Jagtial: అడవిలో ఒంటరిగా వృద్ధురాలు.. విషాద కథలో బిగ్ ట్విస్ట్!
- మూడు రోజులుగా అటవీ ప్రాంతంలో వృద్ధురాలు..!
- జగిత్యాలలో వృద్ధురాలి కాళ్లు చేతులు కట్టేసిన కూతురు, మనవడు..
- గుట్ట బోరు ప్రాంతంలో గత మూడు రోజులుగా భూధవ్వ..
- డిడబ్ల్యూవోకు సమాచారం అందజేసిన స్థానిక రైతులు..
- వృద్ధురాలికి ఆశ్రయం కల్పించిన సఖి కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagtial: మూడు రోజులుగా అటవీ ప్రాంతంలో తిరుగుతూ దీనస్థితిలో ఉన్న ఓ వృద్ధురాలిని ఈ రోజు (మే 1న) జగిత్యాల సఖి కేంద్రానికి తరలించారు. గొల్లపల్లి మండలం శ్రీరాముల పల్లె గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలోని పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులకు ములుగుతున్న ఓ వృద్ధురాలి రోదనలు వినిపించాయి.
Read Also: Gurpatwant Singh Pannun: పాక్పై యుద్ధంలో సిక్కులు పాల్గొనవద్దు.. ఖలిస్తాన్ ఉగ్రవాది పిలుపు..
Also Read
వివరాల్లోకి వెళితే.. ఆ వృద్ధురాలికి ఉన్న పొలం మొత్తం రాయించుకొని, ఒంటి మీద బంగారం తీసుకొని కన్న కూతురు ఇంట్లో నుంచి నాలుగు రోజుల క్రితం తరిమేసింది. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు.. ఏం చేయాలో తెలియక రాత్రి పూట ఊత కర్ర సాయంతో బిక్కుబిక్కుమంటూ రోడ్డెక్కింది. కంటిలో నీళ్లు దిగమింగుకుంటూ అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ గుర్తుకు వచ్చిన.. వెనక్కి వెళ్లలేదు గమ్యం లేని ప్రయాణం కొనసాగించింది ఆ వృద్ధురాలు. చాలా దూరం నడిచిన తర్వాత అడవి ప్రాంతంలో సొమ్మసిల్లి పడిపోయింది. ఆమె అలికిడి శబ్దాలు విని స్థానికులు అధికారులకు సమాచారం అందించగా.. అధికారులు వచ్చి ఆమెకు కట్టేసి ఉన్న తాళ్ల విప్పి.. ఏ ఊరు మీది ఏమైందంటూ ఆ వృద్ధురాలిను అడగగా.. తన గాధను వెల్లబోసుకుంది.
Read Also: Top Headlines @9PM : టాప్ న్యూస్!
కాగా, తన పేరు వేల్పల భూధవ్వ అని.. తమది జగిత్యాల జిల్లా కేంద్రం ఇస్లాంపురా అని తెలిపింది. తన భర్త చనిపోయిన తర్వాత నా కూతురు ఈశ్వరి అత్తగారి ఊరు నర్సింగాపూర్ గ్రామంలోని వాళ్ల ఇంట్లో ఉంటున్నానని చెప్పుకొచ్చింది. ఇటీవల జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ఎకరం భూమిని, ఇంటిని కూతురు తన పేరుట రిజిస్ట్రేషన్ చేయించుకుంది.. ఆ తర్వాత నన్ను వేధించడం మొదలు పెట్టింది.. నా బిడ్డ నా మనవడే నన్ను కొట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారని కన్నీరు మున్నీరై విలపించింది. దీంతో ఏం చేయాలో తెలియక ఇలా ఇళ్లు వదిలి పెట్టి బయటకు వచ్చాను అని భూధవ్వ తెలిపింది. ఇక, అధికారులు ప్రస్తుతానికి భూదవ్వను సఖి కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తన సంచిలో ఉన్న కూతురు ఈశ్వరి ఫోన్ నెంబర్ అధికారులకు ఇవ్వగా.. ఆఫీసర్లు ఆమెకు చేయగా తనకేం సంబంధం లేదంటూ కాల్ కట్ చేసింది. రిజిస్టేషన్ శాఖ ద్వారా భూమి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
తాజావార్తలు
-
KVN : విజయ్ లెగసీకి అదిరిపోయే ట్రిబ్యూట్.. ‘జన నాయకుడు’
-
CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్పై దర్యాప్తు
-
Murali Kishor: ‘లెనిన్’ డైరెక్టర్కు బిగ్ ఛాన్స్.. సితారలోనే నెక్స్ట్ మూవీ! ఆ స్టార్ హీరో సినిమా?
-
Ramayana : బడ్జెట్ 4000 కోట్లు.. బిజినెస్ 250 కోట్లా?
-
Telangana Eco Tourism : తెలంగాణ ఎకో టూరిజం బూస్ట్.. కొత్త మాస్టర్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!