్కింది. కంటిలో నీళ్లు దిగమింగుకుంటూ అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ గుర్తుకు వచ్చిన.. వెనక్కి వెళ్లలేదు గమ్యం లేని ప్రయాణం కొనసాగించింది ఆ వృద్ధురాలు. చాలా దూరం నడిచిన తర్వాత అడవి ప్రాంతంలో సొమ్మసిల్లి పడిపోయింది. ఆమె అలికిడి శబ్దాలు విని స్థానికులు అధికారులకు సమాచారం అందించగా.. అధికారులు వచ్చి ఆమెకు కట్టేసి ఉన్న తాళ్ల విప్పి.. ఏ ఊరు మీది ఏమైందంటూ ఆ వృద్ధురాలిను అడగగా.. తన గాధను వెల్లబోసుకుంది.
Read Also: Top Headlines @9PM : టాప్ న్యూస్!
కాగా, తన పేరు వేల్పల భూధవ్వ అని.. తమది జగిత్యాల జిల్లా కేంద్రం ఇస్లాంపురా అని తెలిపింది. తన భర్త చనిపోయిన తర్వాత నా కూతురు ఈశ్వరి అత్తగారి ఊరు నర్సింగాపూర్ గ్రామంలోని వాళ్ల ఇంట్లో ఉంటున్నానని చెప్పుకొచ్చింది. ఇటీవల జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ఎకరం భూమిని, ఇంటిని కూతురు తన పేరుట రిజిస్ట్రేషన్ చేయించుకుంది.. ఆ తర్వాత నన్ను వేధించడం మొదలు పెట్టింది.. నా బిడ్డ నా మనవడే నన్ను కొట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారని కన్నీరు మున్నీరై విలపించింది. దీంతో ఏం చేయాలో తెలియక ఇలా ఇళ్లు వదిలి పెట్టి బయటకు వచ్చాను అని భూధవ్వ తెలిపింది. ఇక, అధికారులు ప్రస్తుతానికి భూదవ్వను సఖి కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తన సంచిలో ఉన్న కూతురు ఈశ్వరి ఫోన్ నెంబర్ అధికారులకు ఇవ్వగా.. ఆఫీసర్లు ఆమెకు చేయగా తనకేం సంబంధం లేదంటూ కాల్ కట్ చేసింది. రిజిస్టేషన్ శాఖ ద్వారా భూమి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
తాజావార్తలు
-
Nithya Menen : నిర్మాణ రంగంపై నిత్యామీనన్ ఫోకస్
-
Raaz Actress: అప్పుడు దెయ్యంగా భయపెట్టిన నటి.. ఇప్పుడు ఫామ్స్టే నడుపుతూ ప్రశాంత జీవితం..
-
India Missile Test: సాహో భారత్.. శత్రు దేశాలకు వార్నింగ్ సిగ్నల్! అడ్వాన్స్డ్ అగ్ని సిరీస్లో కీలక టెస్ట్..
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
ట్రెండింగ్
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!