Amaravati Restart Event Live Updates: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో మహోన్నత ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ఆంధ్రుల కల సాకారం కానుంది. ఐదు కోట్ల మంది ఆంధ్రులు ఆశగా ఎదుకు చూస్తున్న అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభోత్సవ కార్యక్రమం కొనసాగింది. ‘అమరావతి పునఃప్రారంభం’ పేరుతో ఈ వేడుకను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధాని మోడీ రాష్ట్రంలో రూ. 57,980 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మరింత సమాచారం కోసం చూస్తునే ఉండండి.. ఎన్టీవీ లైవ్ అప్డేట్స్..