Jayaho BC Mahasabha: బీసీలపై జగన్ ఫోకస్.. ఒక్క రోజు ముందుగానే ‘జయహో బీసీ మహాసభ’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీసీలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. డిసెంబర్ 8వ తేదీన చేపట్టాలనుకున్న బీసీల ఆత్మీయ సదస్సు ఒక రోజు ముందే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.. డిసెంబర్ 7వ తేదీన భారీ ఎత్తున బీసీ సదస్సు ఉంటుంది.. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో సమావేశం జరగనుండగా.. 60 వేల నుంచి 75 వేల వరకు బీసీ నేతలు హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు.. గ్రామ పంచాయతీ సభ్యుల నుంచి మంత్రుల వరకు హాజరుకానున్న ప్రజా ప్రతినిధులు.. నామినేటెడ్ పోస్టులో ఉన్న బీసీ నేతలు, పార్టీలోనే వివిధ విభాగాల్లో ఉన్న బీసీ నాయకులు పాల్గొనబోతున్నారు.. ఇక, 7న నిర్వహించనున్న సభకు జయహో బీసీ మహాసభగా నామకరణం చేశారు.. వెనుకబడిన కులాలే వెన్నెముక టాగ్ లైన్ పెట్టారు. 15 నుంచి 20 మంది వరకు బీసీ మంత్రులు, ఎంపీలు వేదిక మీద నుంచి ఉపన్యాసించే అవకాశం ఉండగా.. ఒక్కొక్కరికి ఐదు నుంచి పది నిమిషాలు మాట్లాడే అవకాశం ఉంది..
Read Also: Vaikunta Dwara Darshanam: శ్రీవారి భక్తులకు అలర్ట్.. టికెట్లు ఉంటేనే వైకుంఠ ద్వార దర్శనం..
Also Read
- CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. భువివాదాలు లేకుండా చేస్తాం..
- Kodali Nani: రావణ్ వ్యవహారంపై మళ్లీ స్పందించిన కొడాలి నాని.. ఘాటు వ్యాఖ్యలు..
- Thopudurthi Prakash Reddy Vs MLA MS Raju: తోపుదుర్తి–ఎంఎస్ రాజు వివాదంలో బిగ్ ట్విస్ట్.. అద్దె ఇంటి కొనుగోలుతో సంచలనం..
- Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్కు చికిత్స.. రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం..
మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు బీసీ నేతలను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడే అవకాశం ఉంది.. ఇక, రేపు ఉదయం 11 గంటలకు స్టేడియంను పరిశీలించనున్నారు బీసీ మంత్రులు, నేతలు.. జయహో బీసీ మహాసభ పోస్టర్ను కూడా విడుదల చేయబోతున్నారు.. సభ నిర్వహణకు మూడు కమిటీల ఏర్పాటు చేశారు.. అకామిడేషన్ కమిటీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే పార్థసారథి, ట్రాన్స్పోర్టు కమిటీ అధ్యక్షుడు చిన్న సీను, ఫుడ్ కమిటీ అధ్యక్షుడుగా మంత్రి కార్మూరు నాగేశ్వరరావు వ్యవహరిస్తున్నారు.. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. దాదాపు రెండు గంటల పాటు ముఖ్యమంత్రి సదస్సులో ఉండే అవకాశం ఉందంటున్నారు.. ఉదయం ఎనిమిది గంటలకు బ్రేక్ ఫాస్ట్ రిజిస్ట్రేషన్స్తో ప్రారంభం కానున్న సభ ప్రక్రియ.. 10:30 నుంచి ఉపన్యాసాలు ఉంటాయి.. మధ్యాహ్నం రెండు గంటల వరకు సభ నిర్వహణ ఉండబోతోంది. సదస్సు వేదిక మీద 200 మంది ప్రజాప్రతినిధులు.. బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ఎంపీలు, బీసీ కార్పొరేషన్ లో ఛైర్మన్లు ఇతర కార్పొరేషన్ లో ఛైర్మన్లకు చోటు కల్పించనున్నారు. ఈ మూడున్నర ఏళ్లలో తమ ప్రభుత్వం బీసీలకు చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయనుంది వైసీపీ.. ఐదేళ్ల టీడీపీ పాలనలో బీసీలకు అన్యాయం చేశారనే అంశాన్ని ఈ వేదికగా వివరించబోతోంది వైసీపీ.
తాజావార్తలు
-
Musi Riverfront Project: రూ.7,345 కోట్ల పరిపాలనా అనుమతి.. 21 కి.మీ. మేర అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్.!
-
CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. భువివాదాలు లేకుండా చేస్తాం..
-
Dy. CM Bhatti Vikramaraka: ఎన్ని సమస్యలు ఉన్నా రైతు భరోసా ఇచ్చాం..
-
Agadha:14 మిలియన్ వ్యూస్తో సంచలనం.. ఎంఎస్ రాజు ‘అగధ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Konda Surekha: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో విభేదాల చర్చ.. మాజీమంత్రిపై మంత్రి ఫిర్యాదు.!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!