Jagtial: అడవిలో ఒంటరిగా వృద్ధురాలు.. విషాద కథలో బిగ్ ట్విస్ట్!
- మూడు రోజులుగా అటవీ ప్రాంతంలో వృద్ధురాలు..!
- జగిత్యాలలో వృద్ధురాలి కాళ్లు చేతులు కట్టేసిన కూతురు, మనవడు..
- గుట్ట బోరు ప్రాంతంలో గత మూడు రోజులుగా భూధవ్వ..
- డిడబ్ల్యూవోకు సమాచారం అందజేసిన స్థానిక రైతులు..
- వృద్ధురాలికి ఆశ్రయం కల్పించిన సఖి కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagtial: మూడు రోజులుగా అటవీ ప్రాంతంలో తిరుగుతూ దీనస్థితిలో ఉన్న ఓ వృద్ధురాలిని ఈ రోజు (మే 1న) జగిత్యాల సఖి కేంద్రానికి తరలించారు. గొల్లపల్లి మండలం శ్రీరాముల పల్లె గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలోని పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులకు ములుగుతున్న ఓ వృద్ధురాలి రోదనలు వినిపించాయి.
Read Also: Gurpatwant Singh Pannun: పాక్పై యుద్ధంలో సిక్కులు పాల్గొనవద్దు.. ఖలిస్తాన్ ఉగ్రవాది పిలుపు..
Also Read
వివరాల్లోకి వెళితే.. ఆ వృద్ధురాలికి ఉన్న పొలం మొత్తం రాయించుకొని, ఒంటి మీద బంగారం తీసుకొని కన్న కూతురు ఇంట్లో నుంచి నాలుగు రోజుల క్రితం తరిమేసింది. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు.. ఏం చేయాలో తెలియక రాత్రి పూట ఊత కర్ర సాయంతో బిక్కుబిక్కుమంటూ రోడ్డెక్కింది. కంటిలో నీళ్లు దిగమింగుకుంటూ అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ గుర్తుకు వచ్చిన.. వెనక్కి వెళ్లలేదు గమ్యం లేని ప్రయాణం కొనసాగించింది ఆ వృద్ధురాలు. చాలా దూరం నడిచిన తర్వాత అడవి ప్రాంతంలో సొమ్మసిల్లి పడిపోయింది. ఆమె అలికిడి శబ్దాలు విని స్థానికులు అధికారులకు సమాచారం అందించగా.. అధికారులు వచ్చి ఆమెకు కట్టేసి ఉన్న తాళ్ల విప్పి.. ఏ ఊరు మీది ఏమైందంటూ ఆ వృద్ధురాలిను అడగగా.. తన గాధను వెల్లబోసుకుంది.
Read Also: Top Headlines @9PM : టాప్ న్యూస్!
కాగా, తన పేరు వేల్పల భూధవ్వ అని.. తమది జగిత్యాల జిల్లా కేంద్రం ఇస్లాంపురా అని తెలిపింది. తన భర్త చనిపోయిన తర్వాత నా కూతురు ఈశ్వరి అత్తగారి ఊరు నర్సింగాపూర్ గ్రామంలోని వాళ్ల ఇంట్లో ఉంటున్నానని చెప్పుకొచ్చింది. ఇటీవల జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ఎకరం భూమిని, ఇంటిని కూతురు తన పేరుట రిజిస్ట్రేషన్ చేయించుకుంది.. ఆ తర్వాత నన్ను వేధించడం మొదలు పెట్టింది.. నా బిడ్డ నా మనవడే నన్ను కొట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారని కన్నీరు మున్నీరై విలపించింది. దీంతో ఏం చేయాలో తెలియక ఇలా ఇళ్లు వదిలి పెట్టి బయటకు వచ్చాను అని భూధవ్వ తెలిపింది. ఇక, అధికారులు ప్రస్తుతానికి భూదవ్వను సఖి కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తన సంచిలో ఉన్న కూతురు ఈశ్వరి ఫోన్ నెంబర్ అధికారులకు ఇవ్వగా.. ఆఫీసర్లు ఆమెకు చేయగా తనకేం సంబంధం లేదంటూ కాల్ కట్ చేసింది. రిజిస్టేషన్ శాఖ ద్వారా భూమి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
తాజావార్తలు
-
Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
-
Astrology: ఆగస్టు 11 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!